icon icon icon
icon icon icon

తెదేపా జెండాలను కాళ్లతో తొక్కి వీరంగం

వైకాపా కార్యకర్తలు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వీరంగం సృష్టించారు. పెనమలూరు వైకాపా అభ్యర్థి, మంత్రి జోగి రమేష్‌ గురువారం సాయంత్రం ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 10 May 2024 08:50 IST

ప్రశ్నించిన వారిపై వైకాపా కార్యకర్తల దాడి

గంగూరు(పెనమలూరు), న్యూస్‌టుడే: వైకాపా కార్యకర్తలు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వీరంగం సృష్టించారు. పెనమలూరు వైకాపా అభ్యర్థి, మంత్రి జోగి రమేష్‌ గురువారం సాయంత్రం ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగూరు కూడలి వద్ద విద్యుత్తు స్తంభానికి కట్టి ఉన్న తెదేపా జెండాలను కొందరు వైకాపా కార్యకర్తలు ఊడదీసి కాళ్లతో తొక్కడంతో తెదేపా సానుభూతిపరులు వారిని వారించడానికి యత్నించారు. దీంతో వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా తెదేపా కార్యకర్తలపై విరుచుకుపడి చితకబాదారు. ఈ దాడిలో పెనమలూరు, గంగూరులకు చెందిన వైకాపా కార్యకర్తలున్నట్లు తెదేపా శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సీఆర్‌పీఎఫ్‌, పెనమలూరు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img