Polar Bear Jail : ధ్రువపు ఎలుగుబంట్ల జైలు.. అందులో వేస్తే సత్ప్రవర్తన ఖాయం!
‘పోలార్ బేర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా కెనడా(Canada)లోని చర్చిల్ ప్రాంతం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ నివాసాలపై దాడికి యత్నించే ధ్రువపు ఎలుగుబంట్ల(Polar Bear)ను బంధించడానికి ఓ ప్రత్యేకమైన జైలు(Jail)ను ఏర్పాటు చేశారు. ఆ విశేషాలేంటో చదివేయండి.
కెనడా(Canada)లోని చర్చిల్కు చెందిన వన్యప్రాణి సంరక్షణ అధికారికి ఉదయాన్నే ఓ ఫోన్(Phone) కాల్ వచ్చింది. పట్టణంలో ధ్రువపు ఎలుగుబంటి(Polar Bear) సంచరిస్తోందని, దాన్ని బంధించాలని అవతలి వ్యక్తి ఫిర్యాదు చేశారు. వెంటనే తన బృందంతో రంగంలోకి దిగిన ఆ అధికారి ధ్రువపు ఎలుగుబంటి ఉన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆహారం దొరక్కపోవడంతో ఆ ఎలుగుబంటి కోపంతో ఇంటి కిటికీని బలంగా బాదుతోంది. దాంతో మత్తు తూటా అమర్చిన గన్(Gun)తో దాన్ని షూట్ చేశారు. అప్పటి వరకు బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి కాస్త మెత్తబడింది. మత్తు ప్రభావంతో ఓ చోట కుప్పకూలింది. వెంటనే అధికారులు వలలో దాన్ని బంధించి ‘పోలార్ బేర్ జైలు’కు తరలించారు.
దాడి చేస్తే కాల్చేసేవారు!
గతంలో చర్చిల్లో ధ్రువపు ఎలుగుబంట్లు మనుషులపై దాడి చేయడానికి యత్నిస్తే వాటిని కాల్చి చంపేవారు. ఆహారం(Food) కోసం నివాసాల మధ్యలోకి వచ్చి అవి తూటాలకు బలయ్యేవి. కొన్నిసార్లు ఎలుగుబంట్లు దాడి చేయడంతో మనుషులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో 1982లో తొలిసారి వాటిని బంధించడం మొదలుపెట్టారు. ‘హౌస్ డి-20’ పేరుతో ఉన్న భవనంలోకి ఎలుగుబంట్లను తరలించేవారు. ఈ భవనాన్ని గతంలో మిలటరీ అధికారులు శవాగారంలా ఉపయోగించేవారు. కాలక్రమంలో ఇదే ‘పోలార్ బేర్ జైల్’గా మారింది. అధికారికంగా దీన్ని ‘పోలార్ బేర్ హోల్డింగ్ ఫెసిలిటీ’గా పిలుస్తుంటారు. తొలుత ఈ జైలులో 20 సెల్స్ ఉండేవి. తరువాత అవసరాలు పెరగడంతో 28కి విస్తరించారు.
బంధిస్తే ఏమవుతుంది?
జైలు గదుల్లో రెండు ధ్రువపు ఎలుగుబంట్లను ఒక చోట కలిపి ఉంచితే అవి ఘర్షణకు దిగుతాయట. అందుకే విడివిడిగానే సెల్లో ఉంచుతారు. సాధారణంగా 2 నుంచి 30 రోజులపాటు ధ్రువపు ఎలుగుబంట్లను సెల్స్లోనే బంధిస్తారు. ఆ సమయంలో వాటి ప్రవర్తనలో మార్పును నిశితంగా గమనిస్తారు. ఒక చోట బంధించడం వల్ల ఎలుగుబంట్లు తాము జనావాసాల్లోకి వెళితే చిక్కుల్లో పడతామనే భావనకు వస్తాయి. వాటికి అవసరం మేరకు నీరు తప్ప ఆహారం కూడా ఇవ్వరు. ఎందుకంటే సహజంగానే ధ్రువపు ఎలుగుబంట్లకు ఆహారం లేకుండా కొన్ని నెలలపాటు జీవించగలిగే శక్తి ఉంటుంది. పైగా ఆహారం, నీరు ఇవ్వడం మొదలుపెడితే అవి జైలు వాతావరణానికి అలవాటుపడిపోతాయి. జైలు జీవితం పట్ల విరక్తి చెందిన ఎలుగుబంట్లు గోడలకు ఆనుకొని దీనంగా కూర్చుండిపోతాయి. ఎలుగుబంట్లకు ఆ శిక్ష సరిపోతుందని భావిస్తే వాటిని తిరిగి మంచు ప్రదేశంలో వదిలివేస్తారు. హుడ్సన్ బేలో సాధారణంగా వేసవి కాలంలో మంచు కరిగిపోతుంది. చలికాలంలో మంచు గడ్డకట్టడం మొదలవుతుంది. అందుకే చలికాలం మొదలుకాగానే వాటికి మత్తుమందు ఇచ్చి హెలికాప్టర్లలో తీసుకెళ్లి మంచు ప్రదేశాల్లో వదిలిపెడతారు.
మంచు కరిగి.. ఆహారం కరవు!
ప్రపంచంలో దాదాపు 31 వేల ధ్రువపు ఎలుగుబంట్లు ఉన్నట్లు ఒక అంచనా. కెనడాలోని చర్చిల్లో 850 నివాసాలున్నాయి. ఈ పట్టణానికి సమీపంలో ‘హడ్సన్ బే’లోనూ దాదాపు 900లకు పైగా ధ్రువపు ఎలుగుబంట్లు జీవిస్తున్నాయి. ఈ ధ్రువపు ఎలుగుబంట్లను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. చలికాలంలో మంచుతో గడ్డకట్టిన ఈ ప్రాంతంలో అవి సీల్స్ను వేటాడుతాయి. జులైలో మంచు కరగడం ప్రారంభం కాగానే మంచును విడిచి ధ్రువపు ఎలుగుబంట్లు నేలపైకి వెళ్లిపోతాయి. దాంతో వాటికి ఆహారం కరవవుతుంది.
అప్పటికే గతంలో తిన్న ఆహారాన్ని శరీరంలో కొవ్వుగా మార్చుకొని ఉంటాయి. ఆ కొవ్వు సహాయంతో కొన్ని నెలలపాటు ఆహారం లేకుండానే మనుగడ సాగించగలుగుతాయి. కొన్నిసార్లు మాత్రం ఆహారాన్వేషణలో భాగంగా జనావాసాల్లో వెళ్లే ప్రయత్నం చేస్తాయి. కెనడా అధికారిక లెక్కల ప్రకారం ధ్రువపు ఎలుగుబంట్ల జనాభా గత ఐదేళ్లలో 27 శాతం తగ్గింది. ప్రతి సంవత్సరం మంచు తగ్గడం మూలంగా ధ్రువపు ఎలుగుబంట్ల వేటకు కావాల్సినన్ని సీల్స్ దొరకడం లేదు. దాంతో అవి కొవ్వును దాచుకోవడం గగనమైపోయినట్లు సమాచారం.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.