‘కిమ్’ మృతిపై అప్పట్లోనూ వార్తలే వార్తలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అస్వస్థతకు గురయ్యారని, బ్రెయిన్ డెడ్ అయ్యారని అంతర్జాతీయ పత్రికలు కథనాలు రాసిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరకొరియా ఇప్పటివరకు దీనిపై సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఈ వదంతులు బలపడుతున్నాయి. మనిషికి ఏమైందో
పెద్ద కిమ్ విషయంలో జరిగిందిదే!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అస్వస్థతకు గురయ్యారని, బ్రెయిన్ డెడ్ అయ్యారని అంతర్జాతీయ పత్రికలు కథనాలు రాసిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరకొరియా ఇప్పటివరకు దీనిపై సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఈ వదంతులు బలపడుతున్నాయి. మనిషికి ఏమైందో తెలియకుండా ఈ పుకార్లేంటి... అనుకుంటున్నారా? గతంలోనూ ఉత్తర కొరియాలో ఇలానే జరిగింది. అదెవరికో కాదు కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ విషయంలో. ఆయన చనిపోయారని, ఆయన డూప్తో దేశంలో పరిపాలన సాగేలా చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి.. అసలు కిమ్ జోంగ్ ఇల్ విషయంలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం.
కిమ్ జోంగ్ ఇల్పై జపాన్కు చెందిన ఓ వారపత్రిక 2008 ఆగస్టులో ఓ కథనం రాసింది. కిమ్ జోంగ్ ఇల్ 2003లోనే మధుమేహంతో చనిపోయారని, ఆయన స్థానంలో అచ్చంలాగే ఉండే వ్యక్తిని నియమించారని పేర్కొంది. ఇదే విషయంపై ‘ది ట్రూ క్యారెక్టర్ ఆఫ్ కిమ్ జోంగ్ ఇల్’ అనే పుస్తకాన్ని ఉటంకిస్తూ వాసెడా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ తోషిమిత్సు షిగెమురా వివరణ ఇచ్చారు. కిమ్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు, జపాన్.. దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఇల్ 2000 సంవత్సరంలోనే తీవ్రమైన మధుమేహంతో బాధపడ్డారట. ఆ తర్వాత మూడున్నరేళ్లు చక్రాల కుర్చీకే పరిమితమై 2003లో చనిపోయారట. డూప్ను చూపించి కిమ్ ఇల్ బతికే ఉన్నారని, నమ్మించారని షిగెమురా చెప్పుకొచ్చారు. 2004, అంతకుముందు కిమ్ ఇల్ మాటలను వాయిస్ అనాలసిస్ చేయగా.. రెండు వాయిస్లు వేర్వేరుగా ఉన్నాయని నిర్ధరణ అయిందట. కానీ ఈ విషయంపై అప్పుడు ఉత్తర కొరియా స్పందించలేదు.
2008లో ఏమైందంటే..
ఆగస్టు 22న కిమ్ జోంగ్ ఇల్ అనారోగ్యానికి గురయ్యారని ఉత్తర కొరియాలోని నిఘా వర్గాలకు సమాచారం అందింది. సెప్టెంబర్ 9న కిమ్ పరిస్థితి విషమంగా ఉందంటూ పలు పత్రికలు కథనాలు రాశాయి. అదే రోజు ఆ దేశ 60వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో కిమ్ జోంగ్ ఇల్ పాల్గొనకపోవడంతో అమెరికా నిఘా వర్గాలు సైతం కిమ్ జోంగ్ ఇల్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు భావించాయి. వీటిపై స్పందించిన ఉత్తర కొరియా ఆగస్టు 15న కిమ్ జోంగ్ ఇల్కు గుండెపోటు వచ్చిందని, అయినా ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేసినట్లు బీబీసీ వెల్లడించింది. అయితే కిమ్ జోంగ్ ఇల్ ఆరోగ్యం బాగోలేదని అక్టోబర్ 28న జపాన్ ప్రధాని టారో అసో వ్యాఖ్యానించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అదే ఏడాది అక్టోబర్లో కిమ్కు గుండెపోటు, పక్షవాతం వచ్చాయని జపాన్కు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ వెల్లడించింది. దీంతో మరోసారి కిమ్ ఆరోగ్యంపై వదంతులు మొదలయ్యాయి.
వీటికి అడ్డుకట్ట వేయాలని భావించిన ఉత్తర కొరియా నవంబర్ 5న కిమ్కు సంబంధించిన రెండు ఫొటోలను దేశ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ద్వారా విడుదల చేసింది. అవి కొరియన్ పీపుల్స్ ఆర్మీ క్యాంప్ను సందర్శించినప్పుడు కిమ్ జోంగ్ ఇల్ దిగిన ఫొటోలు. అయితే ఇవి తాజా ఫొటోలే అనడానికి రుజువేంటని ది టైమ్స్ ప్రశ్నలు లేవనెత్తింది. ఆయన ఆరోగ్యంపై తరచూ వదంతులు వస్తుండటంతో 2009 ఏప్రిల్లో కొన్ని వీడియోలను ఉత్తర కొరియా విడుదల చేసింది. 2008 నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశంలోని పలు ఫ్యాకర్టీలను, ఇతర ప్రాంతాలను కిమ్ సందర్శించినట్లుగా ఆ వీడియోల్లో ఉంది. అయితే ఎపిలెప్సీ అనే నరాల వ్యాధితో కిమ్ జోంగ్ ఇల్ బాధపడుతున్నారని 2010లో వీకిలీక్స్ పలు దస్త్రాలను బయటపెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై వదంతులు వచ్చేవి.
మరణించింది ఎప్పుడు?
కిమ్ జోంగ్ ఇల్ 2011 డిసెంబర్ 17న ప్యాంగ్యాంగ్ నుంచి రైలులో వెళ్తుండగా మరణించారు. అయితే 2012 డిసెంబర్లో మరో వాదన బయటకు వచ్చింది. కిమ్ జోంగ్ ఇల్ జాగాంగ్ ప్రావిన్స్లోని పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో నిర్మాణ లోపాలను ఎత్తిచూపుతూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ ఆవేశంతోనే ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయారని కథనాలు వచ్చాయి. అయినా కిమ్ డిసెంబర్ 17న గుండెపోటుతో మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. కిమ్ మృతి చెందినప్పుడు మంచుతుపాను ఆగిపోయిందని, ఆకాశం ఎర్రగా మారిందని అక్కడి అధికారిక పత్రిక వెల్లడించింది. ఏదీ ఏమైనా.. కిమ్ జోంగ్ ఇల్ మృతి ఓ మిస్టరీగా ఉండిపోయింది. ఉత్తర కొరియాలో పత్రికా స్వేచ్ఛ లేకపోవడం, అక్కడి విషయాలు బయట ప్రపంచానికి తెలియకపోవడంతో కిమ్ జోంగ్ ఇల్ మృతిపై స్పష్టమైన వివరణ లేదు. ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ ఎలా ఉన్నారన్న విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!