Railway museum : బుల్లి ట్రైన్లు నడిచే బుజ్జి మ్యూజియం.. ఇక్కడ వందేభారత్ నడుస్తోంది!
జేబులో పట్టే స్టీమ్ ఇంజిన్లు (Steam engine), ఫ్లై ఓవర్లు, స్విమ్మింగ్ ఫూల్, దీప స్తంభాలు, సర్కస్ నమూనా ఇవన్నీ పుణెలోని (Pune) కోత్రుడ్లో ఉన్న జోషి మ్యూజియంలో కన్పిస్తాయి. దేశంలోని ఏకైక మినియేచర్ రైల్వే మ్యూజియంగా (Railway museum) ఇది 2004లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో (Limca book of records) చోటు సంపాదించింది.
(Image : Social media)
చుక్ చుక్ అంటూ పట్టాలపై పరుగులు తీసే రైలు బండిని (Rail) తొలి సారి చూసిన వారికి ఆశ్చర్యం కలుగక మానదు. అన్ని బోగీలను అదెలా లాగుతోంది? మొత్తం రైల్వే వ్యవస్థ (Railway system) ఎలా పని చేస్తోంది? వంటి సందేహాలు మెదళ్లను తొలుస్తుంటాయి. పుణెలోని ‘జోషి మ్యూజియం ఆఫ్ మినియేచర్ రైల్వేస్’ను (Joshi museum of miniature railways) ఒక సారి సందర్శిస్తే ఆ ప్రశ్నలన్నింటికీ బదులు దొరకుతుంది. ఇక్కడ భారతీయ రైళ్లు (Indian railways) మాత్రమే కాదు.. విదేశీ రైళ్లు ఎలా పరుగులు తీస్తాయో కూడా క్షుణ్నంగా తెలుసుకోవచ్చు.
బీఎస్ జోషి కృషి
పుణెకు చెందిన బీఎస్ జోషికి చిన్నప్పటి నుంచి రైళ్లంటే మహా ఆసక్తి. వివిధ రకాల రైళ్లను గమనిస్తూ వాటిని కార్డ్బోర్డ్తో తయారు చేసేవారు. అవి నిజమైన రైళ్లే అనుకునే విధంగా జోషి పనితనం ఉండేది. అందరూ అభినందిస్తుండటంతో ఆయన కోటలు, కొండలు వంటి కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కదిలే కారు, ఫైరింజన్ లాంటివి రూపొందించారు. తీగల సాయంతో వాటిని నడిపిస్తుంటే అందరూ ఔరా అని మెచ్చుకునేవారు. అలా జోషి 1982 ఓ మాస్టర్ పీస్ లే ఔట్ను తయారు చేసి గోఖలే హాల్లో ప్రదర్శించారు. ఆ బొమ్మల ఆకృతి నిర్మాణం చూసి జోషిని పలువురు అభినందించారు. తరువాత దాన్ని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లడం ఆయన ఓ పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో వాటిని తరచూ విడదీయడం, అతికించడం కష్టంగా మారింది. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. అదే మినియేచర్ మ్యూజియం. దేశంలో అప్పటి వరకు ఎవరూ అలాంటి ప్రయత్నం చేయలేదు.
దేశంలో తొలి మినియేచర్ మ్యూజియం నిర్మించాలనే సంకల్పంతో జోషి 1991లో తొలిసారి సౌదామిని ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీలో ఒక హాల్ను నిర్మించారు. గతంలో రూపొందించిన వాటికి భిన్నంగా కొత్త లే అవుట్ నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దేశీయ, విదేశీ రైలు మోడళ్లు, స్టేషన్లు, ట్రాక్లు, కార్లు, ప్రయాణికులు ఇలా ఒక్కో మినియేచర్ రూపొందించడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆయన ఏడేళ్ల కష్టానికి ఫలితం 1998 ఏప్రిల్ 1న దక్కింది. ఆ రోజు ‘జోషి మ్యూజియం ఆఫ్ మినియేచర్ రైల్వేస్’ ప్రారంభమైంది. దురదృష్టవశాత్తూ అదే ఏడాది జోషి కన్నుమూశారు.
(Image : Social media)
మినీ అద్భుతం.. రైల్వే నగరం
జోషి ఒక అద్భుతమైన రైల్వే నగరాన్ని తీర్చిదిద్దారు. అందులో అన్ని దేశాల రైల్వే వ్యవస్థలు నడుస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. స్టీమ్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, హై స్పీడ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, అండర్ గ్రౌండ్ మెట్రో, రోప్ రైల్వే, ఫునిక్యులర్ రైల్వే, వుపర్టర్ హ్యాంగింగ్ రకాల రైళ్లు ఈ మోడల్ నగరంలోని ట్రాక్లపై పరుగులు తీస్తుంటాయి. మినియేచర్ నిర్మాణంలో వెలిగే ప్రతి లైటు, మైకుల నుంచి వచ్చే శబ్దం డిజిటల్ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. స్టేషన్ పరిధిలో ‘ప్రయాణికులకు విజ్ఞప్తి’ అంటూ అలెర్ట్ చేసే వ్యవస్థ కూడా ఉంది. డిజైన్ మొత్తంలో 65 సిగ్నల్స్, 26 పాయింట్స్, 6 ప్లాట్ఫామ్స్, కంచెలు, దీప స్తంభాలు, ఫ్లై ఓవర్లు, రెండు లైన్ల హైవే, అందులో నడిచే కార్లు ఉన్నాయి. ఇందులోనే రివర్సింగ్ స్టేషన్తో ఒక ఘాట్ సెక్షన్ నమూనా కూడా కన్పిస్తుంది.
ఈ రైల్వే నగరంలో ఎత్తయిన భవంతులు మరో ప్రధాన ఆకర్షణ. వాటిలో దీపాలు వెలుగుతుంటాయి. చిన్న పక్కా ఇళ్లు కూడా ఉన్నాయి. వాటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. భారీ హోర్డింగ్లతో ఒక రద్దీ కూడలి దర్శనమిస్తుంది. ఇవి మాత్రమే కాదు.. రోలర్ కోస్టర్, ఫెర్రిస్ వీల్ వంటి సౌకర్యాలతో సర్కస్ నమూనాను ఏర్పాటు చేశారు. నగరం మొత్తంలో వివిధ చోట్ల దాదాపు 2వేల బొమ్మలున్నాయి. అవన్నీ రకరకాల పోజుల్లో ఉంటాయి. రాత్రి వాతావరణాన్ని ప్రతిబింబించే ఏర్పాటు కూడా ఈ మినియేచర్ మ్యూజియంలో ఉంది. 1853 ఏప్రిల్ 16న రాత్రి ఆకాశం ఎలా కనిపించిందో అలాంటి నమూనాను ఇక్కడ తీర్చిదిద్దారు. ఎందుకంటే ఆ రోజే మన దేశంలో తొలి రైలు కదిలింది.
వందే భారత్ వచ్చింది!
ప్రస్తుతం ఇదే తరహాలో మరో మ్యూజియాన్ని సతారా జిల్లాలోని వాయ్లో నిర్మించారు. జోషి తనయుడు రవి జోషి మరో రెండింటినీ నడిపిస్తున్నారు. కంట్రోల్ ప్యానల్ దాదాపు వెయ్యి తీగలను అనుసంధానం చేసి అందులోని మినియేచర్లను నడిపిస్తున్నారు. అంతే కాదు ఈ మ్యూజియం ఫ్లైష్మన్, రోకో, హాన్బీ వంటి అంతర్జాతీయ కంపెనీల మోడల్ రైళ్లను కూడా రూపొందిస్తోంది. అవసరాన్ని బట్టి వాటిని ఆయా కంపెనీలకు సరఫరా చేస్తోంది. 2007లో ఈ మ్యూజియం స్విట్జర్లాండ్లోని ప్రసిద్ధ జంగ్ ఫ్రా రైల్వే మోడల్ను అభివృద్ధి చేసింది. దాంతో 2వేల నకళ్లను పంపాలని అక్కడి నుంచి ఈ కంపెనీకి ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం ఏడాదికి 30 వేల మంది ఈ మ్యూజియాన్ని సందర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవలే ఈ మ్యూజియం సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా అందులో వందేభారత్ మినియేచర్ ట్రైన్ను ప్రవేశపెట్టారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.