Japan : రోజుకో భూకంపం.. చెక్కు చెదరని జపాన్ సంకల్పం!
ఇటీవల తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంపంలో దాదాపు 50వేల మంది మరణించారు. మరి రోజూ భూకంపాలు వస్తున్నా జపాన్లో అంత మంది భద్రంగా ఎలా జీవనం సాగిస్తున్నారో చదివేయండి.
స్వల్ప, అధిక మోతాదులో జపాన్(Japan)ను ఏటా దాదాపు 5వేల భూకంపాలు(Earthquake) పలకరిస్తుంటాయి. కొన్ని శతాబ్దాలుగా ఆ విపత్తులను కళ్లారా చూస్తున్న అక్కడి ప్రజలు వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. దాంతో భూకంపం సంభవించినప్పుడు ఇతర దేశాల్లో జరిగే నష్టంతో పోలిస్తే జపాన్లో మరణాల రేటు, ఆస్తి నష్టం తక్కువగా నమోదవుతోంది. అసలు భూకంప సమాచారం జపాన్ పౌరులు ఎలా తెలుసుకుంటారు. ఏ విధంగా ఎదుర్కొంటారో తెలుసుకుందామా..
జపాన్లోనే ఎందుకు?
భౌగోళిక పరిస్థితుల కారణంగా జపాన్లో ఎక్కువ భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది. 40వేల కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో 450 అగ్నిపర్వతాలున్నాయి. అందులో మెజారిటీ అగ్నిపర్వతాలు జపాన్లోనే కనిపిస్తాయి. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయి. జపాన్ 4 కాంటినెంటల్ ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్, ద ఫిలిప్పీన్, ద యురేసియన్, ద నార్త్ అమెరికా ప్లేట్లు తరచూ కదులుతూ ఉంటాయి. దాంతో భూమి కదిలి భూప్రకంపనలు, భూకంపాలు వస్తుంటాయి. ఇవే కాకుండా జపాన్ ట్రెంచ్గా పిలుస్తున్న జపనీస్ అగాధం కూడా భూకంపాలు రావడానికి మరో కారణం. పసిఫిక్ వాయువ్య ప్రాంతంలోని ఈ సముద్ర అగాధం 800 మీటర్ల లోతులో ఉంటుంది. అందులో కదలికలు ఏర్పడినప్పుడు భూకంపాలు, సునామీలు వస్తుంటాయి.
విపత్తు తట్టుకునేలా నిర్మాణాలు
జపాన్ ఇల్లు(Home), కార్యాలయాలు అన్నీ భూకంపాలను తట్టుకునేలా నిర్మిస్తారు. అలాగే నిర్మించుకోవాలని అక్కడి చట్టం కూడా చెబుతోంది. అందు కోసం కొన్ని ప్రమాణాలను కూడా నిర్దేశించింది. పాఠశాలలు, కార్యాలయాల భవనాలు నిర్మించే సందర్భంలో తప్పని సరిగా చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఫలితంగా ఇప్పుడు జపాన్ రాజధాని టోక్యో(tokyo)లో 87 శాతం భవనాలు భూకంపాలను తట్టుకునే రీతిలో ఉన్నాయి. చాలా భవనాలు టెఫ్లాన్పై నిర్మిస్తారు. దాంతో కుదుపులను తట్టుకునే శక్తి ఉంటుంది. ఇంట్లో రబ్బరు అమరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. టోక్యోలోని ప్రసిద్ధ ఎత్తయిన కట్టడం స్కై ట్రీ(skytree)ని.. పురాతన కర్ర గోపురాల నిర్మాణాన్ని అనుకరిస్తూ కట్టారు. కర్రతో కట్టిన గోపురాలు దశాబ్దాలైనా చెక్కు చెదరలేదు.
ఫోన్లు మోత మోగిస్తాయి..
జపాన్లోని ప్రతి మొబైల్(mobile)లో భూకంపం, సునామీల ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ప్రమాదాలు జరగబోయే 5 నుంచి 10 సెకన్ల ముందే అవి అప్రమత్తం చేస్తాయి. జపనీస్ భాషలో ‘జిషిన్ దేసు..జిషిన్ దేసు’(భూకంపం వస్తోంది) అంటూ శబ్దాలు వెలువడతాయి. భూకంపం ముప్పు ఆగిపోగానే ఆ హెచ్చరికలు నిలిచిపోతాయి.
పసిగట్టే ట్రైన్లు
జపాన్లో రైళ్లలో ప్రయాణం చేసేవారు ఎక్కువ. అందుకే అక్కడ అత్యాధునిక బుల్లెట్ ట్రైన్లు(bullet train) నడుస్తున్నాయి. వాటిలో కూడా భూకంపాన్ని గ్రహించే సెన్సార్లు ఉన్నాయి. దాంతో విపత్తుకు ముందే అవి ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. 2011లో భారీ భూకంపం వచ్చినా అప్పటికే ట్రాక్పై నడుస్తున్న 27 రైళ్లు ముందే ఆగిపోయాయి. దాంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
టెలివిజన్ ప్రసారాలు
భూకంపం రాబోతోందనే సమాచారాన్ని జపాన్లోని టెలివిజన్(television) ఛానళ్లన్నీ ప్రసారం చేస్తాయి. ఎక్కడ ప్రమాదం ఉంది? తీవ్రత ఎలా ఉంటుంది? ఎక్కడ తలదాచుకోవాలి? ఎలా సన్నద్ధం కావాలి? ఇలాంటి ప్రశ్నలకు టీవీల ద్వారా జవాబు దొరుకుతుంది.
పాఠశాలలో బోధన
విపత్తు సంభవించినప్పుడు పెద్దలే కాదు.. పిల్లలు కూడా వేగంగా స్పందించడం ముఖ్యం. అందుకే జపాన్ పాఠశాలల్లో విద్యతోపాటు విపత్తు నిర్వహణ అంశాలను పాఠ్యాంశాలు(syllabus)గా బోధిస్తారు. కనీసం నెలకోసారైనా అక్కడ భూకంపం వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన విషయాలపై డ్రిల్ చేయిస్తారు. భూకంపం రాగానే చిన్నారులు డెస్క్ల కిందకి దూరిపోతారు. తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు డెస్క్లను గట్టిగా పట్టుకొని కూర్చుంటారు. ఒక వేళ బయట ఆడుకుంటూ ఉంటే మైదానం మధ్యలోకి వెళతారు. దాంతో ఎలాంటి శిథిలాలు వారిపై పడవు. ఇవి మాత్రమే కాదు.. నిజంగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అనుభూతి కలిగించే సిమ్యులేటర్ల(simulator)పై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. దాంతో భూకంపాలను ఎదుర్కొనే సామర్థ్యం వారిలో మెరుగవుతుంది.
స్మారక మ్యూజియాలతో అవగాహన
గత అనుభవాల నుంచి జపాన్ ఎల్లప్పుడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటుంది. 1995లో కోబ్ పట్టణంలో భారీ భూకంపం సంభవించగా దాదాపు 5వేల మంది మృత్యువాతపడ్డారు. 10వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ పట్టణాన్ని పునర్నిర్మాణం చేసిన జపాన్ ‘కోబ్ భూకంప స్మారక మ్యూజియం’ను ఏర్పాటు చేసింది. దాన్ని సందర్శిస్తే భూకంపాలను ఎదుర్కొనేందుకు కావాల్సిన పరిజ్ఞానం పొందుతారు.
అందరికీ రక్షణ కిట్స్
భూకంపం బారి నుంచి రక్షించుకునేందుకు జపాన్లోని ప్రతి ఇంటిలో రక్షణ కిట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో ప్రథమ చికిత్స(first aid) వస్తువులు, నీటి సీసా, తిను బండారాలు, గ్లౌజ్లు, మాస్క్లు, ఇన్సులేషన్ షీట్స్, టార్చ్ లైట్, రేడియో తదితర వస్తువులుంటాయి. ఈ కిట్స్ మెడికల్, కిరాణా దుకాణాల్లో విక్రయిస్తుంటారు.
నీటిని మళ్లించే టన్నెల్స్
భూకంపంతోపాటు, సునామీ వస్తే భారీగా నీరు టోక్యో నగరంలోకి వస్తుంది. ఆ నీటిని మళ్లించేందుకు నగర శివారులో భారీ టన్నెల్స్ను ఏర్పాటు చేశారు. తుపానులు, వరదల కారణంగా వచ్చిన నీరు మొత్తం ఈ టన్నెళ్ల ద్వారా ఎడో నదిలోకి మళ్లిస్తారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్