Sky diving : ఈ సాహసవీరులు.. స్కై డైవింగ్లో మృత్యుంజయులు!
పక్షిలా ఆకాశంలో ఎగురుతూ ప్యారాచూట్ సహాయంతో భూమిపైకి రావడం ఓ అద్భుతమైన అనుభూతి. గత కొన్నేళ్లుగా స్కై డైవింగ్కు విశేష ఆదరణ లభిస్తోంది.
(Image : Instagram)
స్కై డైవింగ్(Sky diving) ఎంతో సాహసంతో కూడుకున్న ఓ విన్యాసం . మొదటి, రెండో ప్రపంచ యుద్ధం(world war)లో సైనికులు అవసరాన్ని బట్టి ప్యారాచూట్ జంప్(parachute jump) చేసేవారు. ఇటీవలి కాలంలో సామాన్యులు సైతం స్కై డైవింగ్(Sky diving) చేస్తున్నారు. 2018లో ఒక్క అమెరికాలోనే 33 లక్షల మంది స్కైడైవింగ్ చేశారంటే దీనికున్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సాహసం చేసేటప్పుడు టైమ్ అందరికీ ఒకేలా ఉండదు. కొందరు ఏకంగా చావును చూస్తే.. చావు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన వారు మరికొందరున్నారు. ఆ మృత్యుంజయులపై ఓ లుక్కేయండి.
డేర్ డెవిల్ ‘బేర్ గ్రిల్స్’
బేర్ గ్రిల్స్(Bare grills).. ప్రముఖ సాహస వీరుడు. బ్రిటన్(Britain)కు చెందిన ఈయన డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1996లో ఆయన ఓ భయంకర ప్రమాదం బారినపడ్డారు. అప్పట్లో బేర్ ‘21 ఎస్ఏఎస్’ రెజిమెంట్లో శిక్షణ పొందేవారు. ఇది యూకేకు చెందిన ప్రత్యేక దళం. శిక్షణలో భాగంగా ఆయన ఆఫ్రికా దేశం జాంబియాలో విమానం(Flight) నుంచి కిందకి దూకారు. అప్పటికి విమానం 16వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో దురదృష్టవశాత్తూ ఆయన ప్యారాచూట్(parachute) తెరుచుకోలేదు. గాల్లోనే కొద్దిసేపు గింగిరాలు తిరిగారు. రిజర్వ్ చూట్ను తెరిచేందుకు కూడా పరిస్థితులు అనుకూలించలేదు. దాంతో బేర్ బలంగా నేలపై పడిపోయారు. ఫలితంగా వెన్నెముక దెబ్బతింది. ఇక నడవడం అసాధ్యమని ఆయనకు చికిత్స చేసిన వైద్యులు తేల్చేశారు. కానీ బేర్లోని పట్టుదల అతడిని తొందరగా నడిచేలా చేసింది. రెండేళ్ల వ్యవధిలోనే పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత మౌంట్ ఎవరెస్టును అధిరోహించి తన సంకల్పబలం ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు.
112వ జంప్లో ‘క్రిస్టైన్ మెకంజీ’
దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్టైన్ మెకంజీకి స్కై డైవింగ్లో విశేష అనుభవం ఉంది. 2004 కల్లా ఆమె 111 జంప్లు విజయవంతంగా పూర్తి చేసింది. 112వ జంప్ను కాస్త విభిన్నంగా చేయడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో 11వేల అడుగుల ఎత్తు నుంచి దూకి దాదాపు ఆరు వేల అడుగుల ఎత్తు దిగే వరకు కూర్చున్న భంగిమలో ఉండిపోయింది. దాంతో ఆకాశం నుంచి భూమిని చేరుకొనే వేగం అమాంతం పెరిగిపోయింది. ఏదో ప్రమాదం జరగబోతోందని ఆమెకు అర్థమైంది. చివరి క్షణంలో మరీ ముఖ్యంగా ప్రధాన ప్యారాచూట్ తెరుచుకోలేదు. దాని కనెక్షన్ను తొలగించకుండానే రిజర్వ్ చూట్ తెరిచింది. ఫలితంగా రెండూ చుట్టుకుపోయి మెకంజీ గాల్లోనే గిరగిరా తిరుగుతూ వచ్చి కింద పడింది. ఆమె పొత్తికడుపు, ఇతర చోట్ల బలమైన గాయాలయ్యాయి. ఒక ట్రక్కు డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. దాంతో మెకంజీ బతికి బయటపడింది.
స్విట్జర్లాండ్లో ‘ఎమ్మా క్యారీ’
ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా క్యారీ 2013లో స్విట్జర్లాండ్ వెళ్లింది. ఆల్ప్ పర్వతాలపై ఫ్రీఫాల్ చేయాలనే కోరికతో ఆమె హెలికాప్టర్ ఎక్కింది. దాదాపు 14వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తరువాత సంతోషంగా సెల్ఫీలు తీసుకుంది. కిందకి దూకి ఆ అనుభూతిని ఆస్వాదిస్తుండగా ఆమెకు అనుమానం వచ్చింది. అసాధారణ రీతిలో భూమిపైకి వెళ్తున్నట్లుగా తోచి తన పైనున్న ఇన్స్ట్రక్టర్ను పిలిచింది. అతని దగ్గర నుంచి సమాధానం రాలేదు. వెనక్కి తిరిగి చూస్తే మెయిన్, రిజర్వ్ ప్యారాచూట్లు రెండు సరిగా తెరుచుకోలేదు. అవి రెండూ ముడిపడి ఉన్నాయి. ఓ తాడు కూడా ఇన్స్ట్రక్టర్ గొంతుకు బిగుసుకుంది. దాంతో అతడికి మాట రాలేదు. ఏం జరుగుతుందో ఊహించే లోపే ఇద్దరూ బలంగా నేలపై పడ్డారు. ఈ ప్రమాదంలో ఇన్స్ట్రక్టర్ మరణించగా.. ఎమ్మా పొత్తికడుపు, వెన్ను, దవడకు గాయాలయ్యాయి. దంతాలు ఊడిపోయి నోరు మొత్తం రక్తంతో నిండిపోయింది. చికిత్స తరువాత ఆమె నడవడం అసాధ్యమని వైద్యులు తేల్చిచెప్పారు. కానీ అంతా ఆశ్చర్యపోయేలా కోలుకుంది. అప్పటి గాయాలు ఇంకా ఆమెను బాధిస్తూనే ఉన్నాయి.
జెండాను ఎగరేస్తూ ‘క్రీగ్ స్టీపుల్టన్’
అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్కై డైవర్ క్రీగ్ స్టీపుల్టన్. ఆ దేశ జెండాకు సంబంధించిన ఓ సాహసం నిమిత్తం విమానంలో 8వేల అడుగుల ఎత్తుపై నుంచి దూకాడు. అంతా సాఫీగా జరుగుతోందని భావించిన తరుణంలో ఆయన కాలు ఒక చోట చిక్కుకుపోయింది. దాంతో గాల్లోనే గిరగిరా తిరగాల్సి వచ్చింది. బ్యాకప్ చూట్ను తెరిచినా లాభం లేకపోయింది. కానీ వేగం మాత్రం నెమ్మదించి భూమిపై పడ్డాడు. ఫలితంగా క్రీగ్ చేయి విరిగింది. కొన్ని చోట్ల గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం ఓ కెమెరామెన్ గాల్లో రికార్డు చేస్తూ ఉండిపోయాడు. అతనికి సాయం చేసే అవకాశమే లేకపోయింది.
ఇన్స్ట్రక్టర్ రక్షించిన బాలుడు ‘ఎలీజా అర్రాంజ్’
ఆస్ట్రేలియాకు చెందిన బాలుడు ఎలీజా అర్రాంజ్ ఇన్స్ట్రక్టర్ టోనీ రోకోవ్ సహాయంతో తొలిసారి స్కైడైవ్ చేశాడు. 5వేల అడుగుల ఎత్తు నుంచి ఇద్దరూ కిందకి దూకారు. భూమిని చేరడానికి ఇంకా 66 అడుగులుండగా బలమైన గాలి వీచింది. దాంతో ఇద్దరూ అదుపుతప్పి కిందపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టోనీ ఎలీజాను రక్షించి.. తాను ప్రాణాలు కోల్పోయాడు. ఎలీజా గాయాల నుంచి కోలుకున్నా వీల్ఛైర్కే పరిమితం కావాల్సి వచ్చింది.
25 సర్జరీలతో ‘క్యారోల్ ముర్రే రోడ్రిగ్జ్’
కెనడాలోని నోవా స్కాటియాకు చెందిన క్యారోల్ ముర్రే రోడ్రిగ్జ్ 1997లో స్కైడైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. శిక్షణలో రాటుదేలక ముందే ఆమె 3200 అడుగుల ఎత్తులో నడుస్తున్న విమానం నుంచి దూకేసింది. బలమైన గాలి వీయడంతో ఆమె పట్టుకోల్పోయి నేలపై పడింది. ఈ ప్రమాదంలో ఆమెకు లెక్కలేనన్ని గాయాలయ్యాయి. వాటి నుంచి కోలుకునేందుకు వైద్యులు 25 సర్జరీలు చేయాల్సి వచ్చింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!