ప్లాస్టిక్ లేకుండా... ఇలా చేయొచ్చు!!
పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న అంశాల్లో ప్లాస్టిక్ ఒకటి. నిత్యజీవితంలో రోజు ఎన్నో విధాలుగా మనం ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా వస్తువుల ప్యాకింగ్ ప్రక్రియలో ప్లాస్టిక్ వినియోగం అత్యధికంగా ఉందని పలు సర్వేల్లో వెల్లడైంది. ప్యాకింగ్ను విప్పిన తర్వాత
ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న అంశాల్లో ప్లాస్టిక్ ఒకటి. నిత్యజీవితంలో, ముఖ్యంగా వస్తువుల ప్యాకింగ్ ప్రక్రియలో ప్లాస్టిక్ వినియోగం అత్యధికంగా ఉంటోంది. ప్యాకింగ్ విప్పిన తర్వాత అదంతా చెత్తలోకి చేరుతుంది. వ్యర్థాలుగా భూమిపై రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ను కాల్చివేయడం ద్వారా వెలువడే విషవాయువులు వాయు కాలుష్యానికి దారితీస్తున్నాయి. రోడ్లపై, చెరువుల్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే వాటిని తినడం వల్ల జంతువులు, నీటిలో ఉండే ప్రాణులకు హాని జరుగుతోంది. ఇలా జీవజాతికి ముప్పుగా మారిన ఈ ప్లాస్టిక్ను నిర్మూలించాలని గత కొంత కాలంగా ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా దాని వాడకంపై నిషేధం విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ ప్యాకింగ్ తగ్గించడానికి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు వివిధ కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో చూద్దాం!
ప్యాకింగ్ బంద్
ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకూడదనుకుంటే.. చేయాల్సింది దానిని వాడకుండా ఉండటమే. వీలైనంత వరకూ ప్లాస్టిక్ ప్యాకింగ్కు దూరంగా ఉండాలి. అత్యవసరమైతే గానీ ప్లాస్టిక్ జోలికి పోకూడదు. వీలైనంత వరకు వస్త్రంతో చేసిన సంచులు వాడటం ఉత్తమం. యూకే వ్యాప్తంగా ఇప్పటికే పలు సూపర్మార్కెట్లు, కూల్డ్రింక్స్ టిన్స్, గ్రీటింగ్ కార్డ్స్, బెడ్షీట్ల వంటి వాటిని కవర్లలో ప్యాక్ చేయడం మానేశాయి. ఉత్తర అమెరికాలో వాల్మార్ట్ షాపింగ్మాల్లో బొమ్మలకు ప్యాకింగ్ చేయట్లేదు. కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్తో ర్యాపింగ్ చేయడాన్ని వాల్మార్ట్ నిషేధించింది.
సృజనాత్మక ప్రత్యామ్నాయం
కొన్నిసార్లు ప్లాస్టిక్ ప్యాకింగ్ తప్పని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటికి సృజనాత్మక ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. కార్ల్స్బర్గ్ బీర్ల సంస్థ ఆరు టిన్లతో ఒక యూనిట్ను ప్యాక్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ప్లాస్టిక్కు బదులు జిగురును ఉపయోగిస్తోంది. ఆరు టిన్లను ఒకదానితో ఒకటి జిగురుతో అంటించి ప్యాక్ చేస్తోంది. స్వీడన్కు చెందిన ఐసీఏ రీటైల్ సంస్థ పండ్లు, కూరగాయలపై బ్రాండ్ల పేరును లేజర్తో ముద్రించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో ఆహారపదార్థాలపై సంస్థ లోగోలు, పేర్లను తినదగిన పదార్థాలతో రూపొందిస్తున్నారు.
రీఫిల్స్
యూనిలివర్, ఎస్.సీ జాన్సన్ వంటి సంస్థలు గాఢత ఎక్కువగా ఉండే క్లీనింగ్ రసాయనాలను చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నాయి. వీటిని మొదటిసారి కొనుగోలు చేసిన ప్లాస్టిక్ సీసాలో పోసి.. కొన్ని నీళ్లు కలిపి వాడుకోవచ్చు. ప్లాస్టిక్ సీసా ఖాళీ అయిన ప్రతిసారి కొత్తది కొనే బదులు ఈ విధంగా చేస్తే.. ప్లాస్టిక్ వాడకం తగ్గిపోతుంది. ఈ ఆలోచన బాగుండటంతో టూత్పేస్ట్లు, డిటర్జెంట్ పౌడర్లను కూడా మందు బిళ్లల రూపంలో తయారు చేస్తున్నారు. కోకాకోలా, పెప్సీ కూడా ఈ తరహా విధానంలోకి మారడానికి ప్రయత్నిస్తున్నాయి.
ప్రత్యామ్నాయం.. పునర్వినియోగం
ఒకప్పుడు పాలను పాల వ్యాపారులు సీసాల్లో విక్రయించేవారు. ప్రతిరోజూ ఖాళీ చేసిన సీసాను తీసుకొని పాలు నింపిన మరో సీసా ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం పాలను ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. అయితే ఫ్రాన్స్కి చెందిన ఓ కంపెనీ మళ్లీ గతకాలం పద్ధతిని అమలు చేస్తోంది. ఫ్రాన్స్, లాటిన్ అమెరికాలో పాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఇంటికి తెచ్చి ఇచ్చే ‘డానన్’ సంస్థ పాలను సీసాలు, జగ్గుల్లో విక్రయిస్తోంది. చందాదారులుగా మారిన కస్టమర్ల ఇంటికి వాటిని తెచ్చిచ్చి.. మరుసటి రోజు వాటిని తీసుకొని.. శుభ్రపర్చి తిరిగి ఉపయోగిస్తోంది. ముంబయిలో ‘డబ్బావాలా’ల గురించి అందరికీ తెలిసిందే. ఆఫీసుల్లో ఉద్యోగులకు వారి ఇంటి నుంచి లంచ్ బాక్సులను తీసుకొచ్చి ఇస్తుంటారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని లండన్లో ‘డబ్బా డ్రాప్’ పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను స్టీల్డబ్బాల్లో డెలివరీ చేసి.. ఖాళీ చేసిన తర్వాత తిరిగి తీసుకుంటారు.
ప్లాస్టిక్ రీసైకిల్
ప్యాకింగ్ చేసే ప్లాస్టిక్ను రీసైకిల్ చేయలేకపోవచ్చు. కానీ, రీసైకిల్ చేసే ప్లాస్టిక్ను తయారు చేయొచ్చు. ఆకుపచ్చ ప్లాస్టిక్ బాటిల్లో స్ప్రైట్ కూల్డ్రింక్ను విక్రయించే కోకాకోలా రీసైకిల్ చేయగలిగే పారదర్శక ప్లాస్టిక్ను వినియోగించాలని నిర్ణయించింది. కోల్గేట్ కూడా టూత్పేస్ట్ ట్యూబ్లను రీసైకిల్ చేయగలిగే ప్లాస్టిక్తో తయారు చేస్తోంది. పీఅండ్జీ, నెస్లే వంటి పలు సంస్థలు తమ ఉత్పత్తులపై బార్కోడ్ను ఏర్పాటు చేస్తున్నాయి. బార్కోడ్ ద్వారా ఆటోమెటిక్గా వ్యర్థంగా మారిన ప్లాస్టిక్ను సంబంధిత రీసైక్లింగ్ ప్లాంట్కు చేరేలా చేస్తాయి.
సేంద్రియ ఎరువుల కోసం..
ప్లాస్టిక్కు బదులు బయోడిగ్రేడబుల్ పదార్థాలను ఉపయోగిస్తే పర్యావరణానికి జరిగే హానిని తగ్గించవచ్చు. ఎరువు, బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే వీలుంటుంది. కొన్ని టీ సంస్థలు వాటి టీ బ్యాగుల్లో ప్లాస్టిక్కి బదులు బయోడిగ్రేడబుల్ పదార్థాలను వాడుతున్నాయి. వాటిని ఒక్కచోట చేర్చి సేంద్రీయ ఎరువు తయారు చేయొచ్చు. ఆపిల్ గోవర్ బొస్టాక్ అనే సంస్థ విక్రయించే పండ్లపై ఎరువుల తయారీకి ఉపయోగపడే పదార్థాలతో స్టిక్కర్లను వాడుతోంది.
కాగితంతో సరి
కొన్ని వస్తువులకు ప్లాస్టిక్కు బదులు కాగితాన్ని కూడా ఉపయోగించవచ్చు. అలాంటి వాటికోసం ప్రత్యేకంగా కాగితంతో కవర్లను తయారు చేస్తున్నారు. ఎక్కువగా కిరాణా దుకాణాల్లో ఇలాంటి కాగితం కవర్లను ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్ నుంచి కప్పుల వరకు అన్ని వస్తువులను కొన్ని సంస్థలు కాగితం, కార్డ్బోర్డులతో ప్యాకింగ్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్