ప్లాస్టిక్ లేకుండా... ఇలా చేయొచ్చు!!
పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న అంశాల్లో ప్లాస్టిక్ ఒకటి. నిత్యజీవితంలో రోజు ఎన్నో విధాలుగా మనం ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా వస్తువుల ప్యాకింగ్ ప్రక్రియలో ప్లాస్టిక్ వినియోగం అత్యధికంగా ఉందని పలు సర్వేల్లో వెల్లడైంది. ప్యాకింగ్ను విప్పిన తర్వాత
ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న అంశాల్లో ప్లాస్టిక్ ఒకటి. నిత్యజీవితంలో, ముఖ్యంగా వస్తువుల ప్యాకింగ్ ప్రక్రియలో ప్లాస్టిక్ వినియోగం అత్యధికంగా ఉంటోంది. ప్యాకింగ్ విప్పిన తర్వాత అదంతా చెత్తలోకి చేరుతుంది. వ్యర్థాలుగా భూమిపై రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ను కాల్చివేయడం ద్వారా వెలువడే విషవాయువులు వాయు కాలుష్యానికి దారితీస్తున్నాయి. రోడ్లపై, చెరువుల్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే వాటిని తినడం వల్ల జంతువులు, నీటిలో ఉండే ప్రాణులకు హాని జరుగుతోంది. ఇలా జీవజాతికి ముప్పుగా మారిన ఈ ప్లాస్టిక్ను నిర్మూలించాలని గత కొంత కాలంగా ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా దాని వాడకంపై నిషేధం విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ ప్యాకింగ్ తగ్గించడానికి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు వివిధ కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో చూద్దాం!
ప్యాకింగ్ బంద్
ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకూడదనుకుంటే.. చేయాల్సింది దానిని వాడకుండా ఉండటమే. వీలైనంత వరకూ ప్లాస్టిక్ ప్యాకింగ్కు దూరంగా ఉండాలి. అత్యవసరమైతే గానీ ప్లాస్టిక్ జోలికి పోకూడదు. వీలైనంత వరకు వస్త్రంతో చేసిన సంచులు వాడటం ఉత్తమం. యూకే వ్యాప్తంగా ఇప్పటికే పలు సూపర్మార్కెట్లు, కూల్డ్రింక్స్ టిన్స్, గ్రీటింగ్ కార్డ్స్, బెడ్షీట్ల వంటి వాటిని కవర్లలో ప్యాక్ చేయడం మానేశాయి. ఉత్తర అమెరికాలో వాల్మార్ట్ షాపింగ్మాల్లో బొమ్మలకు ప్యాకింగ్ చేయట్లేదు. కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్తో ర్యాపింగ్ చేయడాన్ని వాల్మార్ట్ నిషేధించింది.
సృజనాత్మక ప్రత్యామ్నాయం
కొన్నిసార్లు ప్లాస్టిక్ ప్యాకింగ్ తప్పని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటికి సృజనాత్మక ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. కార్ల్స్బర్గ్ బీర్ల సంస్థ ఆరు టిన్లతో ఒక యూనిట్ను ప్యాక్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ప్లాస్టిక్కు బదులు జిగురును ఉపయోగిస్తోంది. ఆరు టిన్లను ఒకదానితో ఒకటి జిగురుతో అంటించి ప్యాక్ చేస్తోంది. స్వీడన్కు చెందిన ఐసీఏ రీటైల్ సంస్థ పండ్లు, కూరగాయలపై బ్రాండ్ల పేరును లేజర్తో ముద్రించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో ఆహారపదార్థాలపై సంస్థ లోగోలు, పేర్లను తినదగిన పదార్థాలతో రూపొందిస్తున్నారు.
రీఫిల్స్
యూనిలివర్, ఎస్.సీ జాన్సన్ వంటి సంస్థలు గాఢత ఎక్కువగా ఉండే క్లీనింగ్ రసాయనాలను చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నాయి. వీటిని మొదటిసారి కొనుగోలు చేసిన ప్లాస్టిక్ సీసాలో పోసి.. కొన్ని నీళ్లు కలిపి వాడుకోవచ్చు. ప్లాస్టిక్ సీసా ఖాళీ అయిన ప్రతిసారి కొత్తది కొనే బదులు ఈ విధంగా చేస్తే.. ప్లాస్టిక్ వాడకం తగ్గిపోతుంది. ఈ ఆలోచన బాగుండటంతో టూత్పేస్ట్లు, డిటర్జెంట్ పౌడర్లను కూడా మందు బిళ్లల రూపంలో తయారు చేస్తున్నారు. కోకాకోలా, పెప్సీ కూడా ఈ తరహా విధానంలోకి మారడానికి ప్రయత్నిస్తున్నాయి.
ప్రత్యామ్నాయం.. పునర్వినియోగం
ఒకప్పుడు పాలను పాల వ్యాపారులు సీసాల్లో విక్రయించేవారు. ప్రతిరోజూ ఖాళీ చేసిన సీసాను తీసుకొని పాలు నింపిన మరో సీసా ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం పాలను ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. అయితే ఫ్రాన్స్కి చెందిన ఓ కంపెనీ మళ్లీ గతకాలం పద్ధతిని అమలు చేస్తోంది. ఫ్రాన్స్, లాటిన్ అమెరికాలో పాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఇంటికి తెచ్చి ఇచ్చే ‘డానన్’ సంస్థ పాలను సీసాలు, జగ్గుల్లో విక్రయిస్తోంది. చందాదారులుగా మారిన కస్టమర్ల ఇంటికి వాటిని తెచ్చిచ్చి.. మరుసటి రోజు వాటిని తీసుకొని.. శుభ్రపర్చి తిరిగి ఉపయోగిస్తోంది. ముంబయిలో ‘డబ్బావాలా’ల గురించి అందరికీ తెలిసిందే. ఆఫీసుల్లో ఉద్యోగులకు వారి ఇంటి నుంచి లంచ్ బాక్సులను తీసుకొచ్చి ఇస్తుంటారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని లండన్లో ‘డబ్బా డ్రాప్’ పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను స్టీల్డబ్బాల్లో డెలివరీ చేసి.. ఖాళీ చేసిన తర్వాత తిరిగి తీసుకుంటారు.
ప్లాస్టిక్ రీసైకిల్
ప్యాకింగ్ చేసే ప్లాస్టిక్ను రీసైకిల్ చేయలేకపోవచ్చు. కానీ, రీసైకిల్ చేసే ప్లాస్టిక్ను తయారు చేయొచ్చు. ఆకుపచ్చ ప్లాస్టిక్ బాటిల్లో స్ప్రైట్ కూల్డ్రింక్ను విక్రయించే కోకాకోలా రీసైకిల్ చేయగలిగే పారదర్శక ప్లాస్టిక్ను వినియోగించాలని నిర్ణయించింది. కోల్గేట్ కూడా టూత్పేస్ట్ ట్యూబ్లను రీసైకిల్ చేయగలిగే ప్లాస్టిక్తో తయారు చేస్తోంది. పీఅండ్జీ, నెస్లే వంటి పలు సంస్థలు తమ ఉత్పత్తులపై బార్కోడ్ను ఏర్పాటు చేస్తున్నాయి. బార్కోడ్ ద్వారా ఆటోమెటిక్గా వ్యర్థంగా మారిన ప్లాస్టిక్ను సంబంధిత రీసైక్లింగ్ ప్లాంట్కు చేరేలా చేస్తాయి.
సేంద్రియ ఎరువుల కోసం..
ప్లాస్టిక్కు బదులు బయోడిగ్రేడబుల్ పదార్థాలను ఉపయోగిస్తే పర్యావరణానికి జరిగే హానిని తగ్గించవచ్చు. ఎరువు, బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే వీలుంటుంది. కొన్ని టీ సంస్థలు వాటి టీ బ్యాగుల్లో ప్లాస్టిక్కి బదులు బయోడిగ్రేడబుల్ పదార్థాలను వాడుతున్నాయి. వాటిని ఒక్కచోట చేర్చి సేంద్రీయ ఎరువు తయారు చేయొచ్చు. ఆపిల్ గోవర్ బొస్టాక్ అనే సంస్థ విక్రయించే పండ్లపై ఎరువుల తయారీకి ఉపయోగపడే పదార్థాలతో స్టిక్కర్లను వాడుతోంది.
కాగితంతో సరి
కొన్ని వస్తువులకు ప్లాస్టిక్కు బదులు కాగితాన్ని కూడా ఉపయోగించవచ్చు. అలాంటి వాటికోసం ప్రత్యేకంగా కాగితంతో కవర్లను తయారు చేస్తున్నారు. ఎక్కువగా కిరాణా దుకాణాల్లో ఇలాంటి కాగితం కవర్లను ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్ నుంచి కప్పుల వరకు అన్ని వస్తువులను కొన్ని సంస్థలు కాగితం, కార్డ్బోర్డులతో ప్యాకింగ్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్హైమర్ (Robert J Oppenheimer).


తాజా వార్తలు (Latest News)
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!
-
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
-
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?
-
సాగర సర్పం.. కాటేస్తే కష్టం