అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము నేతృత్వంలో మంగళవారం......

Published : 21 Jul 2020 19:54 IST

దిల్లీ: ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము నేతృత్వంలో మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమర్‌నాథ్‌ యాత్ర నిర్వహించడడం శ్రేయస్కరం కాదని, అందుకే ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నామని సమావేశం అనంతరం అమర్‌నాథ్‌ బోర్డు ప్రకటించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వర్చువల్‌ దర్శన సదుపాయాన్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించింది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఈ యాత్ర నిర్వహించాలని తొలుత భావించినా.. చివరికి రద్దు చేయడం గమనార్హం. గతేడాది ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్ర సగంలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని