రుచి, వాసనలే కచ్చితమైన సూచికలు..!
వాసన, రుచి కోల్పోయే లక్షణాలే కరోనా వైరస్ను గుర్తించడంలో కీలకంగా ఉన్నాయని తాజా పరిశోధనలు స్పష్టంచేస్తున్నాయి.
లండన్ పరిశోధకుల వెల్లడి
లండన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ను గుర్తించడంలో వ్యాధి లక్షణాలు ఎంతో కీలకం. ఇప్పటివరకు జ్వరం, దగ్గు వంటి వాటిని ముఖ్య లక్షణాలుగానే పరిగణిస్తున్నారు. అయితే, వీటికంటే వాసన, రుచి కోల్పోయే లక్షణాలే వైరస్ను గుర్తించడంలో కీలకంగా ఉన్నాయని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. యూనివర్సిటీ కాలేజీ లండన్(UCL)కు చెందిన నిపుణులు తొలిసారిగా వీటిపై పరిశోధన చేశారు.
లండన్లో వైరస్ విజృంభిస్తోన్న ఏప్రిల్-మే మధ్యకాలంలో కొవిడ్ లక్షణాలపై ఈ తరహా పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా రుచి, వాసన కోల్పోతున్న వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా దాదాపు 590మందిని రిజిస్టర్ చేయించుకున్నారు. అనంతరం వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురికి యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు గుర్తించారు. దీంతో వారందరికీ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఇలా మొత్తం 78శాతం మందికి వైరస్ సోకినట్లు కనుగొన్నారు. 40శాతం మందికి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కూడా లేవని, కానీ, వారు రుచి, వాసనను గుర్తుపట్టలేక పోతున్నారని పేర్కొన్నారు. దీంతో రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కరోనా వైరస్ను గుర్తించడంలో అత్యంత నమ్మకమైన సూచికలుగా నిర్ధారించారు. ప్రస్తుతం లండన్తోపాటు చాలా ప్రాంతాల్లో రెండో దఫా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో ఇలాంటి లక్షణాల ద్వారా వైరస్ సోకిన వారిని వీలైనంత త్వరగా గుర్తించవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రేచెల్ బాటర్హమ్ స్పష్టంచేశారు. అనంతరం వారికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంతవరకు నియంత్రించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా ఇంటిలో ఉండే ఉల్లి, వెల్లుల్లి, కాఫీ, పెర్ఫ్యూమ్ వంటి వాసనలను పసిగట్టలేకపోతున్నట్లు గుర్తించిన వెంటనే కొవిడ్ టెస్టు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం లండన్లో ఈ తరహా ప్రక్రియ కొనసాగుతోందని, కానీ, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జ్వరం, శ్వాసకోశ లక్షణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఈ లక్షణాలను ప్రామాణికంగా తీసుకోవాలని లండన్ పరిశోధకులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. -
కోర్టులో రాజకీయాలు వద్దు
కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. -
కేజ్రీవాల్ బెయిల్పై రేపు సుప్రీం ఉత్తర్వులు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. -
దక్కని బెయిల్.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ
మహిళ కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 100 సర్వీసుల రద్దు
టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.
తాజా వార్తలు (Latest News)
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..