అణ్వాయుధ నిషేధానికి 50దేశాలు ఆమోదం!
అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందంపై ఇప్పటివరకు 50దేశాలు ఆమోదం తెలిపినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో వచ్చే 90రోజుల్లోనే ఈ నిషేధం అమలులోకి రానుంది.
త్వరలోనే అమల్లోకి రానున్న అంతర్జాతీయ ఒప్పందం
న్యూయార్క్: అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందంపై ఇప్పటివరకు 50దేశాలు ఆమోదం తెలిపినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో వచ్చే 90రోజుల్లోనే ఈ నిషేధం అమలులోకి రానుంది. ఈ అంతర్జాతీయ ఒప్పందానికి 50దేశాలు ఆమోదం తెలపడం చారిత్రక మైలురాయిగా ఐరాస అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిన దేశాలను ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అభినందించారు. అణుపేలుళ్లు, అణు పరీక్షల నుంచి బయటపడిన వారికి వందనం చేసిన ఆయన, వీటి నిషేధం కోసం వారి చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అణ్వాయుధాల వాడకం వల్ల కలిగే విపత్కర పరిణామాలపై ప్రపంచానికి చాటిచెప్పడం మరింత సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు.
అణ్వాయుధాలను నిషేధంపై జరిగిన ‘ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్(TPNW)’ఒప్పందం అమలులోకి రావడానికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 50దేశాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తాజాగా హోండూరస్ దీన్ని ఆమోదించడంతో అణ్వాయుధ నిషేధానికి మార్గం సుగమమైంది. దీంతో వచ్చే 90రోజుల్లోనే ఇది అమలులోకి రానుంది. అనగా, 22 జనవరి 2021 నుంచి అణ్వాయుధాల నిషేధం అమలులోకి వస్తుంది. అయితే, అమెరికాతో పాటు అణ్వాయుధాలు కలిగిన శక్తిమంతమైన దేశాలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా దేశాలు కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. అంతేకాకుండా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని అమెరికా గట్టిగా వాదిస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధం కాలంలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణ్వాయుధ ప్రయోగ ప్రభావం ఇప్పటికీ సాక్షాత్కరిస్తూనే ఉంది. అప్పటినుంచి వీటిపై నిషేధం విధించాలని అంతర్జాతీయంగా పౌర సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలోనే ఐక్యరాజ్యసమితి కూడా ఏర్పడింది. ఇలా 75సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత అణ్వాయుధ నిషేధం అమలులోకి రానుంది. ఈ ఒప్పందం ప్రకారం, అణ్వాయుధాలు లేదా ఇతర అణు పేలుడు పరికరాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, తయారు చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం వంటివి నిషేధం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
దిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్కు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి ప్యాకెట్ వచ్చింది. దీంతో ఆ సంస్థతో చిన్నపాటి యుద్ధమే నడిపాడు. -
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
ఆమ్ఆద్మీ పార్టీ అక్రమ మార్గంలో కోట్ల రూపాయల విదేశీ నిధులను పొందిందని సోమవారం ఈడీ ఆరోపించింది. -
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
గుజరాత్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుజరాత్ ఏటీఎస్ అధికారులు నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. -
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
లోక్సభ ఎన్నికల అయిదో దశ పోలింగ్ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. -
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
తన తల్లి హీరాబెన్ చివరి రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. -
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి నేపథ్యంలో.. ఆయన గౌరవార్థం భారత్లో మే 21న సంతాపదినం పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
Bail conditions for Pune teen: తన డ్రైవింగ్తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్కు పుణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, షరతుల కింద ప్రమాదంపై ఆ బాలుడిని వ్యాసం రాయమని న్యాయస్థానం చెప్పడం గమనార్హం. -
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటేశారు. మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. -
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ