కరోనాలోనూ రైలు కూత ఆగలేదు..
కరోనా మహమ్మారి వెంటాడినప్పటికీ ఈ ఏడాది రైల్వేలో 98 శాతం సరకు రవాణా జరిగిందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే కేవలం 2 శాతం మాత్రమే తక్కువ జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు 2020 ఏడాదికి సంబంధించిన......
రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ వెల్లడి
దిల్లీ: కరోనా మహమ్మారి వెంటాడినప్పటికీ ఈ ఏడాది రైల్వేలో 98 శాతం సరకు రవాణా జరిగిందని రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే కేవలం 2 శాతం మాత్రమే తక్కువ జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు 2020 ఏడాదికి సంబంధించిన ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్ ప్రణాళికలను మీడియాకు వెల్లడించారు. 2020లో తొలిసారి కిసాన్ ప్రత్యేక రైళ్లు నడపడం ఈ ఏడాది రైల్వేశాఖ ప్రత్యేకత అని వీకే యాదవ్ వెల్లడించారు. మొదటి కిసాన్ రైలు మహారాష్ట్ర నుంచి దేవ్లాలి నుంచి బిహార్లోని దనాపూర్కు నడిపామని, డిమాండ్ దృష్ట్యా దాన్ని ముజఫర్పూర్ వరకు పొడిగించామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 రూట్లలో కిసాన్ రైళ్లు నడుపుతున్నామని వివరించారు. ఇప్పటి వరకు 27వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా జరిగిందని తెలిపారు. ఈ రైళ్ల వల్ల రైతుల పంటలకు మంచి మార్కెట్ వచ్చిందని చెప్పారు.
ప్రమాదాల నివారణకు అన్ని రైళ్లలో బోగీలను ఎల్హెచ్బీ కోచ్లుగా మార్చడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని వీకే యాదవ్ వివరించారు. ఈ కోచ్ల నిర్మాణంలో ఆత్మనిర్భర్ భారత్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. 120 కిలోమీటర్లు.. 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే ప్యాసింజర్ లోకోమోటివ్ ఇంజిన్లు మేకిన్ ఇండియాలో భాగంగా తయారవుతున్నాయని చెప్పారు. 2022 డిసెంబర్ నాటికి తొలి లోకోమోటివ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఛార్ధామ్ యాత్రికులకు గుడ్న్యూస్
ఛార్ధామ్ యాత్రికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. నాలుగు క్షేత్రాలను కలుపుతూ నిర్మించే ఈ రైల్వే లైను నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని తెలిపింది. అలాగే, 2024 డిసెంబర్ నాటికి 125 కిలోమీటర్ల పొడవైన రిషికేశ్ - కర్ణప్రయాగ్ రైలు లింక్ పూర్తవుతుందని వెల్లడించారు. మరోవైపు రామేశ్వరం ఆధునిక పంబన్ వంతెన 2021 అక్టోబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు.
ఒకేసారి ‘బుల్లెట్’
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్కు సంబంధించి ఇప్పటి వరకు 1396 హెక్టర్లలో 949 హెక్టార్ల భూమిని రైల్వే శాఖ సేకరించామని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. గుజరాత్లో 90 శాతం వరకు భూసేకరణ పూర్తయ్యిందని తెలిపారు. మహారాష్ట్రలోని థానేలో భూసేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అక్కడ దశలవారీగా భూ సేకరణ జరుగుతుందన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ మొత్తం ఒకేసారి ప్రారంభించడానికి రైల్వే శాఖ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని వివరించారు. మొదటి దశ బుల్లెట్ రైలును 325 కిలోమీటర్ల నిడివిలో నడుపుతామని వివరించారు.
అదో గొప్ప విజయం
కరోనా సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, బొగ్గు, ఎరువులు, ఔషధాలు సహా అవసరమైన అన్ని వస్తువులను చేరవేయడం రైల్వే శాఖ సాధించిన అతిపెద్ద ఘనత అని వీకే యాదవ్ అన్నారు. లాక్డౌన్ సమయంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కార్మిక ప్రత్యేక రైళ్లను నడపడం కూడా ఒక పెద్ద విజయమేనని చెప్పారు. భద్రతను పెంచుతూ డిమాండ్ ప్రకారం ప్రయాణికుల, సరకు రవాణా రైళ్లను నడపడమే లక్ష్యమని కొత్త సంవత్సరం ప్రాధాన్యాలను రైల్వే బోర్డు ఛైర్మన్ వివరించారు.
ఇవీ చదవండి..
నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు: మోదీ
పూజాదేవి.. తొలి మహిళా బస్సు డ్రైవర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత