స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో.. వేదికపై కుప్పకూలిన ఆరోగ్య మంత్రి, స్పీకర్‌

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో(Independence day celebrations) భాగంగా ఇద్దరు నేతలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అక్కడున్న అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. 

Published : 15 Aug 2023 16:26 IST

భోపాల్: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని రాయ్‌సేన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆరోగ్య మంత్రి ప్రభురామ్‌ చౌధరీ(Prabhuram Choudhary) ఒక్కసారిగా వేదికపై కుప్పకూలారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరిస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు. అదే సమయంలో మౌగంజ్‌లో కూడా ఇదే తరహా ఘటన జరిగింది.

ఏకధాటిగా 90 నిమిషాలు.. ప్రసంగంలో మోదీ సరికొత్త రికార్డ్‌

 మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించడం ప్రారంభించారు. ప్రసంగం మధ్యలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాయ్‌సేన్‌లో మూడు తిరంగా ర్యాలీలు జరిగాయి. దానిలో పాఠశాల విద్యార్థులు, పోలీసులు, ఆ ప్రాంత అధికారులు పాల్గొన్నారు. అలాగే ఆరోగ్యమంత్రి కూడా తిరంగా యాత్రలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని