Bullet train project: 2026లో బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్.. 350 kmph వేగంతో నిర్వహణ
అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కు సంబంధించి చాలా రోజుల తర్వాత ఓ కొత్త అప్డేట్ వచ్చింది. 2026లో తొలిదశ ట్రయల్స్ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలుత గుజరాత్లోని బిలిమొర నుంచి సూరత్ మధ్య ఈ ట్రయల్స్ నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
భరూచ్ (గుజరాత్): అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కు సంబంధించి చాలా రోజుల తర్వాత ఓ కొత్త అప్డేట్ వచ్చింది. 2026లో తొలిదశ ట్రయల్స్ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలుత గుజరాత్లోని బిలిమొర నుంచి సూరత్ మధ్య ఈ ట్రయల్స్ నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తదుపరి ఇతర సెక్షన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రయల్ రన్లో భాగంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెడుతుందని, ఇది విమానం టేకాఫ్ అయ్యే వేగంతో సమానమని వివరించారు. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని అధికారులు అభిప్రాయపడ్డారు. విమాన ప్రయాణంతో బుల్లెట్ ట్రైన్ పోటీ పడుతుందని తెలిపారు. విమాన ప్రయాణంతో పోల్చినప్పుడు చెక్-ఇన్ టైమ్ తక్కువగా ఉండడంతో పాటు కూర్చునేందుకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. విమానాల్లో అందుబాటులో ఉండనటు వంటి కనెక్టివిటీ సదుపాయం బుల్లెట్ ట్రైన్లో లభిస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన స్లాబ్ ట్రాక్ సిస్టమ్గా పిలిచే ప్రత్యేక ట్రాక్పై ఈ రైళ్లు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. గరిష్ఠంగా 350 కిలోమీటర్ల వేగాన్ని ఈ ట్రాకులు తట్టుకుంటాయని వివరించారు. అయితే, ఈ రైలు టికెట్ ధర ఇంచుమించు ఎకానమీ విమాన టికెట్ ధరకు సమానంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వేగవంతమవుతున్న వేళ రైలు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా గుజరాత్లో నేషనల్ హై స్పీడ్రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 99 శాతం భూమిని సేకరించింది. గుజరాత్, దాద్రా నగర్ హవేలీలో మొత్తం 352 కిలోమీటర్లకు సంబంధించిన పనులు ఇప్పటికే స్వదేశీ గుత్తేదారులకు అప్పగించారు. మొత్తం ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఒకసారి ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. జపాన్ సహకారంతో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.