Indian Army: గల్వాన్లో ఉద్రిక్తతల వేళ..అప్పటి ఆర్మీ చీఫ్కు రాజ్నాథ్ ఏం ఆదేశాలిచ్చారు?
భారత్-చైనా సైనికుల మధ్య మూడేళ్ల క్రితం గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ (Galwan clash) అనంతరం ఉద్రిక్త పరిస్థితుల వేళ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అప్పటి భారత సైనికాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణెకు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలిసింది.
దిల్లీ: భారత్-చైనా సైనికుల మధ్య మూడేళ్ల క్రితం గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ (Galwan clash) ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. 2020 జూన్ నాటి పరిస్థితులు యుద్ధం అంచులకు తీసుకెళ్లాయి. ఆ సమయంలో అప్పటి భారత సైనికాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె (Indian Army), రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రితోపాటు జాతీయ భద్రతా సలహాదారు మధ్య కీలక సంభాషణలు జరిగాయి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ‘మీకు ఏది సముచితం అనిపిస్తే అది చేయండి’ అంటూ జనరల్ నరవణెకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ రాజ్నాథ్ సింగ్ ఆదేశాలిచ్చారని తెలిసింది.
గల్వాన్ ఘర్షణ అనంతరం తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. ఆగస్టు నెలలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న రెకిన్ లా పర్వత ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకులు, సైనిక బలగాలను చైనా మోహరించడం మొదలుపెట్టింది. సరిహద్దులకు చేరుకోవడం మరింత క్లిష్లతరంగా మారింది. ఇదే విషయాన్ని కేంద్ర రక్షణశాఖకు భారత సైన్యం వివరించడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వివిధ శాఖాధిపతులతో సంప్రదింపులు చేపట్టింది. ఆగస్టు 31 రాత్రి రక్షణశాఖ మంత్రి, విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ల మధ్య ఫోన్ కాల్స్ సంభాషణలు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ఆదేశాలను జనరల్ నరవణె గుర్తుచేసుకున్నారు.
Gen Naravane: జూన్ 16ను.. షీ ‘జిన్పింగ్’ ఇప్పట్లో మరచిపోడు!
రాజ్నాథ్ సింగ్ నుంచి ఫోన్ కాల్ రాగానే తన మదిలో వంద రకాల ఆలోచనలు వచ్చాయని జనరల్ నరవణె పేర్కొన్నారు. ‘పరిస్థితి తీవ్రతను రక్షణ మంత్రికి తెలియజేశాను. రాత్రి 11.30లోపు తిరిగి సంప్రదిస్తానని రాజ్నాథ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని చెప్పారు. అది పూర్తిగా సైనిక నిర్ణయమని, మీకు ఏది సముచితం అనిపిస్తే అది చేయండి అని సూచించారు. దాంతో బాధ్యత మొత్తం నాపైనే పడింది. అప్పుడు దీర్ఘశ్వాస తీసుకొని కొన్ని నిమిషాల పాటు అలాగే మౌనంగా కూర్చున్నా’.
అనంతరం తూర్పు కమాండ్, పలువురు ఇతర అధికారులతో ఆర్మీ హౌస్ అన్ని మ్యాప్లను పరిశీలించాం. అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం.. కానీ, నిజంగా యుద్ధం ప్రారంభించాలా? అనే ప్రశ్న మొదలయ్యింది. ఓవైపు కొవిడ్ మహమ్మారి, మరోవైపు ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వస్తు సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి ప్రతికూల సమయంలో యుద్ధం మొదలుపెడితే అంతర్జాతీయంగా మనకు మద్దతుగా నిలిచేవారు ఎవరు? చైనా-పాకిస్థాన్లు కలిస్తే ఎదురయ్యే ముప్పు ఏంటి? ఇలా వందల ప్రశ్నలు ఆ రోజు రాత్రి తన మదిలో మెదిలినట్లు జనరల్ ఎం.ఎం.నరవణె తన పుస్తకంలో వివరించారు. యుద్ధం అంచులకు వెళ్లిన నాటి పరిస్థితుల్లో వ్యవహరించిన తీరును ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) పుస్తకంలో పేర్కొన్నారు. మాజీ సైనికాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రాసిన ఈ పుస్తకం త్వరలో అందుబాటులోకి రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పలు స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పలు స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
-
పలు స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
-
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!