ఆంగ్లమాధ్యమం కేసు విచారణ వాయిదా

ఆంగ్ల మాధ్యమం కేసు విచారణ సుప్రీంకోర్టులో  వాయిదా పడింది.

Published : 16 Feb 2021 14:01 IST

దిల్లీ: ఆంగ్ల మాధ్యమం కేసు విచారణ సుప్రీంకోర్టులో  వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి  చేస్తూ తెచ్చిన జీవోలు 81, 85లను హైకోర్టు  రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే,  ముఖ్యమైన కేసు విచారణ ఉండటంతో ఆంగ్ల మాధ్యమం కేసు విచారణ వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే తెలిపారు. తదుపరి విచారణ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని