NewsClick: న్యూస్క్లిక్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఫౌండర్ ఇల్లు, ఆఫీసులో సీబీఐ సోదాలు
ఆన్లైన్ పోర్టల్ న్యూస్క్లిక్ (NewsClick)పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ ఇల్లు, ఆఫీసులో బుధవారం సోదాలు చేపట్టింది. ఇప్పటికే ప్రబీర్ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దిల్లీ: చైనా (China) నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ వార్తా పోర్టల్ ‘న్యూస్క్లిక్ (NewsClick)’పై దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. ఈ సంస్థపై తాజాగా సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించిన సీబీఐ.. న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ (Prabir Purkayastha) ఇల్లు, ఆఫీసులో బుధవారం సోదాలు చేపట్టింది. ఈ ఉదయం ప్రబీర్ నివాసానికి, కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.
ఇటీవల ప్రబీర్ను దిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. న్యూస్క్లిక్కు చైనా నుంచి నిధులు అందాయన్న ఆరోపణలపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. ఇటీవల ప్రబీర్ నివాసం సహా ఆ సంస్థ కార్యాలయం, అందులో పనిచేసే సీనియర్ జర్నలిస్టుల ఇళ్లల్లో విస్తృత సోదాలు చేపట్టారు. అనంతరం ప్రబీర్ను, సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేశారు. వీరికి కోర్టు పోలీసు కస్టడీ విధించింది.
భారత్-కెనడా దౌత్య వివాదం.. విదేశాంగ మంత్రుల రహస్య భేటీ..!
భారత్ వ్యతిరేక ప్రచారం కోసం, దేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచేందుకు న్యూస్క్లిక్కు (NewsClick) చైనా నుంచి భారీ మొత్తాల్లో నిధులు వచ్చాయంటూ దిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులతో కలిసి 2019 లోక్సభ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు వీరు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను న్యూస్క్లిక్ తోసిపుచ్చింది. హింస, వేర్పాటువాదం, మరే విధమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తామెన్నడూ పాల్పడలేదని, తమ వార్తా కథనాల్ని చూసినా ఈ విషయం తెలుస్తుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.