ISRO: దోశ.. ఫిల్టర్ కాఫీ: ఇస్రో విజయ మంత్రాలట..!
చంద్రయాన్-3(Chandrayaan-3), ఆదిత్య-ఎల్1(Aditya-L1).. ఇలా వరుస ప్రాజెక్టులతో ఇస్రో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. ఒక ప్రయోగం తర్వాత మరో ప్రయోగం బాధ్యతలు చూస్తున్న వారిని మోటివేట్ చేసే అంశాలేంటో తెలిస్తే ఆశ్చర్యం కలగమానదు.
దిల్లీ: చంద్రయాన్-3(Chandrayaan-3) విజయాన్ని ఆస్వాదిస్తున్న భారతీయులకు భారత అంతరిక్ష సంస్థ(ISRO) 10 రోజుల వ్యవధిలో మరో ట్రీట్ ఇచ్చింది. శనివారం సూర్యుడి సమీపంలో పరిశోధనలకు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1(Aditya-L1)ను విజయవంతంగా లాంచ్ చేసింది. ఇంతటి చరిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న మన శాస్త్రవేత్తలు చప్పట్లతోనే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అంతేతప్ప ఆ హడావుడి బయట ఎక్కడా కనిపించదు. తమ పనిగంటలు ముగిసిన తర్వాత కూడా అదనపు సమయాన్ని ప్రాజెక్టు పూర్తి చేయడానికే కేటాయిస్తుంటారు.
అలాంటిది.. ప్రపంచవ్యాప్తంగా భారత్కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతోన్న వీరిని ఇంతగా మోటివేట్ చేస్తున్న అంశం ఏమిటి..? ఈ ప్రశ్న ఎవరికైనా రాక మానదు. సమాధానం వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే..! ప్రతి సాయంత్రం రుచి చూసే.. మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ వారి విజయ మంత్రాలట. జాబిల్లి మిషన్ విజయం సాధించినందుకు శాస్త్రవేత్తలకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఏమీ లేవట. మిషన్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. ‘ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటలకు మేం భుజించే మసాలా దోశ, ఫిల్టర్ కాఫీతోనే ఈ విజయం సాధించాం. ఇప్పుడు అకస్మాత్తుగా వీటి మీద అందరికి ఆసక్తి పెరిగింది’ అని శర్మ వెల్లడించారు. ఆయన ఇస్రో(ISRO) ఉద్యోగినినే వివాహమాడారని ఆ కథనం పేర్కొంది.
జాబిల్లి ఉపరితలంపై.. ‘సెంచరీ’ కొట్టిన రోవర్!
ఇదివరకు ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ మాట్లాడుతూ.. తమ శాస్త్రవేత్తలు సాధారణ జీవితాన్నే గడుపుతారని అన్నారు. ‘వారెప్పుడు డబ్బును పట్టించుకోరు. ఏకాగ్రత మొత్తం మిషన్పైనే ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని నిపుణుల జీతాల్లో ఐదో వంతు మాత్రమే తీసుకునే మన(ISRO) శాస్త్రవేత్తలు.. ఈ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..
-
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
-
అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
-
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం