US: ఒకేరోజు మూడు చోట్ల కాల్పులు.. నలుగురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకోగా నలుగురు మృతిచెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మేరీల్యాండ్‌లో శనివారం కాల్పుల కలకలం రేగింది....

Updated : 21 Dec 2022 14:52 IST

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకోగా నలుగురు మృతిచెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మేరీల్యాండ్‌లో శనివారం కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరొకరికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు తెగబడినట్లుగా భావించిన అనుమానితుడిని పోలీసులు అక్కడిక్కడే కాల్చిచంపినట్లు తెలుస్తోంది. నిందితుడు కాల్పులు జరపడానికి కారణాలు తెలియరాలేదు.

దక్షిణ ఫ్లోరిడాలోని ఓ మాల్‌లో రెండు సమూహాల మధ్య గొడవ కాల్పులకు దారి తీసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లోనూ శనివారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురిపై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. వారికోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు