రైల్వే ప్రయాణికులకు శుభవార్త
కరోనా వైరస్ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా లాక్డౌన్ మూడోసారి
రేపటి నుంచి బుకింగ్లు
న్యూదిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా లాక్డౌన్ మూడోసారి మే 17వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తోంది. ఇప్పటికే వలస కూలీలను శ్రామిక్ రైళ్ల ద్వారా వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది. తాజాగా మే 12వ తేదీ నుంచి దశల వారీగా పాసింజర్ రైళ్లను కూడా నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా దేశంలోని 15 ముఖ్య నగరాలకు నడపనున్నారు.
దిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు(15 రైళ్లు) అక్కడి నుంచి నుంచి దిల్లీకి(15 రైళ్లు) మొత్తం 30 రైళ్లను నడపాలని నిర్ణయించారు. దిల్లీ నుంచి దిబ్రూఘర్, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావిలకు అక్కడి నుంచి దిల్లీకి ఈ రైళ్లు తిరగనున్నాయి. దీని తర్వాత రైల్వే కోచ్లు అందుబాటులో ఉన్న దానిని బట్టి ప్రత్యేక రైళ్లు నడిపే విషయమై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 20వేల కోచ్లను కొవిడ్-19 కేర్ సెంటర్లుగా మార్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రోజూ 300 శ్రామిక్ రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది.
ఇక పాసింజర్ రైళ్లలో రిజర్వేషన్లు మే 11వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి మొదలవుతాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను మూసే ఉంచుతారు. కన్ఫార్మ్ అయిన టికెట్లు కలిగిన ప్రయాణికులకు మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతి ఉంటుంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్, ధరించి, స్క్రీనింగ్కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తారు. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Arvind Kejriwal: మద్యం కేసులో కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM