‘వారి బాధలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి’
‘వలస కార్మికుల దీనావస్థను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇదొక మానవ విషాదం’ అంటూ కేంద్రం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి శనివారం మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
వలస కార్మికుల కష్టాలపై మద్రాస్ హైకోర్టు వ్యాఖ్య
చెన్నై: ‘వలస కార్మికుల దీనావస్థను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇదొక మానవ విషాదం’ అంటూ కేంద్రం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి శనివారం మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించింది.
‘వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి కొన్ని రోజుల పాటు నడుస్తుండటం, ఈ క్రమంలో వారు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి రక్షణకు చర్యలు తీసుకోవాలి. గత నెల రోజులుగా వారి గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇదొక మానవ విషాదం’ అని ఇరు ప్రభుత్వాల మీద హైకోర్టు మండిపడింది. అలాగే సొంతూరుకు చేరుకోవడానికి కొందరు కూలీలు నడిచి, నడిచి అలసిపోయి ట్రాకుల మీద నిద్రపోయి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద రైలు ప్రమాదానికి గురైన ఘటనను ప్రస్తావించింది. హైకోర్టు ఈ సంక్షోభాన్ని సుమోటోగా తీసుకొని విచారించింది. మే 22లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
అయితే మద్రాస్ కోర్టు విమర్శలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి స్పందించారు. ‘మిమ్మల్ని తిరిగి పంపించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తున్నాం. అప్పటివరకు శిబిరాల్లో ఉండండి. ప్రయాణ ఖర్చుల గురించి అడుగుతున్నాం. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన 53,000మంది కార్మికులను పంపించివేశాం’ అని ఆయన వలస జీవులను అభ్యర్థించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.