Booster Dose: బూస్టర్ డోసుతో కొత్త వేరియంట్లకు అడ్డుకట్ట
కరోనా వ్యాపిస్తున్నకొద్దీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదకరంగా మారుతున్నాయి. టీకా తీసుకున్నవారు కూడా మహమ్మారికి చిక్కుతున్నారు. దీంతో వ్యాక్సిన్ల ద్వారా లభిస్తున్న రోగనిరోధక..
అవయవమార్పిడి చేయించుకున్న వారిలోనూ యాంటీ బాడీల అభివృద్ధి
వర్జీనియా విశ్వవిద్యాలయ అంటు వ్యాధుల నిపుణుడు విలియం పెట్రి
రిచ్మండ్: కరోనా వ్యాపిస్తున్నకొద్దీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదకరంగా మారుతున్నాయి. టీకా తీసుకున్నవారు కూడా మహమ్మారికి చిక్కుతున్నారు. దీంతో వ్యాక్సిన్ల ద్వారా లభిస్తున్న రోగనిరోధక శక్తితో వైరస్ నుంచి రక్షణ పొందలేమా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బూస్టర్ డోసు ఆవశ్యకతపై శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలు చపట్టారు. బూస్టర్ డోసుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న పలు కీలక ప్రశ్నలకు... యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన మైక్రో బయాలజిస్ట్, అంటు వ్యాధుల నిపుణుడు విలియం పెట్రి సమాధానాలిచ్చారు. ఈ డోసు అవసరమా? ఎవరికి, ఎప్పుడు ఇవ్వాలి అనే విషయాలను వివరించారు.
బూస్టర్ డోసు అంటే?
మనిషి శరీరంలో రోగ నిరోధకశక్తి క్రమంగా తగ్గుతుంది. ఏ టీకా ద్వారా లభించిన ఇమ్యూనిటీకైనా ఇదే వర్తిస్తుంది. ఈ రోగ నిరోధకశక్తి కొనసాగేందుకు బూస్టర్ డోసులు ఉపయోగిస్తారు. రెండు డోసులు తీసుకున్నవారికి అదనంగా ఇచ్చే డోసు ఇది. వైరస్ మార్పులకు అనుగుణంగా కొన్నిసార్లు బూస్టర్ డోసును మరింత సమర్థంగా తయారు చేస్తారు. కొత్త వేరియంట్లను అడ్డుకునేలా రూపొందిస్తారు.
వ్యాక్సిన్ నియంత్రణ సంస్థలు ఏమంటున్నాయి?
అమెరికాలోని వ్యాక్సిన్ నియంత్రణ సంస్థలు... బూస్టర్ డోసు విషయమై ఇప్పటివరకూ ఎలాంటి సిఫారసులూ చేయలేదు. ఇజ్రాయెల్లో మాత్రం 60 ఏళ్లు దాటినవారు మూడో డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫ్రాన్స్లోనూ ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ డోసుపై ఎందుకు ముందుకు వెళ్లడం లేదు?
కరోనా వ్యాక్సిన్ కల్పించే రక్షణ ఎంతకాలం ఉంటుందన్నది నిర్ధారణ కాలేదు. అయితే ప్రస్తుతమున్న కొవిడ్ టీకాలన్నీ మంచి ఇమ్యూనిటీనే అందిస్తున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 3 నెలల తర్వాత కూడా ‘బీ లింఫోసైట్ల’లో అధిక మెమొరీని గుర్తించారు. ఇది యాంటీబాడీల ఉత్పత్తికి దోహదపడుతుంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేకపోయినా, వైరస్ నుంచి కొన్ని టీకాలు రక్షణ కల్పిస్తున్నట్టు ఇతర అధ్యయనాలు ధ్రువీకరించాయి. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా... బీటా వేరియంట్పై 14 రోజుల తర్వాత 73%, 28 రోజుల తర్వాత 82% సమర్థత కనబర్చింది. డెల్టా రకంపై ఫైజర్ టీకా 88% సామర్థ్యంతో పనిచేసినట్టు తేలింది. ప్లాస్మోబ్లాస్ట్ కణాల్లోనూ దీర్ఘకాల ఇమ్యూనిటీ కనిపించింది. వీటితో పాటు ఇతర కణాలకు బూస్టర్ డోసు అవసరం లేదు.
ఎవరికి అవసరమో తెలిసేదెలా?
80 ఏళ్లు దాటినవారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతున్నాయి. వీరిలో కొత్త వేరియంట్లు ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. కాబట్టి వృద్ధులకు బూస్టర్ డోసు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి.
అవయవ మార్పిడి జరిగిన వారి సంగతేంటి?
అవయవ మార్పిడి బాధితుల్లో కొవిడ్ యాంటీబాడీల ఉత్పత్తి సరిగా జరగడం లేదు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న 40 మందిలో 39 మంది టీకా తీసుకున్నా, వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదు! 20 మంది మస్క్యులో స్కెలిటల్ బాధితుల్లోనూ ఇదే ఫలితాలు వచ్చాయి. అలాగని... ఇలాంటి రోగుల్లో టీకా ప్రభావం ఏమాత్రం లేదని నిర్ధారణకు రావడం సరికాదు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు తీసుకున్న అవయవమార్పిడి బాధితుల్లో.. బూస్టర్ డోసు తర్వాత యాంటీబాడీల ఉత్పత్తి జరిగింది. దీంతో ఫ్రాన్స్కు చెందిన టీకా నియంత్రణ సంస్థ అవయవమార్పిడి బాధితులకు బూస్టర్ డోసు ఇచ్చేలా సిఫార్సు చేసింది.
మొదటి డోసు టీకానే బూస్టర్ డోసుగా తీసుకోవాలా?
అలా ఏమీ కాదు. ఫైజర్, మోడెర్నా వంటి ఆర్ఎన్ఏ టీకాలను... ఆస్ట్రాజెనెకా వంటి అడినో వైరస్ టీకాలతో కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా టీకాల సమర్థతలో ఎలాంటి తేడా ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.