Corona Effect: చదువులు ‘కరోనా’పాలు
పాఠశాల విద్యపై కరోనా మహమ్మారి చూపిన ప్రభావం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా 26.45 కోట్లమంది విద్యార్థులు, 96.87
దేశవ్యాప్తంగా 26.45 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం
తెలంగాణలో టీవీలు, ఫోన్ల ద్వారా పాఠాలు విన్నవారు: 17,27,892
డిజటల్ పరికరాలు లేని విద్యార్థులు: 1,17,570
కేంద్ర విద్యాశాఖ నివేదిక వెల్లడి
ఈనాడు, దిల్లీ: పాఠశాల విద్యపై కరోనా మహమ్మారి చూపిన ప్రభావం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా 26.45 కోట్లమంది విద్యార్థులు, 96.87 లక్షల మంది టీచర్లు, 15.07 లక్షల పాఠశాలలు దీని ప్రభావానికి లోనైనట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులు 66,65,475 మంది ఉండగా.. 3 నుంచి 10 తరగతుల విద్యార్థుల్లో 17,27,892 మంది టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల ద్వారా పాఠాలు నేర్చుకున్నట్లు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా డీడీ, టీశాట్ (నిపుణ, విద్యాఛానళ్లు) ద్వారా 11,34,900 మంది; స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, కంప్యూటర్ల ద్వారా 2,22,680 మంది తరగతులు విన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 1,17,570 మంది విద్యార్థుల వద్ద ఎలాంటి డిజిటల్ పరికరాలు లేవని సర్వేలో గుర్తించినట్లు తెలిపింది. కేంద్ర విద్యాశాఖ ‘ఇనిషియేటివ్స్ బై స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ 2020-21 ఫర్ కంటిన్యూయింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
59 వేల వాట్సప్ గ్రూపులతో పర్యవేక్షణ
తెలంగాణలో టీవీలు, ఫోన్లు లేని విద్యార్థుల కోసం గ్రామపంచాయతీల వద్ద డిజిటల్ పాఠాలను అందుబాటులో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. టీచర్లు, స్వచ్ఛంద సేవకులు ఇళ్లకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు పేర్కొంది. పిల్లల చదువులను పర్యవేక్షించి, మదింపు చేయడానికి రాష్ట్రంలో 59 వేల వాట్సప్ గ్రూప్లను పాఠశాలలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (ఎస్ఐఈటీ) తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూల్లో రూపొందించిన పాఠాలను ఏకకాలంలో డీడీ యాదగిరి, టీశాట్ ద్వారా ప్రసారం చేసినట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో
* 1-10 తరగతులు విద్యార్థులు: 81,36,933
* డిజిటల్ పరికరాలు లేనివారు: 2,01,568
* పరికరాలు ఉన్నా చాలామందికి సరైన నెట్వర్క్ సౌకర్యం అందుబాటులో లేదు.
* ఎక్కువమంది ఇళ్లలో టీవీలు ఉన్నా అవి చదువులకు ఉపయోగపడటంలేదు.
* విద్యార్థులకు 21,120 డిజిటల్ పరికరాలను (2,850 ల్యాప్టాప్లు, 18,270 ట్యాబ్లు) పంపిణీ చేశారు.
కొవిడ్ అనంతరం అమల్లోకి వచ్చిన కొత్త పద్ధతులు పిల్లల చదువులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనివల్ల చాలామంది పిల్లల్లో నేర్చుకోవడం తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీన్నుంచి బయటపడాలంటే పాఠశాలలు, ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాముల సామర్థ్యాలను బలోపేతం చేయాలి. మొత్తంగా బోధన, చదువుల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.- కేంద్ర విద్యాశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.