Train Accident: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన గూడ్స్‌ రైలు.. 10 బోగీలు బోల్తా

ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్‌ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చింది. 

Updated : 21 Nov 2022 15:35 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్‌ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చింది. 10 బోగీలు బోల్తా పడగా.. వాటి కింద పడి ముగ్గురు ప్రయాణికులు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రయాణికులు నిరీక్షించే గది సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో రైలు బోగీల కింద మరికొంతమంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మరోవైపు ఈ ప్రమాదంతో రైల్వేస్టేషన్‌లో ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కొంతభాగం కూలిపోయినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని