జడ్జీల నియామక ప్రతిపాదనలపై.. అసాధారణ పరిస్థితుల్లోనే ‘రా’ నివేదిక
సాధారణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామక ప్రతిపాదనలపై ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) నివేదికలు కోరడం పద్ధతి కాదని, జాతీయ భద్రతతో కూడిన అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ఇది తప్పనిసరి.
లోక్సభలో న్యాయశాఖ మంత్రి : కిరణ్ రిజిజు
దిల్లీ: సాధారణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామక ప్రతిపాదనలపై ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) నివేదికలు కోరడం పద్ధతి కాదని, జాతీయ భద్రతతో కూడిన అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ఇది తప్పనిసరి అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం లోక్సభలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ప్రామాణిక విధానాల ప్రకారం హైకోర్టు కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలిపేముందు అవసరమైన, అందుబాటులో ఉన్న నివేదికలను ప్రభుత్వం పరిశీలించి ఓ నిర్ణయం తీసుకొంటుందన్నారు. దిల్లీ హైకోర్టు జడ్జిగా ఓ న్యాయవాదికి పదోన్నతి కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం ‘రా’ నివేదికను బహిర్గతం చేయడంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఆ నివేదికలో అభ్యర్థి లైంగిక ఆసక్తుల (సెక్సువాలిటీ) గురించి ఉన్నట్లు పేర్కొన్నారు. ఓ విదేశీయుడు ఆ అభ్యర్థి జీవిత భాగస్వామిగా ఉన్నందున పునఃపరిశీలన నిమిత్తం ఆ పేరును కొలీజియంకు వెనక్కు పంపినట్లు వివరించారు. మద్రాసు హైకోర్టు జడ్జి నియామకానికి సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ ఫిబ్రవరి 10వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. న్యాయమూర్తులుగా తగిన వ్యక్తుల నియామకానికి వారి రాజకీయ నేపథ్యం అడ్డు కాబోదని పేర్కొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇదేవిధంగా పదోన్నతి కోసం సిఫార్సు చేసిన వ్యక్తుల విధానాలు, చర్యలను విమర్శించడమంటే వారిని అనర్హులుగా పేర్కొనడం కాదన్నారు.
ఏకకాల ఎన్నికలపై సిఫార్సుల పరిశీలన
దేశంలో లోక్సభకు, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాలంటూ పలుమార్లు తన ఆకాంక్షను వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మరోమారు ఈ వాదన వినిపించింది. అలా జరిగితే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవుతుందని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేసేలా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏకకాల ఎన్నికల ఆవశ్యకతలతో జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఏకకాల ఎన్నికల అంశాన్ని పలు కోణాల్లో పార్లమెంటరీ ప్యానెల్ అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఈసీ కూడా భాగస్వామిగా ఉన్న ఈ కమిటీ ఏకకాల ఎన్నికలపై కొన్ని సిఫార్సులను చేసిందన్నారు. లా కమిషన్ పరిశీలన ముగిశాక.. ఈ ప్రక్రియపై ఆచారణ సాధ్యమైన కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి రాజ్యాంగంలో కనీసం అయిదు ఆర్టికల్స్ సవరించాల్సి ఉంటుందన్నారు.
ఎరువులపై రాయితీ తగ్గించే యోచన లేదు
దేశంలో ఎరువులపై ఇస్తున్న రాయితీలను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు స్పష్టం చేసింది. రసాయన, ఎరువుల శాఖ సహాయమంత్రి భగవంత్ ఖుబా లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. రైతులకు ఇస్తున్న ఎరువుల రాయితీలు తగ్గిస్తే పడే ప్రభావం గురించి ఇప్పటిదాకా ఎటువంటి అధ్యయనం చేపట్టలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.