బిపోర్‌జాయ్‌ తుపాను ముప్పు!

గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు దక్షిణాన ఆగ్నేయ అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదిలి తుపానుగా మారనుంది.

Published : 07 Jun 2023 03:56 IST

దిల్లీ: గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు దక్షిణాన ఆగ్నేయ అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదిలి తుపానుగా మారనుంది. ఈ తుపానుకు బిపోర్‌జాయ్‌ అని బంగ్లాదేశ్‌ పేరు పెట్టిందని భారత వాతావరణశాఖ మంగళవారం వెల్లడించింది. వాయుగుండం సాయంత్రం ఐదున్నరకు గోవాకు 920 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన-నైరుతి ప్రాంతంలో, ముంబయికి 1,050 కిలోమీటర్ల దూరంలో నైరుతిలో, పోర్‌బందర్‌కు 1,130 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన, కరాచీకి 1,430 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా గురువారం నాటికి తీవ్ర తుపానుగా, శుక్రవారం నాటికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని