33 నేరాల్లో జైలుశిక్ష పెంపు
బ్రిటిష్ హయాం నుంచీ అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 3 నేర శిక్షాస్మృతి బిల్లులకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది.
83 నేరాల్లో జరిమానా హెచ్చింపు
హత్యానేరం సెక్షన్ ఇక 101
దేశమంతా జీరో ఎఫ్ఐఆర్
మూక హింసకు మరణ దండన
నేర జాబితా నుంచి ‘ఆత్మహత్యాయత్నం’ తొలగింపు
సత్వర న్యాయానికి సమయ నిర్దేశం
3 నేర బిల్లులకు ఆమోదం
దిల్లీ: బ్రిటిష్ హయాం నుంచీ అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 3 నేర శిక్షాస్మృతి బిల్లులకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్).. పేరుతో ఈ కొత్త బిల్లులను తీసుకొచ్చింది. గురు, శుక్రవారాల్లో ఏదో ఒక రోజున వాటిని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అక్కడా ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకమైతే అవి చట్టాలుగా మారతాయి.
సమగ్ర మార్పులు: అమిత్ షా
నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నేర బిల్లులను కొత్తగా తెచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చామని, రాజద్రోహం వంటి పదాలను తొలగించామని, దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులను చేర్చామని వివరించారు. భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా బిల్లులను తెచ్చామని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని చెప్పారు. బిల్లులకు ఆమోదం సందర్భంగా లోక్సభలో అమిత్ షా మాట్లాడారు. తొలిసారిగా బిల్లులకు మానవ హంగులు అద్దామని, గతంలో ఉన్న హర్ మెజెస్టీ, బ్రిటిష్ కింగ్డం, ద క్రౌన్, బారిష్టర్, రూలర్ వంటి పదాలు ఇక ఉండబోవని ఆయన తెలిపారు. ‘ఈ కొత్త చట్టాలు శిక్ష కంటే న్యాయంపైనే ఎక్కువ దృష్టి పెడతాయి. వలసవాద మనస్తత్వం, గుర్తుల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాయి. బాధితులకు న్యాయం చేసేవిగా ఉంటాయి’ అని పేర్కొన్నారు. సామూహిక (మూక) హింసాకాండకు పాల్పడితే మరణ దండన విధించే సెక్షన్ కొత్త బిల్లులో ఉందని అమిత్ షా తెలిపారు.
పాత కొత్త బిల్లుల్లో..
- పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 63గా పేర్కొన్నారు.
- పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉండగా.. కొత్త బిల్లులో దానిని 101 సెక్షన్గా పెట్టారు.
- కిడ్నాప్నకు పాత చట్టంలో 359వ సెక్షన్ ఉండేది. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 136 కింద చేర్చారు.
న్యాయ సంహిత బిల్లు
- కొత్తగా 20 నేరాల చేర్పు.
- ఐపీసీలోని 19 నిబంధనల తొలగింపు.
- 33 నేరాల్లో జైలు శిక్ష పెంపు.
- 83 నేరాల్లో జరిమానా పెంపు.
- 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధింపు.
- కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష.
- పిల్లలకు నిర్వచనం.
- జెండర్లో ట్రాన్స్జెండర్ల చేర్పు.
- దస్త్రాలుగా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల పరిగణన.
- చరాస్తికి విస్తృత నిర్వచనం.
- మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం.
- నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యాయం.
- వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, హిట్ అండ్ రన్, మూక దాడి, పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయడం, ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు నిర్వచనం.
- ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగింపు.
- భిక్షాటన మానవ అక్రమ రవాణా నేరంగా పరిగణన.
- రూ.5వేల లోపు దొంగతనాలకు సమాజ సేవ శిక్ష విధింపు.
- పిచ్చివాడు, అవివేకి, ఇడియట్ వంటి పురాతన పదాలు తొమ్మిది చోట్ల తొలగింపు.
- బ్రిటీష్ క్యాలెండర్, క్వీన్, బ్రిటీష్ ఇండియా, శాంతి కోసం న్యాయం వంటి పదాల తొలగింపు.
- 44 చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్టు అని వాడుక.
- పిల్లలు అనే పదానికి బిల్లు మొత్తంలో ఏకీకృత నిర్వచనం.
- 12 చోట్ల డీనోట్స్ స్థానంలో మీన్స్ వాడుక. దటీజ్ టూ సే స్థానంలో నేమ్లీ వాడుక.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత
- మేజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితి పెంపు.
- నేరాంగీకార పరిధి విస్తరణ. గతంలో 19 నేరాలుండగా ప్రస్తుతం 10ఏళ్లు అంతకంటే అధిక శిక్షల కేసులన్నింటికీ వర్తింపు. కొత్త బిల్లులో అత్యాచారం కేసు చేర్పు.
- మూడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి.
- మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండులో 15 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి. అయితే బెయిలు ఇవ్వడానికి ఇది అడ్డంకి కాదు.
- జప్తు, స్వాధీనం వంటి చర్యలకు విధివిధానాలు.
- తీర్పు వచ్చేవరకూ స్వయంగా హాజరుకాకపోయినా విచారణకు అవకాశం.
- దేశమంతా జీరో ఎఫ్ఐఆర్.
- ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ నమోదు.
- మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతి.
- దర్యాప్తులో ఫోరెన్సిక్ సాయానికి అనుమతి.
- తీవ్రమైన నేరాల్లో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు.
- బెయిలుకు అర్థం సరళీకరణ.
- మొదటి కేసు నిందితుల సత్వర బెయిలుకు అవకాశం.
- నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ వేసే కేసుల్లో బెయిలు సరళీకరణ.
- తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహాయింపు. నాలుగో వంతుగానీ, ఆరోవంతుగానీ విధింపు.
- కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగంగా న్యాయం కోసం ఆడియో, వీడియో రికార్డుల పరిగణన. సాక్షులు, నిందితుల వాంగ్మూలాల ఆడియో, వీడియో రికార్డులకు అవకాశం. ప్రజా ప్రతినిధులు, శాస్త్రీయ నిపుణులు, వైద్యాధికారి సాక్ష్యాలను రికార్డు చేయడానికి అవకాశం.
- శోధన, సీజ్ చేయడాన్ని వీడియో తీసే అవకాశం.
- క్షమా భిక్ష పిటిషన్ను విధివిధానాలు.
- సాక్షుల రక్షణకు ప్రత్యేక పథకం.
- బాధితుల రక్షణ సంబంధిత నిబంధనల చేర్పు. బాధితులకు విస్తృత నిర్వచనం. దర్యాప్తు వివరాలను బాధితులకు ఎప్పటికప్పుడు అందించడం.
- రెండు కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా నిబంధనల రూపకల్పన.
- తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వాధికారులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ.
- ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ మరింత సమర్థంగా పనిచేసేలా చర్యలు.
- ఘోరమైన నేరాల్లో చేతులకు బేడీలు వేసే నిబంధన చేర్పు.
- కోర్టులో హాజరుకావడానికి ఇచ్చే నోటీసు ప్రొఫార్మా తయారీ. ప్రభుత్వాధికారుల సాక్ష్యాలు ఆడియో, వీడియో రూపంలో సేకరణ.
- 35 నేరాల్లో ఆడియో, వీడియో రికార్డింగ్ చేర్పు.
- 35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయ నిర్దేశం.
భారతీయ సాక్ష్య అధినియం బిల్లు
- కొత్త బిల్లులో రెండు కొత్త సెక్షన్లు, 6 సబ్ సెక్షన్ల జోడింపు.
- 5 వివరణల జోడింపు. 4 వివరణల తొలగింపు.
- 2 నిబంధనల జోడింపు. 24 నిబంధనల తొలగింపు.
- మొత్తంగా 6 సెక్షన్ల తొలగింపు.
- దస్త్రాల్లో ఎలక్ట్రానిక్ రికార్డుల జోడింపు.
- ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతి.
- సాక్ష్యానికి నిర్వచనం.
- ఎలక్ట్రానిక్ సాక్ష్యాల స్టోరేజీ, కస్టడీ, ప్రసారం వంటి అంశాల సమర్థ నిర్వహణ.
- సెకండరీ సాక్ష్యం నోటిమాటగా, లిఖితపూర్వకంగా సేకరణ.
- న్యాయపరంగా ఆమోదించేలా, విలువ ఉండేలా, ఎన్ఫోర్స్ చేసేలా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల నిర్వహణ.
- భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్యం సేకరణ.
- వలసపాలక పదబంధాల తొలగింపు.
- భాష ఆధునికీకరణ. లింగ సున్నితత్వానికి గౌరవం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
రెండు రోజులుగా ఆందోళన బాటపట్టిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఏఐఎక్స్) సిబ్బంది సమ్మెను విరమించారు. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు. -
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
భారత్-మాల్దీవుల(India Maldives) విదేశాంగ మంత్రుల మధ్య నేడు భేటీ జరిగింది. రెండు దేశాల సంబంధాల్లో ఒడుదొడుకులు కొనసాగుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ
Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ తెలిపింది. ఆ కారణంతో కేజ్రీవాల్కు బెయిలివ్వడం.. చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని పేర్కొంది. -
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
శరద్ పవార్ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలిసారిగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
తెల్లపేపర్పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?