MHA: జమ్మూకశ్మీర్ ముస్లిం లీగ్ (MLJK-MA)పై కేంద్రం నిషేధం..
Muslim League Jammu Kashmir (Masarat Alam faction): ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్ సంస్థను కేంద్రం నిషేధిత సంస్థగా ప్రకటించింది. దీనిపై ఐదేళ్ల పాటు నిషేధం అమలులో ఉంటుందని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
దిల్లీ: ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్ (మసరత్ ఆలం వర్గం) (MLJK-MA) సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నందుకు గానూ దీనిపై వేటు వేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.
‘‘ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్ (మసరత్ ఆలం వర్గం) సంస్థను ఉపా చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు.. జమ్మూకశ్మీర్లో దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉగ్రవాదానికి మద్దతు అందిస్తుండటమే గాక.. జమ్మూకశ్మీర్లో ఇస్లామిక్ పాలనను ఏర్పాటు చేసేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’’ అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడినా.. వారిని వదిలిపెట్టబోమన్నారు. అలాంటి వారు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రతి సైనికుడు కుటుంబ సభ్యుడే.. ఆర్మీ జోలికి వస్తే ఊరుకోం: రాజనాథ్ వ్యాఖ్య
అటు కేంద్ర హోంశాఖ (MHA) కూడా దీనిపై ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థ పాక్ అనుకూల ప్రచారం చేస్తోందని, ముఖ్యంగా దీని ఛైర్మన్ మసరత్ ఆలం.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని హోంశాఖ తమ నోటిఫికేషన్లో పేర్కొంది. అందువల్ల ఈ సంస్థపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది.
ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్ (మసరత్ ఆలం వర్గం) సంస్థకు మసరత్ ఆలం నేతృత్వం వహిస్తున్నాడు. ఇతడే అతివాద ‘ఆల్ ఇండియా హురియత్ కాన్ఫరెన్స్’ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
2010 నాటి జమ్మూకశ్మీర్ అల్లర్లతో మసరత్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇదే కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థికసాయం చేశాడన్న అభియోగంతో 2019లో ఎన్ఐఏ అతడిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం అతడు తిహాడ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు దశాబ్దాల తర్వాత స్వగ్రామంలో ఓటేయనున్న జనం
ఆరు దశాబ్దాలుగా జల దిగ్బంధంలో చిక్కుకుని ఎన్నికలకు దూరమైన జనం ఈసారి సొంత గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
కోటీశ్వరులతో ఢీ!
ఎన్నికలంటే మామూలు విషయం కాదు. అర్థబలం, అంగబలం ఉండి తీరాల్సిందే. అవేమీ లేకున్నా ఓ మహిళా మణి సాహసం చేశారు. -
పదహారేళ్లుగా పోరాటం!
ఎన్నికలనగానే గెలుపు గురించే చాలామంది రాజకీయ నేతలు ఆలోచిస్తుంటారు. కానీ ఓ నాయకుడు ఇందుకు భిన్నం! ఆయన పోరాటం గురించి మాత్రమే ఆలోచిస్తారు. -
కాంగ్రెస్ వస్తే మీ పిల్లల ఆస్తి ముస్లింలకు..
కాంగ్రెస్ ‘హస్తం’లో విదేశీ శక్తుల ప్రమేయం కనపడుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ ఆరోపించారు. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ఇది స్పష్టమవుతోందన్నారు. -
సంక్షిప్త వార్తలు
కేరళలో ఓటింగ్ శాతం తగ్గేలా ఎన్నికల యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం, ఓటర్లను ఇబ్బందులకు గురిచేయడం ద్వారా అధికార సీపీఎం దుశ్చర్యలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.