97 శాతానికి చేరిన రికవరీ రేటు

భారత్‌లో గత 24 గంటల్లో  7,50,964 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,052 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,46,183కి చేరింది. కొత్తగా 13,965 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు.......

Updated : 31 Jan 2021 15:17 IST

దిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో  7,50,964 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,052 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,46,183కి చేరింది. కొత్తగా 13,965 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,04,23,125కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.99 శాతానికి పెరిగింది. 

ఇక గడిచిన 24 గంటల్లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,54,274కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,68,784కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది. 

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా టీకా తొలి డోసు అందిన వారి సంఖ్య 37,44,334కు చేరింది. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందుతున్న విషయం తెలిసిందే. సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కొవిషీల్డ్‌, భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగం కింద ప్రజలకు అందిస్తున్నారు.

ఇవీ చదవండి..

రోగి జన్యు నిర్మాణాన్ని బట్టి ఔషధం

ఆదుకుంటున్న మునుపటి కరోనా ఇన్‌ఫెక్షన్లు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని