22 ప్రాంతీయ సర్వీసులను ప్రకటించిన ఇండిగో

దేశంలో రీజినల్‌ కనెక్టివిటీని పెంచేందుకు కొత్తగా 22 సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో గురువారం ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ సర్వీసులు నడుస్తాయని విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated : 12 Feb 2021 05:14 IST

ముంబయి: దేశంలో ప్రాంతీయ అనుసంధానం పెంచేందుకు కొత్తగా 22 సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో గురువారం ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ సేవలు మొదలవుతాయని ఆ విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త సర్వీసులు రాజమహేంద్ర వరం-తిరుపతి, భువనేశ్వర్‌-పట్నా, చెన్నై-వడోదర, బెంగళూరు-షిర్డీ ఇంకా మరొకొన్ని ప్రాంతాలకు ఉన్నట్లు వెల్లడించారు.

‘‘ రీజినల్‌ కనెక్టివిటీ పథకం కింద దేశంలోని నాలుగు దిశల్లో 22 నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నాం. ఇది ప్రాంతీయ ప్రయాణాలను మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాం. సంస్కృతులకు కేంద్రాలైన వివిధ ప్రాంతాలకు ప్రాంతీయ విమానాలను నడపడం ద్వారా పర్యటకమూ అభివృద్ది చెందుతుంది’’ అని ఇండిగో ప్రధాన వ్యూహ అధికారి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ప్రయాణికులకు అనువైన ధరల్లో, సురక్షితమైన ప్రయాణ అనుభూతులను అందించేందుకు ఇండిగో ఎప్పుడూ ముందుంటుంది అని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

కరోనా వేరియంట్లను ఎలా గుర్తిస్తారంటే..

మార్చి వరకూ 80శాతం విమానాలే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని