దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ- స్పీకర్ల సదస్సులో చేసిన ప్రతిపాదనతో మరోమారు జమిలి ఎన్నికలు చర్చనీయాంశమౌతున్నాయి. లోక్సభకు, రాష్ట్రాల
చర్చనీయాంశమైన ప్రధాని మోదీ ప్రతిపాదన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ- స్పీకర్ల సదస్సులో చేసిన ప్రతిపాదనతో మరోమారు జమిలి ఎన్నికలు చర్చనీయాంశమౌతున్నాయి. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఈ జమిలిపై ఇప్పటికే మోదీ అనేకసార్లు తన సానుకూలతను వ్యక్తంజేస్తూ వస్తున్నారు. తాజాగా మరోమారు ఆయన తన మనసులో మాట బయటపెట్టారు! ఇంతకూ జమిలి ఎన్నికలు సాధ్యమేనా? వాటివెనకాలున్న సాధకబాధకాలేంటి? జమిలిపై ఇప్పటిదాకా జరిగిన కసరత్తేంటి?... చూస్తే...
ఆడ్వాణీ ఆద్యుడు...
* ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఆద్యుడు భాజపా అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ! 1990 చివర్లో ఆయనీ ప్రతిపాదన తెచ్చారు. ఆ తర్వాత నరేంద్రమోదీ మళ్లీ దాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.
* 2015లో న్యాయశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ కూడా జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది.
* 2021 కల్లా రెండుదశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించొచ్చంటూ గతంలో నీతి ఆయోగ్ ఒక నివేదిక కూడా సమర్పించింది.
* 2017లో అప్పటి ఎన్నికల చీఫ్ కమిషనర్ ఓపీ రావత్ జమిలి ఎన్నికలకు కమిషన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
* 2018లో లా కమిషన్ దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా... అన్నాడీఎంకే, అకాలీదళ్, సమాజ్వాదీ పార్టీ, తెరాస మద్దతిచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, తెదేపా, సీపీఐ, సీపీఎం, జనతాదళ్లాంటి పార్టీలు వ్యతిరేకించాయి. భాజపా, కాంగ్రెస్లు తటస్థంగా ఉండిపోయాయి.
అప్పుడలాగే జరిగాయి...
జమిలి ఎన్నికలు నిజానికి కొత్తేమీ కాదు. గతంలో మన దేశంలో జరిగాయి కూడా! 1951 నుంచి 1967 దాకా లోక్సభ, అసెంబ్లీలకు (ఎక్కువశాతం) ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1957లో 76శాతం రాష్ట్రాల అసెంబ్లీకు లోక్సభతో పాటు ఎన్నికలైతే; 1967 నాటికి ఈ శాతం 67శాతానికి తగ్గింది. 1968-69లో కొన్ని అసెంబ్లీలు ముందుగానే రద్దయ్యాయి. 1970లో లోక్సభ కూడా రద్దయింది. అప్పట్నుంచి రాష్ట్రాల, లోక్సభ ఎన్నికలు పట్టాలు తప్పి విడివిడిగా నడుస్తున్నాయి.
10 దేశాల్లో ఇదే పద్ధతి...
జమిలి ఎన్నికల్ని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అనుసరిస్తున్నాయిప్పటికే! ఈ జాబితాలో స్వీడన్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, స్పెయిన్, హంగేరీ, బెల్జియం, పోలండ్, స్లొవేనియా, అల్బేనియా... తదిరత దేశాలున్నాయి. స్వీడన్లో నాలుగేళ్ళకోసారి సెప్టెంబరులో వచ్చే రెండో ఆదివారం అన్ని రాష్ట్రాలు, జాతీయ ఎన్నికలతోపాటు స్థానిక (మున్సిపాలిటీలకు) ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇండోనేసియాలో కూడా ఇప్పుడు ప్రతి ఐదేళ్ళకోసారి ఇదే పద్ధతిలో రాష్ట్రాలు, జాతీయ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. అయితే వీటిలో చాలా దేశాలు అధ్యక్ష తరహా పాలనలో ఉన్నవి కావటం గమనార్హం!
రాజ్యాంగ సవరణ అవసరం...
అన్ని రాష్ట్రాలకు, లోక్సభకు ఇకమీదట ఎప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నా రాజ్యాంగ సవరణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. జమిలి ఎన్నికలంటే అనేక రాష్ట్రాలు తమ పదవీకాలం ముగియకముందే అసెంబ్లీను రద్దు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఆర్టికల్ 356 ద్వారా అసెంబ్లీలను రద్దు చేసే అధికారం కేంద్రానికుంది. మరే రకంగా చేసినా అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కాబట్టి, అసెంబ్లీల కాలపరిమితిని తగ్గించాలన్నా, పెంచాలన్నా సవరణ అవసరం. అది కూడా మూడింట రెండొంతుల మెజార్టీతో!
పదేపదే జమిలి మంత్రం పఠిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సర్కారు, కశ్మీర్, ముమ్మారు తలాఖ్ల మాదిరిగా మెజార్టీ పార్టీలను ఒప్పించి, తాననుకున్నట్లు రాజ్యాంగ సవరణ ద్వారా ముందుకు వెళుతుందా అనేది ఆసక్తికరం!
జమిలి ఎందుకంటే...
* పదేపదే ఎన్నికల గురించి ఆలోచించకుండా ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టిసారించొచ్చు.
* ఓట్ల శాతం పెరుగుతుంది.
* ఖర్చు తగ్గుతుంది
* అవినీతి, నల్లధన వినియోగం తగ్గుతుంది.
* సిబ్బంది వినియోగం; నిర్వహణ ఖర్చు ఆదా!
ఎందుకు వద్దంటే...
* రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం
* గడువులోపే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో ప్రభుత్వాలు మధ్యలోనే పడిపోతే ఎలా?
* జాతీయ పార్టీలకు లాభం చేకూరొచ్చు. ఎందుకంటే జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకు కూడా ప్రజలు ఓటు వేస్తే ప్రాంతీయ పార్టీలు దెబ్బతిని, జాతీయ పార్టీలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇది క్రమంగా అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తుంది.
* పార్టీల ఖర్చేమీ తగ్గకపోవచ్చు.
* ప్రభుత్వాలు ముందస్తుగానే అవిశ్వాసం ఎదుర్కొని కూలిపోతే ఎలా అనేది జమిలి ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా నిలవటంతో... 1999లో వాజ్పేయీ ప్రభుత్వ హయాంలో అప్పటి లా కమిషన్ ఒక ప్రతిపాదన చేసింది. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు... ప్రత్యామ్నాయంగా (విశ్వాస తీర్మానం నెగ్గగల) ఎవరు నెగ్గుతారో చూపించాలనే నిబంధన పెట్టాలని సిఫార్సు చేసింది.
* అలాగే ఒకేసారి ఎన్నికలు నిర్వహించినప్పుడు జాతీయ అంశాలు అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయకపోవచ్చనే ఉదాహరణలు కూడా ఉన్నాయి. 2004 నుంచి నాలుగుసార్లు ఒడిసా అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే జరిగాయి. ఫలితాలెప్పుడూ వేర్వేరుగానే ఉంటున్నాయి.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్