Kishan reddy: రాజకీయ నాయకులూ కశ్మీర్‌లో సరదాగా గడుపుతున్నారు

జమ్మూకశ్మీర్‌లో పర్యటకం బాగా అభివృద్ధి చెందడంతో కొంత మంది రాజకీయ నాయకులు సైతం అక్కడ సంతోషంగా తమ వినోద సమయాన్ని గడుపుతున్నారని కేంద్ర పర్యటక మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated : 25 Feb 2023 09:13 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పర్యటకం బాగా అభివృద్ధి చెందడంతో కొంత మంది రాజకీయ నాయకులు సైతం అక్కడ సంతోషంగా తమ వినోద సమయాన్ని గడుపుతున్నారని కేంద్ర పర్యటక మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ, అతడి సోదరి ప్రియాంక గాంధీ వాద్రాలు గుల్మర్గ్‌లో సందడి చేసిన వీడియో ఒకటి వైరల్‌ అయిన నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించడం విశేషం. ఇది మంచి పరిణామమేనని కశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమని తెలిపారు. అయితే ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. ఒక్క 2022లోనే 1.8 కోట్ల మంది జమ్మూకశ్మీర్‌ను సందర్శించారని కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం దిల్లీలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని