మరో 2 జిల్లాల్లో లాక్డౌన్: పుణెలో నైట్ కర్ఫ్యూ!
మహారాష్ట్రలో కరోనా మళ్లీ బుసలు కొడుతోంది. తగ్గినట్టే కనబడిన ఈ వైరస్ వ్యాప్తి కోరలు చాస్తుండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల అధికార యంత్రాంగ్రాలు అప్రమత్తమయ్యాయి. అకోలా, పర్భణి జిల్లాల్లో మూడు రోజుల .....
మహారాష్ట్రను మరోసారి వణికిస్తున్న కరోనా
ముంబయి: మహారాష్ట్రలో కరోనా మళ్లీ బుసలు కొడుతోంది. తగ్గినట్టే కనబడిన ఈ వైరస్ వ్యాప్తి కోరలు చాస్తుండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల అధికార యంత్రాంగ్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా నాగ్పూర్లో లాక్డౌన్ విధిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా అకోలా, పర్భణి జిల్లాల్లోనూ మూడు రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. పుణెలో మాత్రం కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. పుణె జిల్లాలో నిన్న ఒక్కరోజే 2840 కొత్త కేసులు రావడంతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అధికారులతో సమావేశమై అక్కడి పరిస్థితిపై సమీక్షించారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న వేళ వ్యాక్సినేషన్పై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అనంతరం పుణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 31వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నట్టు వెల్లడించారు. బోర్డు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని 10, 12వ తరగతులకు మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పారు.
ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు 50శాతం సామర్థ్యంతో నడపాలని, రాత్రి 10గంటల తర్వాత మూసివేయాలని ఆదేశించారు. పుణెలో షాపింగ్ మాల్స్, మార్కెట్లు, సినిమా థియేటర్లకు రాత్రి 10గంటల తర్వాత అనుమతి ఉండదన్నారు. వివాహాలు, అంత్యక్రియలు, తదితర కార్యక్రమాలకు 50మంది మించి హాజరుకారాదని నిబంధన విధించారు. ఈ నిబంధనలు ఈ రోజు రాత్రి నుంచే అమలులోకి వస్తాయని అధికారులు స్పష్టంచేశారు.
మరోవైపు, అకోలాలో లాక్డౌన్ విధించనున్నట్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 8గంటల వరకు ఈ లాక్డౌన్ అమలులో ఉంటుందని జిల్లా అధికారులు వెల్లడించారు. అలాగే, పర్భణి జిల్లాలోనూ మూడు రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రోజు రాత్రి 12 నుంచి ఈ నెల 15న ఉదయం 6గంటల వరకు లాక్డౌన్ అమలు చేయనున్నారు.
గత నెల రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాగ్పూర్లో మార్చి 15 నుంచి 21 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్టు నిన్న సాయంత్రం అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే కొత్తకేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే 14వేలకు పైగా పాజిటివ్ కేసులు రావడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉండటంతో కేంద్రం ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దేశంలో యాక్టివ్ కేసులు అత్యధికంగా ఉన్న టాప్ 10 జిల్లాలో మహారాష్ట్రలోనే ఎనిమిది జిల్లాలు ఉండటం ఆందోళనకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.