Mask: ఆ దేశాల్లో మాస్కులు అక్కర్లేదు..!
కరోనా మహమ్మారి వల్ల మనుషుల జీవితాలు తలకిందులయ్యాయి. కొవిడ్ నిబంధనలు, ఆంక్షల మధ్య.. రోజువారీ కార్యక్రమాలను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మాస్క్
కరోనా మహమ్మారి వల్ల మనుషుల జీవితాలు తలకిందులయ్యాయి. కొవిడ్ నిబంధనలు, ఆంక్షల మధ్య రోజువారీ కార్యక్రమాలను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మాస్క్ ధరించడం. బయటకు వెళ్తే కచ్చితంగా మాస్క్ ధరించాలన్న నిబంధనను అన్ని దేశాలు తప్పనిసరి చేశాయి. దుకాణానికో.. ఆస్పత్రికో వెళ్లాలన్నా మాస్క్ధరిస్తే తప్ప ఎంట్రీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలంతా ఎదరుచూస్తున్నారు. అయితే, కొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మాస్క్ ధరించకుండా సాధారణ జీవితాన్ని గడిపే భాగ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల అమెరికాలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికానే కాదు.. మరికొన్ని దేశాలు కూడా మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను తొలగించాయి. ఒకట్రెండు షరతులతో మాస్క్ లేకుండా బయట తిరిగేందుకు అనుమతిస్తున్నాయి. మరి ఆ దేశాలేవో చూద్దామా..!
ఇజ్రాయెల్
అమెరికా కంటే ముందే పలు దేశాలు మాస్క్ తప్పనిసరి నిబంధనను తొలగించాయి. అందులో ఒకటి ఇజ్రాయెల్. 92 లక్షలకుపైగా జనాభా ఉన్న ఈ దేశంలో 70 శాతానికిపైగా ప్రజలకు వ్యాక్సిన్ వేశారు. అందరికీ రెండు డోసులు పూర్తి కావడం విశేషం. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు, వేగవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియతో మహమ్మారిపై ఇజ్రాయెల్ విజయం సాధించింది. అందుకే గత ఏప్రిల్ నెలలోనే మాస్క్ తప్పనిసరి నిబంధనను తొలగించింది. ప్రజలంతా మాస్క్ లేకుండానే స్వేచ్ఛగా తిరగొచ్చని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తంగా 8.4లక్షల కొవిడ్ కేసులు నమోదు కాగా.. 6,427 మరణాలు చోటుచేసుకున్నాయి.
భూటాన్
భూటాన్.. చిన్న దేశం. కరోనా పుట్టిన చోటైన చైనా.. కరోనా రెండో దశ ప్రభావానికి తల్లడిల్లుతున్న భారత్తో సరిహద్దులు పంచుకుంటున్న ఈ దేశం.. కరోనా వ్యాప్తిని ముందుగానే గ్రహించి పూర్తి లాక్డౌన్ పెట్టకపోయినా కఠినమైన ఆంక్షలు, నిబంధనలు, వ్యాక్సినేషన్తో ప్రజలను కాపాడుకుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్కడి ప్రభుత్వం రెండు వారాల్లోనే దేశంలోని 90 శాతం ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చింది. ఆ ధైర్యంతోనే భూటాన్ను మాస్క్ ఫ్రీ దేశంగా ప్రకటించుకుంది. దాదాపు 7.79 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటి వరకు 1,882 కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్కరు మాత్రమే కరోనా కారణంగా మృతి చెందారు.
చైనా
కరోనా వ్యాప్తి ఎక్కడైతే మొదలైందో.. ఆ దేశంలో ప్రజలు ఇప్పుడు మాస్కులు లేకుండా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. మొదట్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగి ఆందోళనకు గురైన చైనా.. ఆ తర్వాత కఠినమైన లాక్డౌన్ విధించి కరోనా వ్యాప్తిని నియంత్రించింది. ఎక్కడికక్కడ తాత్కాలిక ఆస్పత్రులు నిర్మించి.. సరైన సమయంలో చికిత్స అందించి ప్రజలను రక్షించింది. సొంతగా వ్యాక్సిన్ కనిపెట్టి వ్యాక్సినేషన్ను వేగంగా చేపట్టింది. దాదాపు ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అందుకే చైనాలో సాధారణ పరిస్థితులు తొందరగా వచ్చేశాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఇప్పటివరకు 91.5వేల కొవిడ్ పాజిటివ్ కేసులు, 4,636 మరణాలు మాత్రమే నమోదయ్యాయి.
న్యూజిలాండ్
ఎలాంటి పరిస్థితులనైనా మహిళలు సమర్థంగా ఎదుర్కొంటారని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నిరూపించారు. తమ దేశంలోకి కరోనా వ్యాపించిదని తెలియగానే వేగంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టారు. కరోనా కట్టడికి ఆమె అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. దీంతో న్యూజిలాండ్ తొందరగానే కరోనా రహిత, మాస్క్ ఫ్రీ దేశంగా మారింది. జెసిండా కృషిని ప్రపంచం ప్రశంసించింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్లో 2,714మంది కరోనా బారిన పడగా.. 26 మంది బలయ్యారు.
దక్షిణ కొరియా
జులై నుంచి దక్షిణ కొరియా కూడా మాస్క్ ఫ్రీ దేశంగా మారనుంది. కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు వేసుకున్నా మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగొచ్చని ఆ దేశ ప్రధాని కిమ్ బూ-క్యుమ్ ఇటీవల ప్రకటించారు. ఇప్పటి వరకు కేవలం 7.7 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. సెప్టెంబరు నాటికి కనీసం 70 శాతం మందికి టీకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ద.కొరియాలో మొత్తం 1.5లక్షల కేసులు నమోదయ్యాయి. 1,996 మంది కరోనా వల్ల మృత్యువాత పడ్డారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం