Rahul Gandhi: మణిపుర్లో.. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షురూ
మణిపుర్ నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 110 జిల్లాల మీదుగా 67 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.
ఇంఫాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆధ్వర్యంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ ప్రారంభమైంది. మణిపుర్లోని తౌబాల్ జిల్లాలో దీనికి శ్రీకారం చుట్టారు. యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని పేర్కొన్నారు. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకూ సందర్శించలేదని విమర్శించారు. ఈ రాష్ట్రం భారత్లో అంతర్భాగం కాదని భావిస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ ప్రవేశికను రక్షించేందుకు రాహుల్ పోరాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భాజపా (BJP) మతాన్ని రాజకీయాలతో కలుపుతూ.. ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. తాము లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. మణిపుర్ ప్రజల ఓట్లను అడిగేందుకే ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారని, కానీ.. వారు బాధలో ఉన్నప్పుడు రాలేదని విమర్శించారు.
పదేళ్ల భాజపా అన్యాయంపైనే ఈ ‘న్యాయ్’ యాత్ర: కాంగ్రెస్
అంతకుముందు ఇంఫాల్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ‘ఖోంగ్జోమ్ యుద్ధ స్మారకం’ వద్దకు వెళ్లారు. 1891 ఆంగ్లో- మణిపుర్ యుద్ధంలో అమరులైనవారికి నివాళులర్పించారు. అనంతరం ‘న్యాయ్ మైదాన్’కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మణిపుర్ నుంచి ముంబయి వరకు సాగే యాత్రను ప్రారంభించారు.
‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ మొత్తం 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 67 రోజుల పాటు 6,713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబయిలో ముగుస్తుంది. దీని ద్వారా సార్వత్రిక ఎన్నికల ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికలకు దీనికి సంబంధం లేదని, ఇదో సైద్ధాంతిక యాత్ర అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానం ఢీకొని.. ఫ్లెమింగోలు మృతి
ల్యాండింగ్కు సిద్ధంగా ఉన్న విమానాన్ని ఢీకొని 30కి పైగా ఫ్లెమింగో పక్షుల గుంపు మృతి చెందింది. -
ఆ బాలుడికి పోలీస్స్టేషన్లో పిజ్జా, బిర్యానీ
Pune Car Crash: ఓ బాలుడి ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరు మృతి చెందిన ఘటనలో నిందితుడైన మైనర్ బాలుడికి పోలీసులు స్టేషన్లో సకల మర్యాదలు చేసినట్లు తెలుస్తోంది. అతడికి పిజ్జా, బిర్యానీ అందించినట్లు సమాచారం. -
స్వాతీ మాలీవాల్ కేసులో బిభవ్ ముంబయికి తరలింపు
స్వాతీ మాలీవాల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం సహాయకుడు బిభవ్ కుమార్ను నేడు దిల్లీ పోలీసులు ముంబయికి తీసుకెళ్లారు. -
డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో షేర్ చేసిన కేంద్రం
Deepfake Photos: ఏఐతో సృష్టించిన డీప్ఫేక్ ఫొటోలను గుర్తించేందుకు కొన్ని టిప్స్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఓ ట్యుటోరియల్ వీడియోను విడుదల చేసింది -
ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ చిత్రాన్ని పంచుకున్నారు. ఇంతకీ ఏంటా ఫొటో? ఎందుకంత స్పెషల్? -
స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
స్విగ్గీ (Swiggy)కి చెందిన ఒక డెలివరీ బాయ్ వీడియో ఆన్లైన్ చక్కర్లు కొడుతోంది. దానిపై డెలివరీ యాప్ కూడా స్పందించింది. -
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
ఆప్ నేతలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తన సొంత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
BJP: భాజపా ఎంపీ జయంత్ సిన్హా లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో భాజపా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు
భాజపా సీనియర్ నేత నోరుజారి ఇరకాటంలో పడ్డారు. తాను చేసిన పొరపాటుకు ప్రతిగా ఉపవాసం చేస్తానని చెప్పారు. -
పోస్టల్ బ్యాలెట్ అంశంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
పోస్టల్ బ్యాలెట్ జారీ అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. -
హేమంత్కు బెయిలిస్తే.. అందరూ అడుగుతారు: సుప్రీంకు తెలిపిన ఈడీ
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. -
పాదరక్షల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు.. ఆగ్రాలో రూ.57 కోట్ల నగదు స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కొందరు పాదరక్షల వ్యాపారుల కార్యాలయాలు, వారి అనుబంధ సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు శనివారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఈవీఎం ఎన్క్లోజరుకు పూల దండ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై కేసు
ఐదో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సోమవారం మహారాష్ట్ర నాసిక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక గురువు, స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్పై త్రయంబకేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పుడమి గర్భాన ‘బొగ్గు’మన్న మంటలు!
ఝార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని ఖలారీ రేంజ్లో బొగ్గు గని నుంచి సోమవారం ఎగసిపడుతున్న అగ్నికీలలివి. -
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
దురుసు డ్రైవింగ్తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్కు పుణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ కింద విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. -
చదవాల్సిన పుస్తకం!
మీకు విద్యారంగంపైన ఇష్టం ఉంటే మీరు ఈ పుస్తకం కచ్చితంగా చదవాల్సిందే. -
సుశీల్ మోదీ ఇంటికి వెళ్లిన ప్రధాని
లోక్సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బిహార్ రాజధాని పట్నా చేరుకొని, నేరుగా భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ ఇంటికి వెళ్లారు. -
‘ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణం తగ్గించొద్దు’
వ్యక్తుల నేర ప్రవృత్తి స్వభావాన్ని సరిదిద్ది, సమాజంలో ఇమిడిపోయేలా చేసేందుకు ఉద్దేశించిన దేశంలోని ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఆప్నకు విదేశీ నిధులు అందాయి
ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి రూ.7 కోట్ల నిధులు అందాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. -
విద్యారంగానికి జీడీపీలో 6% కేటాయింపులు తప్పనిసరి
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలంటే జీడీపీలో (స్థూల జాతీయోత్పత్తిలో) ఆరు శాతం విద్యారంగానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) ఛాన్స్లర్ జి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. -
దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ రాతలు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్ ఈ మేరకు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానం ఢీకొని.. ఫ్లెమింగోలు మృతి
-
రాయదుర్గంలో ‘ఉగ్ర’ కలకలం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
-
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి 6 కొత్త పాలసీలు: సీఎం రేవంత్రెడ్డి
-
శత్రువు ప్రశంసించిన నేతకు అధికారమా..: రాజ్నాథ్ సింగ్
-
అమెజాన్-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..