Delhi: సంపూర్ణ లాక్డౌన్కు సిద్ధం: దిల్లీ ప్రభుత్వం
అవసరమైతే సంపూర్ణ లాక్డౌన్ విధించడానికి సిద్ధమని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. దిల్లీలో వాయు కాలుష్యంపై నేడు సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ జరిగింది.
ఇంటర్నెట్డెస్క్: దిల్లీలో అవసరమైతే సంపూర్ణ లాక్డౌన్ విధించడానికి సిద్ధమని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. దిల్లీలో వాయు కాలుష్యంపై నేడు సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై. చంద్ర చూడ్, జస్టిస్ సూర్య కాంత్లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల కేవలం 10శాతం మాత్రమే కాలుష్యం వస్తోందని కోర్టుకు వెల్లడించారు. కేంద్రం వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ప్రణాళికను న్యాయస్థానానికి అందజేసింది. దీనిలో స్టోన్ క్రషర్లను, కొన్ని రకాల విద్యత్తు కర్మాగారాలను నిలిపివేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను దహనం చేయడాన్ని ఆపివేయడం వంటివి ఉన్నాయి. వీటిని అమలు చేస్తే కొంత ఫలితం ఉంటుందని సోలిసిటర్ జనరల్ కోర్టుకు వెల్లడించారు.
మరోపక్క అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం న్యాయస్థానానికి ప్రమాణ పత్రం సమర్పించింది. దీనిలో దిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో కూడా కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉందని పేర్కొంది. లాక్డౌన్ మాత్రమే తక్షణం కొంత మేరకు ప్రభావం చూపించగలదని తెలిపింది. ‘‘స్థానిక ఉద్గారాలను అదుపు చేసేందుకు సంపూర్ణ లాక్డౌన్ వంటి నిర్ణయాలు తీసుకోవడానికి దిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతోపాటు పక్కరాష్ట్రాల పరిధిలోని ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్యలే తీసుకొంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది. లాక్డౌన్ కచ్చితంగా దిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభావం చూపిస్తుంది. ఈ చర్యలు తీసుకోవడానికి మేం సిద్ధం. ఎన్సీఆర్ రీజియన్లో అమలు చేయాలని కేంద్రం గానీ, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్గానీ ఆదేశించాలి’’ అని ప్రమాణ పత్రంలో పేర్కొంది.
దిల్లీలో రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ దిల్లీ తరపున సీనియర్ అడ్వొకేట్ రాహుల్ మెహ్రాను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ‘‘ఇలాంటి కుంటి సాకులు చెబితే మీరు ఆర్జిస్తున్న ఆదాయం.. పాపులర్ స్లోగన్లపై ఎంత వెచ్చిస్తున్నారో ఆడిట్ చేయాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు.
దిల్లీ, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్, హరియాణ,ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోం అవకాశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అంతలోపు కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు రేపు భేటీ అయి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని పేర్కొంది. తదుపరి విచారణ నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.
ఇటీవల దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సోమవారం నుంచి రాష్ట్రంలోని మొత్తం పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ అధికారులు సైతం వర్క్ ఫ్రమ్ హోం చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. వారం రోజులపాటు ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని ప్రైవేటు సంస్థలకు సూచించారు. వాహనాలు తిరగడాన్ని నియంత్రించేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో దుమ్మురేగకుండా అన్ని నిర్మాణ కార్యక్రమాలను సైతం నాలుగు రోజులపాటు నిలిపివేయాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతిలో కర్ణాటకలో విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు. -
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
భారత్-మాల్దీవుల(India Maldives) విదేశాంగ మంత్రుల మధ్య నేడు భేటీ జరిగింది. రెండు దేశాల సంబంధాల్లో ఒడుదొడుకులు కొనసాగుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ
Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ తెలిపింది. ఆ కారణంతో కేజ్రీవాల్కు బెయిలివ్వడం.. చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని పేర్కొంది. -
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
శరద్ పవార్ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలిసారిగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
తెల్లపేపర్పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు