Booster Dose: మూడో డోసు మొదలుపెట్టిన రష్యా!
ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు పంపిణీ చేపడుతున్నట్లు రష్యా ప్రకటించింది.
వైరస్ తీవ్రత మరోసారి పెరగడంతో అప్రమత్తం
మాస్కో: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలైనప్పటికీ.. చాలా దేశాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు మాత్రం మూడో డోసును పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు పంపిణీ చేపడుతున్నట్లు రష్యా ప్రకటించింది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ను రిజిస్టర్ చేసుకున్న రష్యా.. మూడో డోసు పంపిణీలోనూ మొదటిస్థానంలో నిలిచింది.
కరోనా వ్యాక్సిన్ను తొలిసారిగా రిజిస్టర్ చేసుకున్న దేశంగా నిలిచిన రష్యాలో ప్రస్తుతం వైరస్ విజృంభణ మరోసారి మొదలయ్యింది. దీంతో అప్రమత్తమైన పుతిన్ ప్రభుత్వం.. మూడో డోసును (Booster Dose) ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను సవరించింది. రెండు డోసులు తీసుకొని 6నెలల కంటే ఎక్కువ సమయం గడిచిన వారు మూడో డోసు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి బూస్టర్ డోసులు ఇవ్వాలని యోచిస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో జులై ఒకటో తేదీ నుంచి బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభించారు. కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లను దృష్టిలో ఉంచుకొని.. శరీరంలో యాంటీబాడీల స్థాయిలను అధికమొత్తంలో ఉంచేందుకు రీ-వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు గమలేయా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గిన్ట్స్బర్గ్ వెల్లడించారు.
పెరుగుతోన్న కొవిడ్ మరణాలు..
కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్తో పలు దేశాల్లో తిరిగి వైరస్ విజృంభణ మొదలయ్యింది. దీని ప్రభావాన్ని చూస్తోన్న రష్యాలో రోజువారీ మరణాలు పెరుగుతున్నాయి. గతకొన్ని రోజులుగా నిత్యం అక్కడ 650కి పైగా కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. అంతేకాదు రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిత్యం 23వేల కేసులు బయటపడుతున్నట్లు అక్కడి కరోనా టాస్క్ఫోర్స్ వెల్లడించింది. గతేడాది జనవరిలోనే రష్యా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించినప్పటికీ.. ఇప్పటివరకు కేవలం 16శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించగలిగింది. వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగా సాగడం కూడా వైరస్ వ్యాప్తికి మరో కారణంగా నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లలో ఎక్కువగా రెండు డోసుల్లో తీసుకునేవే ఉన్నాయి. అంతేకాకుండా తొలి రెండు డోసుల వల్ల వృద్ధి చెందే యాంటీబాడీలు 6నెలల తర్వాత క్షీణిస్తున్నాయని నివేదికలు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లన్నీ కరోనా వైరస్ వెలుగు చూసిన తొలిరోజుల్లో ఉన్న వేరియంట్ను ఆధారంగా చేసుకొని రూపొందించారు. దీంతో, కొత్తగా పుట్టుకువస్తోన్న వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లలో మార్పులు చేయడమో.. లేదా మరో డోసుతో యాంటీబాడీల స్థాయిని మెరుగుపరచడమో చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలో మూడో డోసుతో మరింత రక్షణ లభిస్తుందన్న నిపుణుల సూచనలతో ఆయా దేశాలు మూడో డోసును ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
ఎయిరిండియా (Air India Express)లో కొందరు క్యాబిన్ సిబ్బంది చేపట్టిన ఆందోళన విరమించుకున్నప్పటికీ.. సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. -
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
Election Commission: పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ విపక్ష నేతలకు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండి పడింది. అసలేం జరిగిందంటే..? -
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడాన్ని విపక్ష నేతలు స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయమని ఆప్ అభివర్ణించింది. -
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. అతడికి నిబంధనల ప్రకారం సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. -
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
ఫేస్బుక్లో పరిచయమైన మహిళ కోసం ఓ వ్యక్తి సైనిక రహస్యాలను పాక్కు చేరవేశాడు. వీటిల్లో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!