వైట్హౌస్లో విచిత్ర పెంపుడు జంతువులు!
శ్వేతసౌధంలో కొలువుతీరిన విచిత్రమైన పెంపుడు జంతువులను గురించిన సమాచారం ఇదిగో..
మొసలి, పులి, హైనా, పాము, ఎలుగుబంటి, పట్టు పురుగులు, కోళ్లు, మేక, ఆవు, ఎలుకలు, బల్లి, గుడ్లగూబ, గుర్రం, చిలుకలు, కుక్కలు, పిల్లులు...
ఏంటివన్నీ? అడవిలోనో జంతు ప్రదర్శన శాలలోనే ఉండే జంతువులా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ పలువురు అమెరికా అధ్యక్షులు తమ పదవీ కాలంలో 18 ఎకరాల సువిశాలమైన శ్వేతసౌధంలో పెంచుకున్న జంతువులు మరి!
వాషింగ్టన్: అసలు అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు తప్ప మిగిలిన అందరూ ఏదో ఒక పెంపుడు జంతువును పెంచుకున్న వారే. 1860లో అధ్యక్షుడైన ఆండ్రూ జాన్సన్ తర్వాత పెంపుడు జంతువులు లేనిది ట్రంప్ హయాంలోనే అట. 2019నాటి గణాంకాల ప్రకారం.. అమెరికాలో సుమారు 67 శాతానికి పైగా కుటుంబాల్లో పెంపుడు జంతువులు ఉన్నాయి. ఇక కరోనా కాలంలో ఈ సంఖ్య 15 శాతం ఎక్కువైందట. ఇక అమెరికన్లకు పెంపుడు జంతువుల పట్ల మక్కువ ఎక్కువని వేరే చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో అధ్యక్షులతో పాటు శ్వేతసౌధంలో కొలువుతీరిన విచిత్రమైన పెంపుడు జంతువులను గురించిన సమాచారం ఇదిగో..
►♦ థామస్ జెఫర్సన్ (1801-09): రెండు కుక్కలు, గుర్రం, మాకిండ్ బర్డ్స్ అనే పిట్టలతో పాటు రెండు ఎలుగుబంట్లను కూడా పెంచుకున్నారు.
♦ జాన్ క్విన్సీ ఆడమ్స్ (1825-29): ఈయన సతీమణి లూసియా ఆడమ్స్ తమకు అవసరమైన పట్టు దుస్తుల కోసం పట్టుపురుగుల్నిపెంచేవారట. అంతే కాకుండా వీరు ఓ మొసలిని కూడా రెండు నెలల పాటు పెంచుకున్నారని అంటారు.
♦ మార్టిన్ వాన్ బురెన్ (1837-41): ఈ ఎనిమిదవ అధ్యక్షుడు ఒమాన్ సుల్తాన్ బహుమతిగా ఇచ్చిన రెండు పులి పిల్లలను పెంచుకున్నారు. అయితే కొంతకాలం అనంతరం వాటిని జూకు పంపేశారు.
♦ అబ్రహాం లింకన్ (1861-65): లింకన్కు అతి ప్రియమైన శునకం ఫిడో. దానితో పాటునానీ, నాంకో అనే మేకలు, జాక్ అనే టర్కీ కోడిని కూడా పెంచుకున్నారు. 1865లో ఈయన హత్యకు గురికాగా.. ఫిడోను కూడా ఆ తరువాతి ఏడాది ఎవరో చంపేశారట.
♦ ఆండ్రూ జాన్సన్ (1865-69): అగ్రరాజ్యానికి 17వ అధ్యక్షుడైన ఈయన.. తన బెడ్ రూంలో కనిపించిన తెల్ల ఎలుకలకు రోజూ ఆహారం పెట్టేవారట
♦ బెంజమిన్ హారిసన్ (1889-93): శునకాలు, మేకలతో పాటు ఈయన కుటుంబం శ్వేతసౌధంలోని సంరక్షణా కేంద్రంలో రెండు మొసళ్లను పెంచేవారట.
♦ థియోడర్ రూజ్వెల్ట్ (1858-1919): రూజ్వెల్ట్ హయాంలో అధ్యక్ష భవనం జూను తలపిస్తూ ఉండేదట. ఎలుగుబంటి, బల్లి, గినియా పందులు, హైనా (దుమ్ములగొండి), గుడ్లగూబ, నాలుగు పాములు లాంటి పెద్ద జాబితాయే ఈయన దగ్గర ఉండేదట.
♦ కాల్విన్ కూలిడ్జ్ (1923-29): పిల్లి మాదిరిగా కనిపించే రాకూన్ను పెంచుకున్నారు.
♦ జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ (1989-93):సీనియర్ బుష్ హయాంలో వైట్ హౌస్లో ఎన్నో శునకాలు ఉండేవి. వాటిలో మిల్లీ వారికి ఎంత ప్రియమైనదంటే.. ఆయన సతీమణి బార్బరా బుష్ దానిపై ఓ పుస్తకం కూడా రాసారట.
♦ జార్జ్ డబ్ల్యూ బుష్ (2001-09): జూనియర్ బుష్కు అత్యంత ప్రియమైన బార్నీ అనే స్కాటిష్ టెర్రియర్ జాతి శునకమంటే.. ఆయనతో సహా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్లో ప్రయాణించేదట. అంతేకాకుండా ‘బార్నీ కామ్’ పేరుతో వెలువడ్డ పలు వీడియోలు జంతు ప్రేమికుల ఫేవరిట్గా నిలిచాయి.
♦ బరాక్ ఒబామా(2009-17): ఈయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో బో, సన్నీ అనే శునకాలను పెంచుకున్నారు.
ఇక ప్రస్తుతానికి వస్తే.. జో బైడెన్ పెంచుకుంటున్న ఛాంప్, మేజర్ వైట్హౌస్ చేరనున్నాయి. కాగా ఇవి రెండూ జర్మన్ షెపర్డ్ జాతికి చెందినవే. గోధుమ, నలుపు రంగుల్లో ఉండే ఛాంప్ 2008 నుంచి ఈ కుటుంబంలో భాగంకాగా, నలుపు-తెలుపుల్లో ఉండే మేజర్ డెలావేర్లోని డాగ్ షెల్టర్ (శునకాల శరణాలయం) నుంచి 2018లో వచ్చింది. శ్వేత సౌధంలోకి ఈ విధమైన రెస్కూ డాగ్ ఆగమనం ఇదే తొలిసారట. అధ్యక్ష ప్రమాణ స్వీకారం మాదిరిగా.. కొందరు ఔత్సాహికులు ఈ రెండింటికీ ‘ఇన్డాగ్యురేషన్’ను ఆన్లైన్లో జనవరి 17న జరపటం విశేషం. ఇక ఉపాధ్యక్షురాలు కానున్న కమలా హారిస్కు ప్రస్తుతానికి ఏ పెంపుడు జంతువులు లేవు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కుటుంబం- హేజెల్ అనే పిల్లిని, హర్లీ అనే కుక్కను, మార్లన్ బాండో అనే కుందేలునే కాకుండా సప్పిరా అనే పామును కూడా పెంచుకుంటోంది!
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. -
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు ఇటీవల అనుమతించిన సుప్రీంకోర్టు.. ఆ ఆదేశాలను తాజాగా వెనక్కి తీసుకుంది. -
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, అప్డేట్ చేయాలని కేంద్ర విద్యాశాఖ ఎన్సీఈఆర్టీకి సూచించినట్లు సమాచారం. -
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
అమిత్ షా వీడియో ‘మూలాలను’ తెలుసుకునేందుకు ఎక్స్ (Twitter)తోపాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు దిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) కేసులో సీబీఐ దర్యాప్తు నిమిత్తం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. -
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. -
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
ఇటీవల కాలంలో డీప్ఫేక్ (AI Deepfake) కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల వేళ దాని ప్రభావం కనిపిస్తోంది. -
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!