StrayDogs: వీధి కుక్కల దాడిలో అన్నదమ్ములు బలైపోయారు!
రెండు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు వీధి కుక్కలకు (Stray Dogs) బలైన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. నైరుతి దిల్లీలోని (Delhi) వసంత్ కుంజ్ ప్రాంతంలో నివాసముండే ఓ నిరుపేద కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
దిల్లీ: దేశంలో చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పౌరులపై శునకాల దాడులు పెరుగుతోన్నట్లు నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడటం కలకలం రేపింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు ఘటనల్లో ఇవి చోటుచేసుకోవడం ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ఒక కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలోనూ రెండోది చోటుచేసుకోవడం గమనార్హం.
నైరుతి దిల్లీలోని వసంత్ కుంజ్లో ఉన్న రుచి విహార్ ప్రాంతమది. అటవీ స్థలంలో అక్కడ కొందరు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. అందులో నివాసముండే ఆనంద్ (7) అనే బాలుడు శుక్రవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో బాలుడి తల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాలుడి తల్లితో కలిసి చిన్నారి కోసం గాలించారు. రెండుగంటల తర్వాత సమీపంలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై గాయాలున్నట్లు గుర్తించిన పోలీసులు.. శవపరీక్షకు పంపించగా జంతువుల దాడిలో చనిపోయినట్లు ప్రాథమికంగా తేలింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు, క్రైం బృందాలు.. ఆ ప్రాంతంలో ఇటీవల వీధి కుక్కల దాడులు పెరిగాయని.. ఆ క్రమంలోనే ఆనంద్పైనా దాడి చేసి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు.
ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఆనంద్ సోదరుడు ఆదిత్య (5), మూత్రవిసర్జన కోసం తన స్నేహితుడితో కలిసి గుడిసె నుంచి కొంతదూరం వెళ్లారు. తిరిగి వచ్చేందుకు ప్రయత్నించే సమయంలోనే అతడిని కొన్ని కుక్కలు చుట్టుముట్టాయి. అది చూసి భయపడిన తోటి స్నేహితుడు పరుగెత్తుకు వచ్చి ఆదిత్య ఇంట్లో తెలియజేశాడు. అప్పటికే అవి బాలుడిపై దాడి చేయడంతో ఆదిత్యకూ తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆనంద్ కేసు విచారణ జరిపేందుకు అక్కడకు చేరుకున్న వసంత్ గంజ్ పోలీసులు.. ఆదిత్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఈ బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు వీధి కుక్కలకు బలికావడం ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.