Gujarat: కుమారుడు డీఎస్పీ.. తల్లి ఏఎస్‌ఐ

పిల్లలు జీవితంలో తమకన్నా ఉన్నత శిఖరాలకు ఎదిగితే తల్లిదండ్రులు పొందే సంతోషం మాటల్లో వర్ణించలేనిది.

Updated : 22 Aug 2021 12:43 IST

పిల్లలు జీవితంలో తమకన్నా ఉన్నత శిఖరాలకు ఎదిగితే తల్లిదండ్రులు పొందే సంతోషం మాటల్లో వర్ణించలేనిది. గుజరాత్‌లో సరిగ్గా ఇలాంటి అరుదైన సంఘటనే జరిగింది. ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న తల్లికి డీఎస్పీ హాదాలో ఉన్న కుమారుడు ఎదురుపడ్డారు. దీంతో ఆమె శాల్యూట్‌ చేశారు. కుమారుడు కూడా తల్లికి తిరిగి శాల్యూట్‌ చేశారు. గుజరాత్‌ అరవల్లిలో రాష్ట్రస్థాయి స్వతంత్ర వేడుకల్లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అపురూప దృశ్యం ఆవష్కృతమైంది. తల్లి పేరు మధబన్‌ రబరి కాగా.. కూమారుడి పేరు విశాల్‌ రబరి. తల్లీకుమారులు పరస్పరం శాల్యూట్‌ చేసుకుంటున్న ఫొటోను గుజరాత్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ దినేశ్‌ దాస ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫొటో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని