Saudi Arabia: సౌదీకి వెళ్లే దారేదీ: రాకపోకలపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు
కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం విమాన ప్రయాణాలపై విధించిన ఆంక్షలు
ఇతర దేశాల మీదుగా చేరుకోవడమే మార్గం
రూ.2 లక్షలకుపైగా ఆర్థిక భారం
డోలాయమానంలో ప్రవాస తెలంగాణ వాసులు
ఈనాడు, హైదరాబాద్-న్యూస్టుడే, నిర్మల్: కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం విమాన ప్రయాణాలపై విధించిన ఆంక్షలు ఆ దేశం వెళ్లాలనుకునే భారతీయుల పాలిట శాపంగా మారుతున్నాయి. గతంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల టికెట్తో సౌదీకి నేరుగా వెళ్లే వెసులుబాటు ఉండేది. కరోనా నివారణకు ఆ దేశ ప్రభుత్వం భారత్తో పాటు బ్రెజిల్, ఈజిప్ట్, ఇండొనేషియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్థాన్, వియత్నాం, అఫ్గానిస్థాన్, ఇరాన్, లెబనాన్, లిబియా, యెమెన్ తదితర దేశాలకు విమానాలు నడపడం లేదు. దీంతో ఇక్కడి వారు రూ.2 లక్షలకు పైగా వెచ్చించి దుబాయ్, రష్యా, మాల్దీవులు, ఖతార్ దేశాల మీదుగా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా క్వారంటైన్ ఖర్చులు అదనంగా భరించాలి. సౌదీకి వెళ్లాలనుకునే వారికి ఇవి ఆర్థిక భారమవుతున్నాయి. ఈ కారణంగా వారు ఆ దేశం వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు.
క్వారంటైన్లో ఉన్న తరవాతే..
కరోనాకు ముందు సౌదీ అరేబియాలో తెలంగాణ వాసులు 3 లక్షల మంది వరకు ఉండేవారు. కొవిడ్, ఇతర కారణాల వల్ల సుమారు 2.10 లక్షల మంది స్వస్థలాలకు వచ్చారు. కొవిడ్ రెండో దశ మొదలైన తర్వాత అక్కడి ప్రభుత్వం ప్రయాణాలపై నిషేధం విధించగా.. ఈ ఆగస్టులో విమానాల రాకపోకలను పునరుద్ధరించింది. దీంతోపాటు పలు నిబంధనలనూ, ఆంక్షలనూ అమలులోకి తీసుకొచ్చింది. ప్రవాసులు తిరిగి సౌదీకి రావడానికి తమ దేశం నుంచి ముందస్తుగా వీసా తీసుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశానికి నేరుగా కాకుండా రష్యా, మాల్దీవులు, దుబాయ్, ఖతార్ల నుంచి సౌదీకి రావాలని, అక్కడ 14 రోజులు క్వారంటైన్లో ఉన్న తరవాతే తమ దేశంలో అడుగు పెట్టాలన్న నిబంధన విధించింది. ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోవడంతోపాటు కరోనా రెండు డోసుల టీకాలు తీసుకోవాలని నిర్దేశించింది.
వెళ్లింది కొందరే..
ఆంక్షల కారణంగా ఆ దేశానికి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. సౌదీలో ఉన్నత స్థానంలో ఉన్న వారు, వైద్యులు, ఇతర కరోనా యోధులకు మాత్రమే అవకాశం లభించింది. మిగిలిన వారు వెళ్లలేకపోయారు. ఆ దేశానికి వెళ్లేవారు లేకపోవడంతో విమాన సర్వీసులూ నడవడం లేదు. ఒక్కోసారి పది మందిలోపు ప్రయాణికులతోనే విమానాలు వెళ్తున్నాయి. ఆగస్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వెళ్లిన వారి సంఖ్య 200లోపే ఉంది.
ఇక్కడ పని చేసుకోవడమే మేలు
సౌదీలో కొన్నేళ్ల పాటు కష్టపడి పని చేశా. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు బాగా లేవు. దీంతో నిజామాబాద్ ప్రాంతంలోనే కొంత పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. అక్కడ కష్టాలు పడేకంటే ఉన్న ఊళ్లోనే ఏదో ఒక పని చేసుకోవడం మేలు అని ఇక్కడే ఉండిపోయా. -పి.పోశెట్టి, నిజామాబాద్
ఏం చేయాలో అర్థం కావడం లేదు
ఆరేళ్ల క్రితం సౌదీ వెళ్లా. ఓ కంపెనీలో పనిచేస్తూ 9 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చా. మళ్లీ సౌదీ వెళ్లాలని సిద్ధమయ్యా. అంతలోనే దుబాయ్ నుంచి సౌదీకి విమానాలు రద్దు చేశారు. ఇప్పుడు సౌదీ వెళ్లడానికి రూ.2 లక్షలకుపైగా ఖర్చవుతుందని చెబుతున్నారు. అంత డబ్బు నా దగ్గర లేదు. సౌదీలో నేను పనిచేసిన కంపెనీ నుంచి రూ.60 వేలు రావాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
డబ్బులు లేక ఆలోచిస్తున్నా.. -కనక రాజేశ్వర్, ముజ్గి, నిర్మల్ మండలం
మూగ లింగయ్య, రాజూర,
సౌదీలో డ్రైవర్గా పని చేస్తున్న నేను గతేడాది కరోనా సమయంలో సొంతూరికి వచ్చా. నేను పనిచేసే కంపెనీ రావాలని చెప్పడంతో గత జులైలో దుబాయ్ వెళ్లి అక్కడ క్వారంటైన్లో ఉన్నా. సౌదీకి వెళ్లాలనుకునే సమయంలోనే ఆ దేశ (సౌదీ) ప్రభుత్వం విమానాలను రద్దు చేసింది. దీంతో తిరిగి స్వగ్రామానికి వచ్చా. విమాన టికెట్, క్వారంటైన్, ఇతర ఖర్చులు కలిపి రూ.1.20 లక్షలు అయ్యాయి. ప్రస్తుతం విమానాలు ప్రారంభమవగా.. ఆ దేశానికి వెళ్లడానికి రూ.2 లక్షలకుపైగా ఖర్చు అవుతుందంటున్నారు. అంత డబ్బు లేక.. వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా.-లోకేశ్వరం మండలం, నిర్మల్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?