Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్’ న్యూస్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు రోజురోజుకీ గణనీయంగా తగ్గుతున్నాయి. రికవరీల పెరుగుదల స్థిరంగా కొనసాగుతుండటంతో యాక్టివ్ కేసుల గ్రాఫ్ తగ్గుతోంది......
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు రోజురోజుకీ గణనీయంగా తగ్గుతున్నాయి. రికవరీల పెరుగుదల స్థిరంగా కొనసాగుతుండటంతో యాక్టివ్ కేసుల గ్రాఫ్ తగ్గుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకొంటోంది. కొత్త టీకాలు దేశంలోకి వస్తున్నాయి. రెండు దశల్లోనూ కరోనా వైరస్ చిన్నారులపై స్వల్ప ప్రభావమే చూపించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీకి సిక్మా 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగాఅందజేసింది. కరోనా కష్టకాలంలో ఉపశమనం ఇచ్చే కొన్నివార్తలు మీకోసం..
* భారత్లో 75 రోజుల తర్వాత కొత్త కేసులు 60వేలకు తగ్గాయి. కొవిడ్ కేసుల గరిష్ఠ స్థాయి( మే 7 రోజు) నుంచి 85శాతం మేర కరోనా కేసులు తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. 165 జిల్లాల్లోనే వందకు పైగా రోజువారీ కేసులు నమోదైనట్టు తెలిపింది. యాక్టివ్ కేసులు 10లక్షల దిగువకు చేరాయని, సగటున రోజుకు 18లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 26కోట్లకు పైగా డోసులు పంపిణీ చేయగా.. నిన్న ఒక్కరోజే 39.27లక్షల డోసులు అందించారు. వరుసగా ఎనిమిదో రోజూ పాజిటివిటీ రేటు 5శాతంకన్నా తక్కువే (3.45శాతం) నమోదైంది. యాక్టివ్ కేసులు 9.13లక్షలకు తగ్గాయి.
* కరోనా వైరస్ ప్రభావం చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావమేమీ చూపించలేదని కేంద్రం తెలిపింది. కరోనా తొలి దశలో పదేళ్ల లోపు పిల్లల్లో 3.28శాతం మందికి కరోనా సోకగా.. రెండో దశలో 3.05శాతంగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడించింది. అలాగే, 11 నుంచి 20 ఏళ్ల లోపు వారిలో తొలిదశలో ఈ వైరస్ 8.03శాతం మందికి సోకగా.. రెండో దశలో 8.5శాతం మందికి సోకినట్టు తెలిపింది. థర్డ్ వేవ్ ప్రభావం చిన్నపిల్లలపై ఉంటుందని చెప్పేందుకు ఆధారాల్లేవని కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. కొవిడ్ బారినపడకుండా తగు జాగ్రత్తలపై చిన్నారుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించింది.
* భారత్లో త్వరలోనే నోవావాక్స్ టీకా భారీగా తయారవుతుందని భావిస్తున్నట్టు నీతిఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్ తెలిపారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థతో సీరమ్ ఇన్స్టిట్యూట్ కలిసి పనిచేస్తోందని, భారత్లో టీకా ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరాయన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఆశావహంగానే ఉన్నట్టు పాల్ వివరించారు. మరోవైపు, మూడో దశలో తమ టీకా సామర్థ్యం 90శాతంగా ఉన్నట్టు నోవావాక్స్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
* కరోనాపై పోరాటంలో పలు సంస్థలు తమ వంతు సహకారం అందిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) భారీ సాయం అందించింది. రూ.2కోట్ల విలువ చేసే 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆ సంఘం ప్రతినిధులు సీఎం జగన్కు అందజేశారు.
* దేశవ్యాప్తంగా 84వేల మందికి పైగా ఉద్యోగులు, వాణిజ్య భాగస్వాములు, వారి కుటుంబ సభ్యులకు తొలి డోసు వేయించినట్టు వేదాంత కంపెనీ వెల్లడించింది. ఆగస్టు నాటికి దేశంలోని అన్ని చోట్ల వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు తొలి డోసు అందుకోని సందర్శకులకు కూడా వ్యాక్సిన్ వేసే ఆలోచనలో ఉన్నట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
* రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 1.05 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో మరో 47 లక్షలకు పైగా డోసులను రాష్ట్రాలకు పంపనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు ఉచితంగా 26కోట్లకు పైగా (26,69,14,930) వ్యాక్సిన్ డోసులను అందించింది. వాటిలో జూన్ 14 వరకు 25,67,21,069 డోసులను (వృథా అయిన వాటితో కలిపి) పంపిణీ చేసినట్టు తెలిపింది.
* డెల్టా వేరియంట్పై రెండు డోసుల ఫైజెర్ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్టు పబ్లిక్ ఇంగ్లాండ్ ప్రకటించింది. ఫైజెర్/ బయోఎన్టెక్ టీకా రెండు డోసులను తీసుకున్నవారిలో 96శాతం మందికి ఆస్పత్రిలో చేరే పరిస్థితి రావడంలేదని పరిశోధకులు తెలిపారు. అదే, ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా 92శాతం మంది పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు తేలిందన్నారు.
* కరోనా కేసులు తగ్గుతుండటంతో దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఓపీడీ సేవలను పునః ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి దశల వారీగా అవుట్ పేషెంట్ డిపార్టుమెంట్ (ఓపీడీ) సేవలను ప్రారంచాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నిర్ణయించినట్టు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డీకే శర్మ తెలిపారు. ఆన్లైన్/ టెలిఫోన్ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చని సూచించారు.
* ముంబయిలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో రెండో రోజూ కొత్త కేసులు నమోదు కాలేదు. ఫిబ్రవరి 2 తర్వాత కొత్త కేసులు నమోదు కాకపోవడం సోమవారమే తొలిసారి. ధారవిలో 6861 కేసులు నమోదు కాగా.. 6491మంది రికవరీ అయ్యారు. ధారవిలో ప్రస్తుతం 11 యాక్టివ్కేసులు మాత్రమే ఉన్నాయి.
* వైరస్ను వడకట్టడమే కాకుండా దాన్ని నిర్వీర్యం కూడా చేసే వినూత్న మాస్కును పుణెకు చెందిన ఒక అంకుర పరిశ్రమ అభివృద్ధి చేసింది. త్రీడీ ముద్రణ, ఔషధ పరిజ్ఞానాన్ని అనుసంధానించడం ద్వారా ఈ ఘనత సాధించింది. థింకర్ టెక్నాలజీస్ ఇండియా సంస్థ ఈ మాస్కును రూపొందించింది. పూర్తివార్త కోసం చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటున్నానని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా (Parshottam Rupala) పేర్కొన్నారు. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. -
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
UPSC IFS final Result| ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించిన మెయిన్ పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. -
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
విధి తల్లిదండ్రులను దూరం చేసినా ఆ బాలుడు అధైర్య పడలేదు. పదేళ్ల పసిప్రాయంలో కష్టాలను దిగమింగుతూ జీవితంలో ముందడుగు వేశాడు. అతడికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరలవ్వడంతో ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. సహాయం చేస్తామని పలువురు ముందుకువస్తున్నారు. -
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
Arvind Kejriwal: మద్యం కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. -
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోల వ్యవహారం(Prajwal Revanna sex abuse case) కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. -
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
ఇటీవల జరిగిన పూంఛ్ ఉగ్రదాడి (Poonch attack) లో ఒక సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన గురించి ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడారు. -
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
Sam Pitroda: భారత్లో భిన్నత్వంపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కన్పిస్తారని ఆయన అన్నారు. -
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు. -
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించనున్నారు. -
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు (Latest News)
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!