Viral Video: లోకల్‌ ట్రైన్‌లో మహిళల సిగపట్లు.. వీడియో వైరల్‌

లోకల్‌ ట్రైన్‌లో కొందరు మహిళలు దారుణంగా దాడి చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. కోల్‌కతాలో ఈ ఘటన వెలుగుచూసింది.

Published : 13 Jul 2023 02:04 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా లోకల్‌ రైల్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కొందరు మహిళలు రైలులో ఒకరిపై ఒకరు జుట్టుపట్టుకొని చెప్పులతో దాడి చేసుకున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఆయుషి అనే మహిళ ‘కోల్‌కతా లోకల్‌’ పేరుతో ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. కోల్‌కతాలోని లోక్‌ల్‌ ట్రైన్‌లో లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో కొందరు మహిళలు ఒకరినొకరు దూషించుకుంటూ దాడికి దిగిన దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. ఒకరిపై ఒకరు గట్టిగా కేకలు వేసుకోవడంతో పాటు చెప్పులతో కొట్టుకొని పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.

అంతేకాకుండా జుట్టు పట్టుకొని కొట్టుకోవడంతో అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. తోటి ప్రయాణికుల జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అసలు వీరి మధ్య గొడవకు కారణాలేంటనేది మాత్రం తెలియలేదు. జులై 11న ఈ వీడియోను పోస్ట్‌ చేయగా దాదాపు 27వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. మహిళలు ఒకరిపై ఒకరు సిగపట్లు పట్టుకోవడంపై తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు