Amit Shah: సున్నా ప్లస్ సున్నా సున్నానే..దిల్లీలో ఆప్, కాంగ్రెస్ పొత్తుపై అమిత్ షా
దిల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీల పొత్తుపై హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. సున్నా ప్లస్ సున్నా సున్నాగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు.
దిల్లీ: దిల్లీలో ఆప్, కాంగ్రెస్ పొత్తుపై అమిత్షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. గతంలో దిల్లీలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను భాజపా గెలుచుకుందని, దిల్లీలో ఆప్, కాంగ్రెస్లకు లోక్సభ స్థానమే లేదని ఎద్దేవా చేశారు. సున్నా ప్లస్ సున్నా సున్నాగానే మిగిలిపోతుందన్నారు. మీరు పొత్తులు పెట్టుకోండి. అయినా మోదీ 400 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దిల్లీ గ్రామోదయ అభియాన్ కింద 41 గ్రామాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా లైన్, 178 గ్రామాలలో అభివృద్ధి పనులను అమిత్ షా ప్రారంభించారు. ఆయన వెంట దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ పూరి ఉన్నారు.
‘మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా, అందులో విలీనం చేసినా ఏమీ జరగదు’ అని దిల్లీ, గుజరాత్, హర్యానాల్లో రెండు పార్టీల మధ్య పొత్తును ప్రస్తావిస్తూ షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చానన్న కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటున్నారని ఆయనపై మండిపడ్డారు. కేజ్రీవాల్ వరుస స్కామ్లకు పాల్పడ్డారని షా ఆరోపించారు. ఎక్సైజ్ కుంభకోణంలో విద్యాశాఖ మంత్రి జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి అంటూ విద్యాశాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను అరెస్టు చేసిన విషయంపై స్పందించారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలుచేస్తూ ప్రధాని మోదీ గత పదేళ్లలో దేశంలో కొత్త సంస్కృతికి నాంది పలికారని షా అన్నారు. మోదీ దేశంలోని 13 కోట్ల మంది తల్లులకు ఎల్పీజీ సిలెండర్లు అందించారు. కోటి మందికి పైపుల ద్వారా గ్యాస్ కనెక్షన్లు, 14 కోట్ల ఇళ్లకు కుళాయిల ద్వారా నీటి సౌకర్యం, 14 కోట్ల మందికి మరుగుదొడ్లు, మూడు కోట్లకు పైగా ఇళ్లు నిర్మించారని షా వివరించారు. ట్రిపుల్ తలాక్ రద్దు, సీఏఏ అమలు వంటి ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రధాని దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. దీనిద్వారా ప్రజలు కొత్త విశ్వాసంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారన్నారు. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని షా చెప్పారు. 41 గ్రామాలకు పైపుల ద్వారా సహజ వాయువు సౌకర్యం కల్పిస్తున్నామని, దిల్లీ గ్రామోదయ అభియాన్ కింద రూ.383 కోట్లతో 178 గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించడం గ్రామాల్లోని ప్రజలకు ఉపయోగకరమని ఆయన అన్నారు.
దిల్లీ ప్రజలు నిజాయతీ గల ప్రభుత్వం కోసం తమ పార్టీని ఎన్నుకున్నారని షా మాటలపై స్పందిస్తూ ఆప్ పార్టీ సమాధానం చెప్పింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపాను గద్దె దింపడం, పార్లమెంట్లో కేజ్రీవాల్కు మరింత బలం చేకూర్చడం ఖాయమని పార్టీ పేర్కొంది. ఇవి ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలని ఆప్ పేర్కొంది. ఒకవైపు పార్టీ ప్రజల కేంద్రీకృత సమస్యలపై పోరాడుతుంటే మరోవైపు భాజపా అడ్డంకులు సృష్టిస్తోంది. దిల్లీ ప్రజల అభ్యున్నతి కోసం మేము తీసుకువచ్చే పథకాలను అడ్డుకుంటోంది అని ఆప్ విమర్శించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
సార్వత్రిక ఎన్నికల క్రమంలో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. -
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
LS Polls: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా రెండు నెలల్లో దాదాపు 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ తాజాగా వెల్లడించింది. -
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
ఆలయాల్లో లైబ్రరీలు ఏర్పాటుచేయడం ద్వారా యువతను దేవాలయాల వైపు ఆకర్షించవచ్చని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. -
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
Lava MD: బెయిల్ పొడిగింపు కోసం లావా కంపెనీ మాజీ ఎండీ అతితెలివి ప్రదర్శించారు. తనలాంటి మరో వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి రెడ్ హ్యాండెడ్గా బుక్కయ్యాడు. -
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
రాయ్బరేలీ నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. -
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
Swati Maliwal assault case: స్వాతి మాలీవాల్పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్ను దిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
శస్త్రచికిత్స అనంతరం కేజ్రీవాల్ నివాసానికి రాఘవ్ చద్దా
శస్త్రచికిత్స అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా మొదటి సారిగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో కనిపించారు. -
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
లైంగిక దౌర్జన్యం కేసులో తప్పు చేసిన వారిని వదిలిపెట్టవద్దని జేడీఎస్ అధినేత దేవెగౌడ పేర్కొన్నారు. -
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర రేల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. దేశంలో రైల్వే వ్యవస్థలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
తనపై దాడి జరిగిందని స్వాతీమాలీవాల్ (Swati Maliwal) ఆరోపించిన రోజునాటి దృశ్యాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. -
కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు
లోక్సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. -
కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: నిర్మలా సీతారామన్
ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై దాడి ఘటన నేపథ్యంలో.. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. -
ఆత్మవిశ్వాసంతో ఏం సాధించొచ్చు?
ఆత్మవిశ్వాసం ప్రతిసారీ మనల్ని విజయ తీరాలకు చేర్చలేకపోవచ్చు. అన్నింటినీ మనకు అనుకూలంగా మార్చకపోవచ్చు. -
రహస్య ఓటింగ్కు విఘాతమంటూ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ప్రస్తుత ఎన్నికల విధానంలో రహస్య ఓటింగ్ అనే ప్రక్రియకు విఘాతం కలుగుతోందని, ఆ నిబంధన ఉల్లంఘనకు గురవుతోందంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
పోలింగ్ శాతాలపై అధికారిక సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు?
సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాలపై కచ్చితమైన అధికారిక సమాచారాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నను సంధించింది. -
పౌరుల స్వేచ్ఛ అంశంలో ప్రతి రోజూ విలువైందే: సుప్రీంకోర్టు
పౌరుల స్వేచ్ఛతో ముడిపడిన కేసుల్లో ప్రతి రోజూ విలువైందేనని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. -
రాజ్యాంగ ధర్మాసనం తీర్పే గీటురాయి
వివిధ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించే తీర్పులే అంతిమ నిర్ణయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సోరెన్ బెయిల్ పిటిషన్పై ఈడీకి సుప్రీం నోటీసులు
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారానికల్లా స్పందన తెలపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే మించిన సంతృప్తి ఏముంటుంది
వాణిజ్య రాజధాని ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’పై ఇటీవల రష్మిక ప్రయాణించారు. -
కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. -
నా చెంపపై ఏడెనిమిదిసార్లు కొట్టారు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తన చెంపపై ఏడెనిమిసార్లు గట్టిగా కొట్టారంటూ ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ సంచలన ఆరోపణ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు