‘అ ఆ’లో ఆ నాలుగు సన్నివేశాలు లేవట!

నితిన్‌, సమంత జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అ ఆ’.  2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ

Updated : 04 Sep 2020 13:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నితిన్‌, సమంత జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అ ఆ’.  2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. నితిన్‌, సమంతల నటన, త్రివిక్రమ్‌ దర్శకత్వం శైలి, మిక్కీ జే మేయర్‌ పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే, తొలుత త్రివిక్రమ్‌ ఈ సినిమా క్లైమాక్స్‌ను మరోలా అనుకున్నారట. అనసూయ(సమంత)ను తీసుకుని ఆనంద్‌ విహారి(నితిన్‌) తన ఊరు వెళ్లడం, అప్పటికే అక్కడకు చేరుకున్న అనూసూయ తల్లి మహాలక్ష్మి(నదియా) హారతి పట్టి ఇంటి లోపలికి పిలవడంతో సినిమాకు శుభం కార్డు వేయాలని అనుకున్నారు.

అయితే, రషెస్‌ చూసిన తర్వాత క్లైమాక్స్‌లో మరికొన్ని సన్నివేశాలు జత చేస్తే బాగుంటుందని భావించారు. అప్పుడే మహాలక్ష్మికి రామలింగం(నరేష్‌) నచ్చజెప్పే సన్నివేశం, ఆ తర్వాత ఊరికి వెళ్లిన తల్లీకూతుళ్లు గదిలో మాట్లాడుకోవడం, పల్లం వెంకన్న(రావు రమేశ్‌), ఆమె కూతురు నాగవల్లి(అనుపమ పరమేశ్వరన్‌)ల మధ్య సన్నివేశంతో పాటు, చివరిలో పొలం వద్ద పల్లం వెంకన్న, అతని కొడుకు, ఇంట్లో పనివాడి మధ్య వచ్చే సన్నివేశాలను జత చేశారు. అలా క్లైమాక్స్‌ మరో 10 నిమిషాలు పెరగడమే కాకుండా, సినిమాను చూసిన ప్రేక్షకుడికి ఒక ఫుల్‌ మీల్‌ తిన్న సంతోషం కలుగుతుంది. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు త్రివిక్రమ్‌ స్వయంగా తనతో పంచుకున్నారని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని