త్వరలోనే ‘నాలుగో సింహం’: సాయికుమార్
‘చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే..కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ ఈ డైలాగ్ వినగానే సాయికుమార్ మన కళ్లముందు మెదులుతూ ఉంటారు. రజనీకాంత్, సుమన్, రాజశేఖర్ వంటి అగ్రనటులకు తన గొంతును
హైదరాబాద్: ‘చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే..కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ ఈ డైలాగ్ వినగానే సాయికుమార్ మన కళ్లముందు మెదులుతూ ఉంటారు. రజనీకాంత్, సుమన్, రాజశేఖర్ వంటి అగ్రనటులకు తన గొంతును అరువిచ్చి వారి సక్సెస్లో భాగమయ్యారు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు, ప్రస్తుతం అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ ఉన్నారు. తాజాగా ‘శశి’సినిమాతో మంచి టాక్ తెచ్చుకున్న తన కుమారుడు, నటుడు ఆదితో కలిసి వచ్చి ఎన్నో విశేషాలు పంచుకున్నారు!
సాయికుమార్..
* ‘పోలీస్ స్టోరీ’ విడుదలై 25ఏళ్లు గడిచిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అందరూ అంటున్న పాన్ ఇండియా సినిమాను ఆనాడే ‘పోలీస్ స్టోరీ’తో చేసేశాం. నా కెరీర్లో ఆ చిత్రం ఒక మైలురాయి. అంతటి విజయాన్నిచ్చిన కన్నడ చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నా సినీ ప్రస్థానం మొదలై 50 ఏళ్లు దగ్గరపడుతోంది.
* సినీ పరిశ్రమకు నాన్న పీజే శర్మ హీరో అవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చారు. ఆయన నాగేశ్వరావుగారికి వీరాభిమాని. కేవలం ఆయన్ను చూసేందుకే జూనియర్ ఆర్టిస్టుగా స్టూడియోకు వెళ్లారట. ఆలా తెలుగు సినిమాల్లో మంచి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కాలక్రమేణా బిజీ అయ్యారు. కానీ, ఆయన కోరుకున్నంత బ్రేక్ అయితే ఇండస్ట్రీలో లభించలేదు. అందుకే నన్ను కూడా మొదటినుంచీ బాగా చదువుకుని వేరే రంగంలో స్థిరపడమనేవారు. కానీ, అమ్మ ప్రోత్సహిస్తుండేది. చివరికి ఇదిగో ఇలా ఈ స్థాయిలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా.
* ఆది కూడా మొదట క్రికెట్ను కెరీర్ ఎంచుకున్నాడు. ఇందులో నా ప్రోద్బలం కూడా ఉంది. అండర్-19 స్థాయిలో ఆంధ్రా తరఫున ఆడాడు. ఆ తర్వాత నటుడు అవ్వాలనుందని చెప్పడంతో కొన్నాళ్లు వైజాగ్ వెళ్లి సత్యానంద్గారి దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత విజయ్భాస్కర్.కె డైరెక్షన్లో ‘ప్రేమ కావాలి’ చిత్రం చేశాడు. దాని ప్రారంభోత్సవానికి ఇండస్ట్రీలోని పెద్దలందరూ వచ్చారు. ముఖ్యంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిగారు ఎంతో ప్రోత్సహించేవారు. అలాగే మా కుటుంబంలో అందరికి నాన్నగారి బేస్ వాయిస్ వారసత్వంగా రావడం అదృష్టవంతులుగా భావిస్తున్నాం. తమ్ముడు రవిశంకర్, అయప్ప కన్నడ చిత్రాల్లో బిజీ నటులు. అలాగే కుమారుడు ఆది తనదైన స్టైల్లో నటిస్తున్నాడు.
* అమ్మ గారిది కర్ణాటక- ఆంధ్రా బోర్డర్లో ఉన్న బాగేపల్లి. ఆ క్రమంలోనే ఆమె కొన్ని కన్నడ సినిమాల్లో రాజ్కుమార్ వంటి సూపర్స్టార్స్ సరసన నటించింది. అలా ఆమె ప్రభావం నాపై ఉండటంతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. కన్నడ ప్రేక్షకులు ఎంతగానో నన్ను ఆదిరిస్తారు. నా మొదటి కన్నడ సినిమాకు డబ్బింగ్ వేరేవాళ్లు చెప్పటం విశేషం. ఇప్పుడు నా వాయిస్కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. కన్నడలో హీరోగా వచ్చినంత బ్రేక్ తెలుగులో నాకు దక్కలేదనుకుంటున్నా.
* నా కెరీర్లో ‘పోలీస్స్టోరి’ తర్వాత ‘ప్రస్థానం’రూపంలో అతిపెద్ద బ్రేక్ వచ్చింది. అలాంటి పాత్రలు మరిన్ని చేయాలనుంటుంది. అలాగే కన్నడలో నటించిన ‘రంగి తరంగి’సినిమాలో నా పాత్రకు ఎన్నో అవార్డులు వచ్చాయి. అస్కార్ నామినేషన్స్ వరకు కూడా సినిమా వెళ్లింది. యక్షగాన బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. ఈ సంవత్సరం కన్నడలో నా సినిమాలు 10 విడుదలవుతున్నాయి. తెలుగులో ఇప్పుడు చేసిన ‘శ్రీకారం’ఎంతో సంతృప్తినిచ్చింది. త్వరలోనే ‘పోలీస్ స్టోరీ’ సీక్వెల్ను ‘నాలుగో సింహం’పేరుతో అన్ని భాషల్లో అదే టీమ్తో నిర్మించబోతున్నాం.
* తెలుగులో వచ్చిన ‘పటాస్’ సినిమా కన్నడ రీమేక్ ద్వారా ఆదిని శాండల్వుడ్కి పరిచయం చేద్దామనుకున్నా. కానీ మొదటి సినిమానే పోలీస్ పాత్రలో నటించడం అంత సూట్ కాదమోనని ఆదినే వెనక్కి తగ్గాడు. లేకుంటే ఒక మంచి గ్రాండ్ ఎంట్రీ అక్కడ దక్కేదేమో అని భావిస్తుంటా.
* ఇక నా రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే వెంకయ్యనాయుడి గారి ఆశీస్సులతో భాజపాలో చేరాను. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తరుఫున స్టార్ క్యాంపెనర్గా తిరిగాను. అమ్మకోరిక మేరకు 2008లో బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కొద్దిలో ఓటమి పాలయ్యా. ఆ తర్వాత పిల్లల కెరీర్ దృష్టిలో పడి ఆ నియోజకవర్గానికి దూరమయ్యా. మోదీగారితో అప్పట్లో సన్నిహిత సంబంధాలుండేవి.
ఆది:
* మా ‘శశి’ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో గాఢతతో కూడిన లవ్స్టోరి. ‘ఒకే ఒక లోకం నువ్వే..’పాట ప్రేక్షకుల్లోకి బలంగా చొచ్చుకుపోయింది. సినిమాలో ఆ సాంగ్ వచ్చే సన్నివేశం కూడా ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
* తాత, నాన్న నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచీ ఇంట్లో సినీ వాతావరణం ఉండటంతో సినిమాలపై క్రమంగా ఆసక్తి పెరిగింది. నా మొదటి సినిమా ‘ప్రేమ కావాలి’ చిత్రం డైరెక్టర్ విజయ్భాస్కర్ గారితో ఎంతో సౌకర్యవంతంగా అనిపించేది. ఆయన అన్ని విషయాలు ఎంతో కూలంకషంగా వివరించేవారు. ఆయనే నా తొలిగురువు. అలాగే కెమెరామెన్ ఛోటా కె. నాయుడు ఎంతో సహకరించేవారు.
* నేను కొత్తదర్శకులతో చేసేటప్పుడు వాళ్లు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో గమనిస్తాను. వాళ్ల నెరేషన్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది. కథ తెరపై ఎలా వస్తుందో. ‘శశి’ సినిమాకు డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు నాకు కథ చెప్పేనాటికే ఐదు సాంగ్స్ రికార్డు చేసుకుని తీసుకొచ్చాడు. అన్ని పాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే నాన్నగారితో కలిసి నటించడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను. ఒక పొలిటికల్ డ్రామా ఉన్న సినిమాల్లో నటించాలని ఉంది.
* నాన్నగారు నటించిన ‘పోలీస్ స్టోరి’, ‘ప్రస్థానం’ సినిమాలతో పాటు ‘లా అండ్ ఆర్డర్’ ‘ఏకే 47’ చిత్రాలు నాకెంతో ఇష్టం. ప్రస్తుతం ఓటీటీలో చేసే ఉద్దేశం లేదు. విఘ్నేష్, నారాయణ్ అనే కొత్త దర్శకులతో ఒక సినిమా చేస్తున్నా. అది నాలుగు పార్ట్స్లో ఉండొచ్చు. అలాగే ‘బ్లాక్’అనే చిత్రంలో నటిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం