Adivi Sesh: నాకు డబ్బు మీద పెద్ద ఆసక్తి లేదు
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలు ఎంచుకుంటూ సినీప్రియుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు అడివి శేష్.
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలు ఎంచుకుంటూ సినీప్రియుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు అడివి శేష్. ‘మేజర్’తో జాతీయ స్థాయిలో మెరిసిన ఆయన.. ఇప్పుడు ‘గూఢచారి 2’తో పాటు శ్రుతిహాసన్తో కలిసి ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఆదివారం శేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన శనివారం విలేకర్లతో ముచ్చటించారు.
ఈ 2023లో మీ నుంచి ఒక్క చిత్రం రాలేదు. ఇంతకీ ఏడాదంతా ఎలా గడిపారు?
‘‘ప్రస్తుతం నేను ‘గూఢచారి 2’తో పాటు శ్రుతిహాసన్తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు, పూర్వ నిర్మాణ పనులతోనే ఏడాదంతా తీరిక లేకుండా గడిపేశా. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాదిలోనే వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి’’.
మీ సినీ ప్రయాణం ఎక్కడ మొదలై ఎక్కడి దాకా వచ్చిందని ఆలోచించుకుంటుంటారా?
‘‘నా సినీ ప్రయాణం ఎక్కడి దాకా వచ్చిందని కాదు కానీ దాన్ని ఎంత ఆస్వాదిస్తున్నాను.. మనసుకు ఎంత దగ్గరగా తీసుకుంటున్నాను అని ఆలోచిస్తుంటా. నేను చాలా కాలం ఇది చేయాలి.. అది చేయాలంటూ ఓ పరుగులోనే ఉండిపోయా. కానీ, వాటి తాలూకూ జ్ఞాపకాలేం లేవు. ఎందుకంటే ఒక దాన్ని చూసి.. ఆస్వాదించి.. ఎంజాయ్ చేసేంత తీరిక ఉండేది కాదు. అందుకే ఇప్పుడా అనుభూతులన్నీ ఆస్వాదించాలని అనుకుంటున్నా’’.
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మీ మార్కెట్ పెరిగింది. ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నిర్మాతలు వెనకాడటం లేదు. ఈ దశని ఎలా ఆస్వాదిస్తున్నారు?
‘‘ఇదంతా దేవుడిచ్చిన వరమే. ఎందుకంటే మనమెంత కష్టపడినా.. భగవంతుడి అనుగ్రహం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి, అంతిమంగా ప్రేక్షకులు మనకు ఆ స్థాయి ఇవ్వాలి. కచ్చితంగా నేనిదంతా కష్టంతో సంపాదించుకున్నాననే ఫీలింగ్ ఉంది’’.
‘మేజర్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపై మీ ప్రతి చిత్రం తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదల చేస్తారా?
‘‘అలా ఏం లేదు. కథను బట్టే దాన్ని ఎలా విడుదల చేయాలని నిర్ణయిస్తాం. ‘గూఢచారి 2’నే తీసుకుంటే అది ఐదు దేశాల్లో జరిగే కథతో ఉంటుంది. ఆ స్క్రిప్ట్.. దాని స్కేల్ మన తెలుగు వాళ్లకే కాక మిగిలిన అన్ని భాషల వాళ్లకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇక శ్రుతిహాసన్తో కలిసి చేయనున్న యాక్షన్ డ్రామాని ‘మేజర్’ తరహాలో తెలుగు, హిందీ భాషల్లో విడివిడిగా చిత్రీకరించనున్నాం.అందుకే తెలుగు, హిందీ భాషల్లో పట్టున్న నటీనటుల్నే ఆ సినిమా కోసం ఎంచుకుంటున్నాం’’.
‘గూఢచారి 2’ కథ ‘గూఢచారి’కి కొనసాగింపుగా ఉంటుందా? మరో కొత్త కథతో సాగుతుందా?
‘‘గూఢచారి’ ఏ మంచు పర్వతాల్లో ముగిసిందో అక్కడి నుంచే ‘గూఢచారి 2’ కథ మొదలవుతుంది.’’
సినిమాల ఎంపికలో మీరు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఈ మధ్య చాలా పెద్ద ఆఫర్ను కాదనుకున్నారని తెలిసింది. నిజమేనా?
‘‘ఇండస్ట్రీలో డబ్బులైనా సంపాదించొచ్చు. మంచి సినిమాలైనా చెయ్యొచ్చు. చాలా అరుదుగా కొంతమందికే మంచి సినిమాలపై డబ్బు చేసుకోవడం కుదురుతుంది. నాకు డబ్బు మీద పెద్ద ఆసక్తి లేదు. అందుకే సహజంగానే కేవలం మంచి సినిమాలపైకి దృష్టి వెళ్లిపోతుంది. నేనెప్పుడూ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఎలా ఫీలవుతారన్న దానిపైనే దృష్టి పెడతా. అందుకే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా చాలా సెలక్టివ్ చిత్రాలే చేస్తున్నా’’.
భవిష్యత్తులో మళ్లీ సహాయ పాత్రలు చేస్తారా? శ్రుతిహాసన్తో చేయనున్న చిత్రమెలా ఉంటుంది?
‘‘సినిమాలో ఏ పాత్రైనా సరే ఆ కథని, సినిమాని నా పాత్ర ముందుకు నడిపించగలగాలి. అలాంటి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను. ఇక నేను, శ్రుతిహాసన్ కలిసి చేయనున్న సినిమా చాలా ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీగా ఉంటుంది. ఇదొక కొత్త జానర్ చిత్రం’’.
మీ ప్రతి చిత్రంలోనూ రచనా పరంగా మీ వంతు సహకారం అందిస్తుంటారు. అలాగే దర్శకత్వంలోనూ చొరవ తీసుకుంటుంటారా?
‘‘నాకు తెలిసి నేను మంచి నటుణ్ని.. రచయితను మాత్రమే. దర్శకుణ్ని మాత్రం కాదు. ఎందుకంటే దర్శకత్వం చేయాలంటే చాలా ఓర్పు కావాలి. నాకది లేదు. అందులోనూ నా శైలి పూర్తిగా వేరు. ప్రతిదీ మనసుతో ఆలోచించేస్తా. నిజానికది నటుడు చేయాల్సిన పని. దర్శకుడు ఎప్పుడూ మెదడుతో ఆలోచిస్తుంటాడు. దీన్ని చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోరు. నా రచనలెప్పుడూ నా చిత్రాలకే పరిమితం. నేను రాసేటప్పుడు ఎప్పుడూ నటుడిగా ఆలోచించను. అలాగే షాట్లో ఉన్నప్పుడు రచయితగా ఆలోచించను. ఇప్పుడు చేస్తున్న నా రెండు సినిమాలు పూర్తయ్యాక కేవలం నటుడిగానే మరో రెండు చిత్రాలు చేయనున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!