Ajay Devgn: ‘ఆ మాటలు అనేవారికి మా కష్టం తెలియదు’.. బంధుప్రీతిపై అజయ్ దేవ్గణ్ వ్యాఖ్యలు
కరణ్ జోహర్ (Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) షోలో పాల్గొన్నారు నటుడు అజయ్ దేవ్గణ్ (Ajay Devgn), దర్శకుడు రోహిత్ శెట్టి. సినీ పరిశ్రమలో తమ ప్రస్థానాన్ని వెల్లడించారు.
ఇంటర్నెట్డెస్క్: సినీ పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువ అంటూ సోషల్మీడియా వేదికగా జరుగుతున్న చర్చను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ (Ajay Devgn). ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం తాము ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటామని ఆయన తెలిపారు. అయితే, తమ కష్టాలు బయటవాళ్లకు తెలియదన్నారు. సినీ పరిశ్రమలోకి తన తండ్రి ఎలా వచ్చారో కూడా వివరించారు.
‘‘పంజాబ్కు చెందిన మా నాన్న 13 ఏళ్ల చిన్న వయసులో ఇంట్లో నుంచి పారిపోయి రైల్లో ముంబయి వచ్చారు. టికెట్ లేకుండా రైలులో ప్రయాణించినందుకు కొన్నిరోజులు జైల్లో పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఆకలితో రోజులు గడిపారు. కొంతకాలం పాటు ట్యాక్సీలు శుభ్రం చేసే పనిలో చేరారు. ఇల్లు లేకపోవడంతో ట్యాక్సీల్లోనే నిద్రపోయేవారు. ఆ తర్వాత ఓ ముఠాలో గ్యాంగ్స్టర్గా చేరారు. ఓసారి వీధి గొడవలో మా నాన్న ఫైట్స్ చూసిన యాక్షన్ డైరెక్టర్ రవి ఖన్నా సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా, మా నాన్న స్టంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పరిశ్రమలోకి వచ్చాక కూడా ఆయన సమస్యలు ఎదుర్కొన్నారు. సినిమా అవకాశాల కోసం నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగారు’’
Dunki Review: రివ్యూ: డంకీ.. ఈ ఏడాది షారుక్ హ్యాట్రిక్ కొట్టారా..?
‘‘ప్రస్తుతం సోషల్మీడియా వేదికగా చాలామంది బంధుప్రీతి గురించి మాట్లాడుతున్నారు. మేము ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందన్న విషయాన్ని వాళ్లు గుర్తించడం లేదు. ఈ స్థాయికి రావడం అంత తేలికైన విషయం కాదు. ఈ పోరాటంలో దాదాపు 40 ఏళ్లు గడిచిపోయాయి. నా శ్రమను వాళ్లు చూడటం లేదు. అసిస్టెంట్గా రోహిత్ శెట్టి పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు.. తినడానికి కూడా అతని వద్ద డబ్బుల్లేవు’’ అని అజయ్ చెప్పారు.
తన కుమార్తె నైసాపై వస్తోన్న ట్రోల్స్ను ఉద్దేశించి.. ‘‘ఆ ట్రోల్స్, మీమ్స్ చూసి మేము ఎంతో బాధపడ్డాం. కొంతమంది మన గురించి అనవసర వ్యాఖ్యలు చేయొచ్చు. అంటే దాని అర్థం ప్రపంచం మొత్తానికి మనపై అదే విధమైన అభిప్రాయం ఉందని కాదు. మనం మంచి విషయాలు రాస్తే.. దాన్ని చదవడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. అందుకే కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు’’ అని అజయ్ అన్నారు. ప్రస్తుతానికి తన కుమార్తెకు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని, భవిష్యత్తులో ఆమె ఆలోచన ఎలా ఉంటుందో తనకు తెలియదన్నారు. భవిష్యత్తులో ఆమె ఇండస్ట్రీలోకి వస్తానంటే అంగీకరిస్తానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కొత్తదనం నిండిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది. -
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
తండేల్ మూవీ ఓటీటీ డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
ఈటీవీ విన్లో ఆకట్టుకుంటోన్న క్రైమ్ కామెడీ చిత్రం
ఈటీవీ విన్ వేదికగా విడుదలైన 'శర్మ & అంబానీ' ప్రేక్షకాదరణ పొందుతోంది. -
ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..
‘గామి’ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 సంస్థ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. -
ఓటీటీలోకి కన్నడ బ్లాక్బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కన్నడ నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera) -
ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘భీమా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కీర్తి సురేశ్ నటించిన ‘సైరన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్పై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై నిర్మాత మరోసారి స్పందించారు. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. -
ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఇటీవల కాలంలో యూత్ను బాగా ఆకర్షించిన మలయాళీ ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’. ఇప్పుడు ఇది ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్