Adipurush: ఏపీలో ‘ఆదిపురుష్‌’ టికెట్‌ ధరలు పెంపు

‘ఆదిపురుష్‌’ టికెట్‌ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 14 Jun 2023 18:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) టికెట్‌ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ మేరకు సింగిల్‌ స్క్రీన్‌, మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.50 పెంచింది. సినిమా విడుదలైన నాటి నుంచి 10 రోజులపాటు ఇవే ధరలు కొనసాగనున్నాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లో ప్రస్తుతం టికెట్‌ ధర రూ.115 ఉండగా, దీనికి అదనంగా రూ.50 చెల్లించాలి. అలాగే మల్టీప్లెక్స్‌లో రూ.177 ఉండగా.. దానిపై మరో రూ.50 చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు 3డీ గ్లాసులకు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే, స్పెషల్‌ షోలకు మాత్రం అనుమతివ్వలేదు. ఇప్పటికే తెలంగాణలో ఈ సినిమాకు టికెట్‌ ధరలు పెంచిన విషయం తెలిసిందే. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో టికెట్‌పై రూ.50 పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే ఆరో షోకూ అనుమతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని