Anushka Shetty: ప్రభాస్‌కు అనుష్క ఛాలెంజ్‌.. ఇప్పుడు రామ్ చరణ్‌ వంతు..

అనుష్క శెట్టి - నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా అనుష్క ఓ ఛాలెంజ్‌కు తెరతీసింది.

Updated : 06 Sep 2023 16:51 IST

హైదరాబాద్‌: అనుష్క శెట్టి (Anushka Shetty) నటించిన తాజా చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. పి.మహేష్‌బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి ప్రధానపాత్రలో నటించారు. ఇక ఈ చిత్రం రేపు (సెప్టెంబర్‌ 7) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అనుష్క ఓ సరికొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ సినిమాలో (Miss Shetty Mr. Polishetty) ఆమె చెఫ్‌ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో తనకు ఇష్టమైన వంటకం తయారీ విధానాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన అనుష్క ..#MSMPRecipeChallenge పేరుతో ఓ కొత్త ఛాలెంజ్‌కు తెరతీసింది.

మంగుళూరు చికెన్‌ కర్రీ, నీర్‌ దోశ ఎలా చేయాలో తెలుపుతూ అనుష్క ట్వీట్‌ చేసింది. ‘‘నేను ఈ సినిమాలో చెఫ్‌ పాత్రలో కనిపించనున్నా.. అందుకే నాకు ఇష్టమైన వంటకాలను మీతో పంచుకున్నా. అంతేకాదు ఓ కొత్త ఛాలెంజ్‌ను మొదలుపెడుతున్నా. మొదట దీన్ని ప్రభాస్‌కు విసురుతున్నా. భోజనాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి.. అలాగే అతిథులను భోజనాలతో ఆశ్చర్యపరిచే వ్యక్తి ప్రభాస్‌. ఇప్పుడు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ప్రభాస్‌ పోస్టు పెట్టాలి’’ అంటూ అతడిని ట్యాగ్‌ చేసిందీ బ్యూటీ.

ఆ విషయంలో నయన్‌కు తొలి చిత్రం.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డు.. ‘జవాన్‌’ విశేషాలివీ!

ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించినట్లు తెలుపుతూ ప్రభాస్‌ (Prabhas) వెంటనే తన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. రొయ్యల పులావ్‌ అంటే ఇష్టమని తెలిపాడు. అలాగే తాను ఈ ఛాలెంజ్‌ను రామ్‌ చరణ్‌కు విసురుతున్నట్లు చెప్పారు. ‘నాకు స్వీటీ (అనుష్క) ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. కానీ తనకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటో ఇప్పుడే తెలిసింది. నేను తన ఛాలెంజ్‌ను తీసుకున్నాను. అలాగే నాకు ఇష్టమైన రొయ్యల పులావ్‌ను ఎలా చేయాలో మీతో పంచుకున్నాను. రామ్ చరణ్‌ దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా’ అంటూ అతడిని ట్యాగ్‌ చేశాడు. అలాగే అభిమానులు కూడా వారికి ఇష్టమైన వంటకాలను పంచుకోవాల్సిందిగా ప్రభాస్‌ కోరారు. దీనిపై స్పందించిన రామచరణ్‌.. ముందుగా చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. తనకు చేపల పులుసు అంటే ఇష్టమని తెలుపుతూ దాన్ని తయారుచేసే విధానాన్ని ట్వీట్‌ చేశారు. తాను రానాకు ఛాలెంజ్‌ విసురుతున్నట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని