‘అసలేం జరిగిందో’ తెలుసుకోవాలనుందా!

ప్రేక్షకులు హారర్‌ జోనర్‌లో తెరకెక్కే సినిమాలంటే ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు.  శ్రీరామ్‌ హీరోగా ‘అసలేం జరిగింది’అనే చిత్రం ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమౌతోంది. తాజాగా నటుడు అల్లరి నరేశ్‌ చేతుల మీదుగా విడుదలైన చిత్ర ట్రైలర్‌లో ఆ విషయం

Published : 24 Mar 2021 20:41 IST

హైదరాబాద్‌: ప్రేక్షకులు హారర్‌ జోనర్‌లో తెరకెక్కే సినిమాలంటే ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు.  శ్రీరామ్‌ హీరోగా ‘అసలేం జరిగింది’అనే చిత్రం ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమౌతోంది. తాజాగా నటుడు అల్లరి నరేశ్‌ చేతుల మీదుగా విడుదలైన చిత్ర ట్రైలర్‌లో ఆ విషయం స్పష్టమౌతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చిత్రబృందం వెల్లడించింది. సిటీ నుంచి పల్లెటూరికి వెళ్లిన యువకుడు ఒక అమ్మాయి ప్రేమలో పడటం, అదే ఊరికి అమావాస్య రోజున ఒక మాంత్రికుడి నుంచి సమస్య ఎదురవటం, ప్రేమించిన అమ్మాయి అందులో చిక్కుకోవడంతో హీరో కాపాడే నేపథ్యంలో సినిమా తెరకెక్కించినట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమౌతోంది. సంచితా పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్వీఆర్‌ తెరకెక్కించారు. చిన్నా నేపథ్య సంగీతం అందించగా, యేలేంధర్‌ మహవీర్‌ పాటలకు బాణీలు కట్టారు. ఎక్సోడస్‌ మీడియా పతాకంపై నీలిమా చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి లేటెందుకు ఆ ట్రైలర్‌ మీరు చూసేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని